ఏపీ సీఎం చంద్రబాబు తనకు తానే బిగ్ టాస్క్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర పాలనపైనే దృష్టి పెట్టిన ఆయన తాజాగా దివంగత ఎన్టీఆర్కు భారత రత్న వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశారు. తాజాగా విజయవాడ శివారు కానూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్కు ఎప్పుడో భారత రత్న రావాల్సి ఉందని, కానీ రాలేదని.. ఇప్పుడు దానిని తాము సాధిస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏ రకంగా దీనిని సాధిస్తారనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.
కేంద్రంతో చర్చిస్తే తప్ప.. కేంద్రం ఒప్పుకొంటే తప్ప.. ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే రెండు సార్లు ఈ విషయంలో ఆయన కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆమె ప్రయత్నించారు. అయితే.. అప్పట్లోనే రావాల్సిన భారత రత్న అనూహ్యంగా వెనక్కి వెళ్లిపోయింది. దీనికి కూడా కారణాలు ఉన్నాయన్న చర్చ అప్పట్లో తెరమీదికి వచ్చింది.
విభజన హామీలను అమలు చేస్తే.. తమకు కూడా అమలు చేయాలని.. ప్రత్యేకహోదా ఏపీకి ఇస్తే.. తమకు కూడా ఇవ్వాలని పొరుగు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్టుగానే ఎన్టీఆర్కు భారత రత్న అవార్డు ప్రకటిస్తే.. తమకు కూడా.. ఇవ్వాలంటూ.. తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తమిళనాడు నటుడు, ఏఐఏడీఎంకే.. ఒకప్పటి సారధి.. ఎంజీఆర్కు భారత రత్న ఇవ్వాలన్నది అప్పట్లో తెరమీదికి వచ్చిన ప్రధాన డిమాండ్.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం.. ఎవరికీ ఇవ్వకుండా.. ఈ విషయంలో తాత్సారం చేసింది. ఇప్పుడు . కేంద్రంలోని మోడీ సర్కారుకు చంద్రబాబు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కొంత వరకు ఈ విషయంలో అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది. కానీ, ఇదేసమయంలో ఏఐఏడీఎంకే కూడా.. ఎన్డీయే మిత్ర పక్షమే. కాబట్టి గత డిమాండ్ మరోసారి తెరమీదికి వచ్చే అవకాశం ఉంది. ఇస్తే..ఇరు రాష్ట్రాలకు భారతరత్నను ప్రకటించాలి. లేక పోతే.. సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పెట్టుకున్న బిగ్ టాస్క్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on December 15, 2024 2:25 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…