Political News

బాబు విన్న‌పం.. మోడీ యూట‌ర్న్ తీసుకుంటారా?

జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంటోంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి దూకుడుగా ఉన్న కేంద్ర స‌ర్కారుకు.. కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న కీల‌క పార్టీ టీడీపీ నుంచి కొంత వ్య‌తిరేక‌త‌.. అదేస‌మ‌యంలో విన్న‌పాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. జ‌మిలి ఎన్నిక‌ల‌ను 2029లో నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు కోరుతున్నారు. త‌ద్వారా.. కూట‌మి స‌ర్కారుకు ద‌క్కిన ఐదేళ్ల కాలాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

కానీ, కేంద్రం తీసుకువ‌స్తున్న జ‌మిలి బిల్లు క‌నుక ఆమోదం పొందితే.. 2027-28 మ‌ధ్య‌లోనే ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. ఇది కూట‌మి స‌ర్కారుకు ఏపీలో శ‌రాఘాతంగా మార‌నుంది. ఎందుకంటే.. ఈలోగా నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం.. సాధ్యం కాదు. ముఖ్యంగా రాజ‌ధాని నిర్మాణం స‌గం కూడా పూర్త‌య్యే అవ‌కాశం లేదు. ఇక‌, పోల‌వ‌రం, మెట్రోరైలు ప్రాజెక్టులు, ఉపాధి క‌ల్ప‌న‌, పెట్టుబ‌డులు.. వంటివి కూడా సాకారం అయ్యే అవ‌కాశం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది.

ఇది ప‌రోక్షంగా వైసీపీకి అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుందన్న‌ది సీఎం చంద్ర‌బాబు స‌హా కూట‌మి నాయ‌కుల అభిప్రాయంగా ఉంది. అందుకే.. జ‌మిలి వ‌చ్చినా.. 2029లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఇది ఆయ‌న చేతిలోనే ఉందా? అంటే లేదు. కేంద్ర ప్ర‌భుత్వం జ‌మిలి తీసుకువ‌స్తే.. ఆయ‌న కూడా చేయ‌గ‌లిగింది ఏమీ ఉండ‌దు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా.. కేంద్రానికి విన్న‌వించిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇప్ప‌టికిప్పుడు జ‌మిలితో ఇరు ప‌క్షాల‌కు ఇబ్బందేన‌న్న‌ది చంద్ర‌బాబు మాట‌. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని.. ఆయ‌న విన్న‌వించారు. అయితే.. తాము జ‌మిలికి వ్య‌తిరేకం కాద‌ని.. కానీ, స‌మ‌యం సంద‌ర్భం మాత్రం ఇది కాద‌న్న‌ది ఎన్డీయే ప‌క్ష నాయ‌కుడిగా చంద్ర‌బాబు చేసిన మేలిమి సూచ‌న‌గా.. జాతీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా మోడీ ప్ర‌భంజ‌నం ఉంద‌ని భావించినా.. కాంగ్రెస్‌పై సింప‌తీ ప‌వ‌నాలు వీస్తే.. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి జ‌మిలి తీసుకువ‌చ్చినా.. 2029 వ‌ర‌కువెయిట్ చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు సూచ‌న‌. ఈ క్ర‌మంలోనే మోడీ స‌ర్కారు కూడా.. ఈ ద‌ఫా బిల్లును వాయిదా వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత శీతాకాల స‌మావేశాల్లో ఈ బిల్లును పార్ల‌మెంటుకు స‌మ‌ర్పించ‌డం లేద‌ని జాతీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on December 16, 2024 1:02 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

1 hour ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

1 hour ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

4 hours ago