Movie News

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే కొద్దీ అహంకారం పెరిగిపోతుంది. సందర్భం వచ్చినా తమకు బ్రేక్ ఇచ్చిన దర్శకుల గురించి మాట్లాడరు. అలాగే సాయం అవసరమైనపుడు చేయి అందించే వాళ్లు కూడా తక్కువమందే. కానీ ప్రభాస్ అలా కాదు. ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద స్టార్‌గా ఎదిగినా సరే.. తన మూలాలను అతను ఎప్పుడూ మరిచిపోలేదు. 

కెరీర్ ఆరంభంలో శోభన్ అనే దర్శకుడు ‘వర్షం’ సినిమాతో తనకు పెద్ద హిట్ ఇచ్చాడని.. అతడి కొడుకు సంతోష్ హీరో అయిన దగ్గర్నుంచి తనకు మద్దతుగా నిలుస్తున్నాడు. తన హోం బేనర్ అనదగ్గ యువి బేనర్లో అతడితో వరుసగా సినిమాలు చేయిస్తున్నాడు. సంతోష్‌కు సైతం అది హోం బేనర్‌లా మారిపోయింది. తన కొత్త చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్ కోసం ఒక ఇంటర్వ్యూ కూడా చేశాడు. తన సినిమాలనే ప్రమోట్ చేసుకోని ప్రభాస్.. ఇలా సంతోష్ సినిమాను ప్రమోట్ చేయడం ఆశ్చర్యమే. 

ఇక ఈ ఇంటర్వ్యూలో తాను సూపర్ స్టార్ కావడానికి ముందు పని చేసిన దర్శకుల గురించి కూడా గొప్పగా మాట్లాడాడు ప్రభాస్. తనతో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేసిన పూరి జగన్నాథ్‌ను ప్రభాస్ ఆకాశానికెత్తేశాడు. ఆయన డైలాగుల గురించి, అందులో ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ.. పూరిలా ఎవ్వరూ డైలాగులు రాయలేరని తేల్చేశాడు ప్రభాస్. బుజ్జిగాడు సినిమా తనకెంత స్పెషలో కూడా వెల్లడించాడు. 

మరోవైపు తనతో ‘మిర్చి’ తీసిన కొరటాల శివను కూడా కొనియాడాడు ప్రభాస్. అందులో ‘వీలైతే ప్రేమిద్దాం డూడ్. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అనే డైలాగ్ తాలూకు ఫిలాసఫీ గురించి ప్రస్తావించాడు. కొరటాల శివ చాలా పెద్ద విషయాన్ని చిన్న డైలాగుతో ఎంతో బాగా చెప్పారని.. ఆయన డైలాగులూ తనకిష్టమని చెప్పాడు ప్రభాస్. తన స్థాయి ఎంత పెరిగినా సరే.. తన దర్శకుల గురించి ఇలా మాట్లాడ్డం, వారికి ఎలివేషన్ ఇవ్వడం.. కృతజ్ఞత చూపించడం ప్రభాస్‌కే చెల్లు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

8 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago