జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి దూకుడుగా ఉన్న కేంద్ర సర్కారుకు.. కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న కీలక పార్టీ టీడీపీ నుంచి కొంత వ్యతిరేకత.. అదేసమయంలో విన్నపాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. జమిలి ఎన్నికలను 2029లో నిర్వహించాలని చంద్రబాబు కోరుతున్నారు. తద్వారా.. కూటమి సర్కారుకు దక్కిన ఐదేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
కానీ, కేంద్రం తీసుకువస్తున్న జమిలి బిల్లు కనుక ఆమోదం పొందితే.. 2027-28 మధ్యలోనే ఎన్నికలకు అవకాశం ఉంటుంది. ఇది కూటమి సర్కారుకు ఏపీలో శరాఘాతంగా మారనుంది. ఎందుకంటే.. ఈలోగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం.. సాధ్యం కాదు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం సగం కూడా పూర్తయ్యే అవకాశం లేదు. ఇక, పోలవరం, మెట్రోరైలు ప్రాజెక్టులు, ఉపాధి కల్పన, పెట్టుబడులు.. వంటివి కూడా సాకారం అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
ఇది పరోక్షంగా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టే అవుతుందన్నది సీఎం చంద్రబాబు సహా కూటమి నాయకుల అభిప్రాయంగా ఉంది. అందుకే.. జమిలి వచ్చినా.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఇది ఆయన చేతిలోనే ఉందా? అంటే లేదు. కేంద్ర ప్రభుత్వం జమిలి తీసుకువస్తే.. ఆయన కూడా చేయగలిగింది ఏమీ ఉండదు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా.. కేంద్రానికి విన్నవించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికిప్పుడు జమిలితో ఇరు పక్షాలకు ఇబ్బందేనన్నది చంద్రబాబు మాట. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని.. ఆయన విన్నవించారు. అయితే.. తాము జమిలికి వ్యతిరేకం కాదని.. కానీ, సమయం సందర్భం మాత్రం ఇది కాదన్నది ఎన్డీయే పక్ష నాయకుడిగా చంద్రబాబు చేసిన మేలిమి సూచనగా.. జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందని భావించినా.. కాంగ్రెస్పై సింపతీ పవనాలు వీస్తే.. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని.. కాబట్టి జమిలి తీసుకువచ్చినా.. 2029 వరకువెయిట్ చేయాలన్నది చంద్రబాబు సూచన. ఈ క్రమంలోనే మోడీ సర్కారు కూడా.. ఈ దఫా బిల్లును వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటుకు సమర్పించడం లేదని జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on December 16, 2024 1:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…