Political News

జగన్ చేసిన అన్యాయం.. పవన్ మాటల్లో

ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని అధికారం అప్పగిస్తే బాధ్యతతో వ్యవహరించకుండా.. అరాచకంగా పాలించి మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గత ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఎన్నో ప్రజలు కళ్లతో చూశారు. వాళ్లు చూడని దారుణాలు ఎన్నో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన రోడ్లు వేయకుండా కోట్లాది మందికి నరకం చూపించిన ఘనత జగన్ సర్కారుకే చెందుతుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా రోడ్లను పట్టించుకోలేదు.

ఇక మారుమూల గ్రామాలు, గిరిజన తండాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటున్న ఈ రోజుల్లో కూడా డోలీలు పట్టుకుని గర్బిణీలను నదులు దాటించి ప్రసవాల కోసం తీసుకెళ్లాల్సిన దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి.

ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తాజాగా ఓ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో కూడా డోలీలు కట్టి గర్భిణీలను తీసుకెళ్తున్న విషయం తెలిసి తాను ఎంతో బాధ పడ్డానని.. ఏం చేసైనా పర్వాలేదు గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేద్దాం అని తాను మీటింగ్ పెట్టి అధికారులను ప్రతిపాదనలు కోరానని.. ఐదే రాష్ట్ర వ్యాప్తంగా 2850 దాకా గిరిజన గ్రామాలున్నాయని.. వీటన్నింటికీ రోడ్ల సౌకర్యం కల్పించాలంటే 3 వేల కోట్లు ఖర్చవుతుందని వాళ్లు చెప్పారని పవన్ వెల్లడించారు.

ముఖ్యమంత్రి దగ్గర ఈ ప్రతిపాదన పెడితే ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని.. ఆయన పరిస్థితి కూడా జనాలకు తెలియాలని.. ఖజానాలో డబ్బులు లేవని పవన్ అన్నారు. గత ప్రభుత్వం డబ్బులంతా ఏం చేసిందా అని చూస్తే.. రుషికొండలో భవనం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారని.. అలాగే జగన్ బొమ్మలతో నంబర్ రాళ్లు వేసేందుకు 1209 కోట్లు ఖర్చయ్యాయని తెలిసిందని పవన్ వెల్లడించారు. ఈ 1700 కోట్లు ఉంటే 1400 గిరిజన గ్రామాలకు రోడ్లు పూర్తయ్యేవని.. ఇదేం బాధ్యతారాహిత్యమని పవన్ ప్రశ్నించారు. ఎలాగైనా ఈ గ్రామాలకు రోడ్లు వేయించడానికి చూస్తానని పవన్ హామీ ఇచ్చారు.

This post was last modified on December 15, 2024 5:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

34 minutes ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

2 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

2 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

3 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

12 hours ago