Political News

బాబు విన్న‌పం.. మోడీ యూట‌ర్న్ తీసుకుంటారా?

జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంటోంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి దూకుడుగా ఉన్న కేంద్ర స‌ర్కారుకు.. కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న కీల‌క పార్టీ టీడీపీ నుంచి కొంత వ్య‌తిరేక‌త‌.. అదేస‌మ‌యంలో విన్న‌పాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. జ‌మిలి ఎన్నిక‌ల‌ను 2029లో నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు కోరుతున్నారు. త‌ద్వారా.. కూట‌మి స‌ర్కారుకు ద‌క్కిన ఐదేళ్ల కాలాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

కానీ, కేంద్రం తీసుకువ‌స్తున్న జ‌మిలి బిల్లు క‌నుక ఆమోదం పొందితే.. 2027-28 మ‌ధ్య‌లోనే ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంటుంది. ఇది కూట‌మి స‌ర్కారుకు ఏపీలో శ‌రాఘాతంగా మార‌నుంది. ఎందుకంటే.. ఈలోగా నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం.. సాధ్యం కాదు. ముఖ్యంగా రాజ‌ధాని నిర్మాణం స‌గం కూడా పూర్త‌య్యే అవ‌కాశం లేదు. ఇక‌, పోల‌వ‌రం, మెట్రోరైలు ప్రాజెక్టులు, ఉపాధి క‌ల్ప‌న‌, పెట్టుబ‌డులు.. వంటివి కూడా సాకారం అయ్యే అవ‌కాశం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది.

ఇది ప‌రోక్షంగా వైసీపీకి అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుందన్న‌ది సీఎం చంద్ర‌బాబు స‌హా కూట‌మి నాయ‌కుల అభిప్రాయంగా ఉంది. అందుకే.. జ‌మిలి వ‌చ్చినా.. 2029లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఇది ఆయ‌న చేతిలోనే ఉందా? అంటే లేదు. కేంద్ర ప్ర‌భుత్వం జ‌మిలి తీసుకువ‌స్తే.. ఆయ‌న కూడా చేయ‌గ‌లిగింది ఏమీ ఉండ‌దు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా.. కేంద్రానికి విన్న‌వించిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇప్ప‌టికిప్పుడు జ‌మిలితో ఇరు ప‌క్షాల‌కు ఇబ్బందేన‌న్న‌ది చంద్ర‌బాబు మాట‌. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని.. ఆయ‌న విన్న‌వించారు. అయితే.. తాము జ‌మిలికి వ్య‌తిరేకం కాద‌ని.. కానీ, స‌మ‌యం సంద‌ర్భం మాత్రం ఇది కాద‌న్న‌ది ఎన్డీయే ప‌క్ష నాయ‌కుడిగా చంద్ర‌బాబు చేసిన మేలిమి సూచ‌న‌గా.. జాతీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా మోడీ ప్ర‌భంజ‌నం ఉంద‌ని భావించినా.. కాంగ్రెస్‌పై సింప‌తీ ప‌వ‌నాలు వీస్తే.. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి జ‌మిలి తీసుకువ‌చ్చినా.. 2029 వ‌ర‌కువెయిట్ చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు సూచ‌న‌. ఈ క్ర‌మంలోనే మోడీ స‌ర్కారు కూడా.. ఈ ద‌ఫా బిల్లును వాయిదా వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత శీతాకాల స‌మావేశాల్లో ఈ బిల్లును పార్ల‌మెంటుకు స‌మ‌ర్పించ‌డం లేద‌ని జాతీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Satya

Recent Posts

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

3 minutes ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

46 minutes ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

58 minutes ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

1 hour ago

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…

3 hours ago

ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇవ్వబోం: కోమటిరెడ్డి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…

3 hours ago