జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి దూకుడుగా ఉన్న కేంద్ర సర్కారుకు.. కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న కీలక పార్టీ టీడీపీ నుంచి కొంత వ్యతిరేకత.. అదేసమయంలో విన్నపాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. జమిలి ఎన్నికలను 2029లో నిర్వహించాలని చంద్రబాబు కోరుతున్నారు. తద్వారా.. కూటమి సర్కారుకు దక్కిన ఐదేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
కానీ, కేంద్రం తీసుకువస్తున్న జమిలి బిల్లు కనుక ఆమోదం పొందితే.. 2027-28 మధ్యలోనే ఎన్నికలకు అవకాశం ఉంటుంది. ఇది కూటమి సర్కారుకు ఏపీలో శరాఘాతంగా మారనుంది. ఎందుకంటే.. ఈలోగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం.. సాధ్యం కాదు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం సగం కూడా పూర్తయ్యే అవకాశం లేదు. ఇక, పోలవరం, మెట్రోరైలు ప్రాజెక్టులు, ఉపాధి కల్పన, పెట్టుబడులు.. వంటివి కూడా సాకారం అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
ఇది పరోక్షంగా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టే అవుతుందన్నది సీఎం చంద్రబాబు సహా కూటమి నాయకుల అభిప్రాయంగా ఉంది. అందుకే.. జమిలి వచ్చినా.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఇది ఆయన చేతిలోనే ఉందా? అంటే లేదు. కేంద్ర ప్రభుత్వం జమిలి తీసుకువస్తే.. ఆయన కూడా చేయగలిగింది ఏమీ ఉండదు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా.. కేంద్రానికి విన్నవించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికిప్పుడు జమిలితో ఇరు పక్షాలకు ఇబ్బందేనన్నది చంద్రబాబు మాట. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని.. ఆయన విన్నవించారు. అయితే.. తాము జమిలికి వ్యతిరేకం కాదని.. కానీ, సమయం సందర్భం మాత్రం ఇది కాదన్నది ఎన్డీయే పక్ష నాయకుడిగా చంద్రబాబు చేసిన మేలిమి సూచనగా.. జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందని భావించినా.. కాంగ్రెస్పై సింపతీ పవనాలు వీస్తే.. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని.. కాబట్టి జమిలి తీసుకువచ్చినా.. 2029 వరకువెయిట్ చేయాలన్నది చంద్రబాబు సూచన. ఈ క్రమంలోనే మోడీ సర్కారు కూడా.. ఈ దఫా బిల్లును వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటుకు సమర్పించడం లేదని జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on December 16, 2024 1:02 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…