వైసీపీ ఫైర్బ్రాండ్ నాయకుడు.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన మకాం మార్చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయం.. ఒంగోలు కేంద్రంగానే సాగుతోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న బాలినేని శ్రీనివాసరావు కారణంగా.. కొంత దూకుడు తగ్గించిన చెవిరెడ్డి.. బాలినేని జనసేనలోకి జంప్ చేయడంతో తన దూకుడు పెంచారు. వైసీపీ నేతలను తన దారిలోకి తెచ్చుకున్నారు. అయితే.. ఇలా చెవిరెడ్డి మకాం మార్చేయడంతో చంద్రగిరిలో వైసీపీ పట్టు తప్పుతోంది.
తాజాగా చంద్రగిరిలో జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన అభ్యర్థుల విజయకేతనం స్పష్టంగా కనిపించింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నేతృత్వంలో ఇక్కడి ఎన్నికలు ఏకపక్షంగా సాగిపోయాయి. తిరుపతి రూరల్ మండలంలోని సాగునీటి సంఘాల కమిటీ సభ్యులు గుండు గుత్తగా కూటమి వైపే నిలబడ్డారు. అందరూ నాని కనుసన్నల్లోనే ముందుకుసాగడంతో విజయం నల్లేరుపై నడకే అయింది.
పార్టీలకు అతీతంగా ఇక్కడ కూటమి అభ్యర్థులను గెలిపించడం వెనుక కూడా పులివర్తి మంత్రాంగం స్పష్టంగా కనిపించింది. అయితే.. చంద్రగిరిలో చెవిరెడ్డి కనుక చక్రం తిప్పి ఉంటే.. అక్కడ వేరే లెక్కలు ఉండేవని అంటున్నారు. కానీ, ఆయన ఒంగోలులోనే మకాం వేసి.. ఇక్కడి రాజకీయాలనే తన గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా చంద్రగిరిలో రాజకీయాలు గాడి తప్పుతున్నాయి. మరో వైపు.. ఒంగోలులో కూడా ఇంకా పట్టు చిక్కలేదని తెలుస్తోంది.
జనసేన వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. వైసీపీ లోని నాయకులను జనసేనలోకి వెళ్లకుండా చూసేందుకు చెవిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బాలినేని వెంట తమ పార్టీ నాయకులు చేరకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఎవరూ కూడా చెవిరెడ్డి చెప్పింది వింటున్నారే తప్ప.. మనసు మాత్రం జనసేన వైపే ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో తాను ఒంగోలు దాటి వెళ్తే.. మరింత మంది పార్టీ నుంచి జంప్ చేస్తారన్న లెక్కలు వేసుకున్న చెవిరెడ్డి.. ఒంగోలులోనే మకాం వేయడం గమనార్హం.
This post was last modified on December 15, 2024 3:10 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…