Political News

జగన్ చేసిన అన్యాయం.. పవన్ మాటల్లో

ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని అధికారం అప్పగిస్తే బాధ్యతతో వ్యవహరించకుండా.. అరాచకంగా పాలించి మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గత ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఎన్నో ప్రజలు కళ్లతో చూశారు. వాళ్లు చూడని దారుణాలు ఎన్నో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన రోడ్లు వేయకుండా కోట్లాది మందికి నరకం చూపించిన ఘనత జగన్ సర్కారుకే చెందుతుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా రోడ్లను పట్టించుకోలేదు.

ఇక మారుమూల గ్రామాలు, గిరిజన తండాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటున్న ఈ రోజుల్లో కూడా డోలీలు పట్టుకుని గర్బిణీలను నదులు దాటించి ప్రసవాల కోసం తీసుకెళ్లాల్సిన దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి.

ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తాజాగా ఓ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో కూడా డోలీలు కట్టి గర్భిణీలను తీసుకెళ్తున్న విషయం తెలిసి తాను ఎంతో బాధ పడ్డానని.. ఏం చేసైనా పర్వాలేదు గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేద్దాం అని తాను మీటింగ్ పెట్టి అధికారులను ప్రతిపాదనలు కోరానని.. ఐదే రాష్ట్ర వ్యాప్తంగా 2850 దాకా గిరిజన గ్రామాలున్నాయని.. వీటన్నింటికీ రోడ్ల సౌకర్యం కల్పించాలంటే 3 వేల కోట్లు ఖర్చవుతుందని వాళ్లు చెప్పారని పవన్ వెల్లడించారు.

ముఖ్యమంత్రి దగ్గర ఈ ప్రతిపాదన పెడితే ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని.. ఆయన పరిస్థితి కూడా జనాలకు తెలియాలని.. ఖజానాలో డబ్బులు లేవని పవన్ అన్నారు. గత ప్రభుత్వం డబ్బులంతా ఏం చేసిందా అని చూస్తే.. రుషికొండలో భవనం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారని.. అలాగే జగన్ బొమ్మలతో నంబర్ రాళ్లు వేసేందుకు 1209 కోట్లు ఖర్చయ్యాయని తెలిసిందని పవన్ వెల్లడించారు. ఈ 1700 కోట్లు ఉంటే 1400 గిరిజన గ్రామాలకు రోడ్లు పూర్తయ్యేవని.. ఇదేం బాధ్యతారాహిత్యమని పవన్ ప్రశ్నించారు. ఎలాగైనా ఈ గ్రామాలకు రోడ్లు వేయించడానికి చూస్తానని పవన్ హామీ ఇచ్చారు.

This post was last modified on December 15, 2024 5:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

35 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

55 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago