Political News

మ‌కాం మార్చేసిన చెవిరెడ్డి .. !

వైసీపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు.. చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి త‌న మ‌కాం మార్చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయం.. ఒంగోలు కేంద్రంగానే సాగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న బాలినేని శ్రీనివాస‌రావు కార‌ణంగా.. కొంత దూకుడు త‌గ్గించిన చెవిరెడ్డి.. బాలినేని జ‌న‌సేన‌లోకి జంప్ చేయడంతో త‌న దూకుడు పెంచారు. వైసీపీ నేత‌ల‌ను త‌న దారిలోకి తెచ్చుకున్నారు. అయితే.. ఇలా చెవిరెడ్డి మ‌కాం మార్చేయ‌డంతో చంద్ర‌గిరిలో వైసీపీ ప‌ట్టు త‌ప్పుతోంది.

తాజాగా చంద్ర‌గిరిలో జ‌రిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో కూటమి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌ అభ్యర్థుల విజయకేతనం స్ప‌ష్టంగా క‌నిపించింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నేతృత్వంలో ఇక్క‌డి ఎన్నిక‌లు ఏక‌ప‌క్షంగా సాగిపోయాయి. తిరుపతి రూరల్ మండలంలోని సాగునీటి సంఘాల కమిటీ సభ్యులు గుండు గుత్త‌గా కూట‌మి వైపే నిల‌బ‌డ్డారు. అంద‌రూ నాని క‌నుస‌న్నల్లోనే ముందుకుసాగ‌డంతో విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అయింది.

పార్టీలకు అతీతంగా ఇక్క‌డ కూట‌మి అభ్యర్థుల‌ను గెలిపించ‌డం వెనుక కూడా పులివ‌ర్తి మంత్రాంగం స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే.. చంద్ర‌గిరిలో చెవిరెడ్డి క‌నుక చ‌క్రం తిప్పి ఉంటే.. అక్క‌డ వేరే లెక్క‌లు ఉండేవ‌ని అంటున్నారు. కానీ, ఆయ‌న ఒంగోలులోనే మ‌కాం వేసి.. ఇక్క‌డి రాజ‌కీయాల‌నే త‌న గుప్పిట్లో ఉంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఫ‌లితంగా చంద్ర‌గిరిలో రాజకీయాలు గాడి త‌ప్పుతున్నాయి. మ‌రో వైపు.. ఒంగోలులో కూడా ఇంకా ప‌ట్టు చిక్క‌లేద‌ని తెలుస్తోంది.

జ‌న‌సేన వైపే ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. వైసీపీ లోని నాయ‌కుల‌ను జ‌న‌సేన‌లోకి వెళ్లకుండా చూసేందుకు చెవిరెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాలినేని వెంట త‌మ పార్టీ నాయ‌కులు చేర‌కుండా చూసేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ, ఎవ‌రూ కూడా చెవిరెడ్డి చెప్పింది వింటున్నారే త‌ప్ప‌.. మ‌న‌సు మాత్రం జ‌న‌సేన వైపే ఉంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాను ఒంగోలు దాటి వెళ్తే.. మ‌రింత మంది పార్టీ నుంచి జంప్ చేస్తార‌న్న లెక్క‌లు వేసుకున్న చెవిరెడ్డి.. ఒంగోలులోనే మ‌కాం వేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 15, 2024 3:10 pm

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago