Political News

బాబు విన్న‌పం.. మోడీ యూట‌ర్న్ తీసుకుంటారా?

జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంటోంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి దూకుడుగా ఉన్న కేంద్ర స‌ర్కారుకు.. కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న కీల‌క పార్టీ టీడీపీ నుంచి కొంత వ్య‌తిరేక‌త‌.. అదేస‌మ‌యంలో విన్న‌పాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. జ‌మిలి ఎన్నిక‌ల‌ను 2029లో నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు కోరుతున్నారు. త‌ద్వారా.. కూట‌మి స‌ర్కారుకు ద‌క్కిన ఐదేళ్ల కాలాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

కానీ, కేంద్రం తీసుకువ‌స్తున్న జ‌మిలి బిల్లు క‌నుక ఆమోదం పొందితే.. 2027-28 మ‌ధ్య‌లోనే ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. ఇది కూట‌మి స‌ర్కారుకు ఏపీలో శ‌రాఘాతంగా మార‌నుంది. ఎందుకంటే.. ఈలోగా నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం.. సాధ్యం కాదు. ముఖ్యంగా రాజ‌ధాని నిర్మాణం స‌గం కూడా పూర్త‌య్యే అవ‌కాశం లేదు. ఇక‌, పోల‌వ‌రం, మెట్రోరైలు ప్రాజెక్టులు, ఉపాధి క‌ల్ప‌న‌, పెట్టుబ‌డులు.. వంటివి కూడా సాకారం అయ్యే అవ‌కాశం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది.

ఇది ప‌రోక్షంగా వైసీపీకి అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుందన్న‌ది సీఎం చంద్ర‌బాబు స‌హా కూట‌మి నాయ‌కుల అభిప్రాయంగా ఉంది. అందుకే.. జ‌మిలి వ‌చ్చినా.. 2029లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఇది ఆయ‌న చేతిలోనే ఉందా? అంటే లేదు. కేంద్ర ప్ర‌భుత్వం జ‌మిలి తీసుకువ‌స్తే.. ఆయ‌న కూడా చేయ‌గ‌లిగింది ఏమీ ఉండ‌దు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా.. కేంద్రానికి విన్న‌వించిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇప్ప‌టికిప్పుడు జ‌మిలితో ఇరు ప‌క్షాల‌కు ఇబ్బందేన‌న్న‌ది చంద్ర‌బాబు మాట‌. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని.. ఆయ‌న విన్న‌వించారు. అయితే.. తాము జ‌మిలికి వ్య‌తిరేకం కాద‌ని.. కానీ, స‌మ‌యం సంద‌ర్భం మాత్రం ఇది కాద‌న్న‌ది ఎన్డీయే ప‌క్ష నాయ‌కుడిగా చంద్ర‌బాబు చేసిన మేలిమి సూచ‌న‌గా.. జాతీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా మోడీ ప్ర‌భంజ‌నం ఉంద‌ని భావించినా.. కాంగ్రెస్‌పై సింప‌తీ ప‌వ‌నాలు వీస్తే.. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి జ‌మిలి తీసుకువ‌చ్చినా.. 2029 వ‌ర‌కువెయిట్ చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు సూచ‌న‌. ఈ క్ర‌మంలోనే మోడీ స‌ర్కారు కూడా.. ఈ ద‌ఫా బిల్లును వాయిదా వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత శీతాకాల స‌మావేశాల్లో ఈ బిల్లును పార్ల‌మెంటుకు స‌మ‌ర్పించ‌డం లేద‌ని జాతీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Satya

Recent Posts

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

55 minutes ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

1 hour ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

2 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

2 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

2 hours ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

2 hours ago