ఏపీ సీఎం చంద్రబాబు తనకు తానే బిగ్ టాస్క్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర పాలనపైనే దృష్టి పెట్టిన ఆయన తాజాగా దివంగత ఎన్టీఆర్కు భారత రత్న వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశారు. తాజాగా విజయవాడ శివారు కానూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్కు ఎప్పుడో భారత రత్న రావాల్సి ఉందని, కానీ రాలేదని.. ఇప్పుడు దానిని తాము సాధిస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏ రకంగా దీనిని సాధిస్తారనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.
కేంద్రంతో చర్చిస్తే తప్ప.. కేంద్రం ఒప్పుకొంటే తప్ప.. ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే రెండు సార్లు ఈ విషయంలో ఆయన కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆమె ప్రయత్నించారు. అయితే.. అప్పట్లోనే రావాల్సిన భారత రత్న అనూహ్యంగా వెనక్కి వెళ్లిపోయింది. దీనికి కూడా కారణాలు ఉన్నాయన్న చర్చ అప్పట్లో తెరమీదికి వచ్చింది.
విభజన హామీలను అమలు చేస్తే.. తమకు కూడా అమలు చేయాలని.. ప్రత్యేకహోదా ఏపీకి ఇస్తే.. తమకు కూడా ఇవ్వాలని పొరుగు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్టుగానే ఎన్టీఆర్కు భారత రత్న అవార్డు ప్రకటిస్తే.. తమకు కూడా.. ఇవ్వాలంటూ.. తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తమిళనాడు నటుడు, ఏఐఏడీఎంకే.. ఒకప్పటి సారధి.. ఎంజీఆర్కు భారత రత్న ఇవ్వాలన్నది అప్పట్లో తెరమీదికి వచ్చిన ప్రధాన డిమాండ్.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం.. ఎవరికీ ఇవ్వకుండా.. ఈ విషయంలో తాత్సారం చేసింది. ఇప్పుడు . కేంద్రంలోని మోడీ సర్కారుకు చంద్రబాబు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కొంత వరకు ఈ విషయంలో అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది. కానీ, ఇదేసమయంలో ఏఐఏడీఎంకే కూడా.. ఎన్డీయే మిత్ర పక్షమే. కాబట్టి గత డిమాండ్ మరోసారి తెరమీదికి వచ్చే అవకాశం ఉంది. ఇస్తే..ఇరు రాష్ట్రాలకు భారతరత్నను ప్రకటించాలి. లేక పోతే.. సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పెట్టుకున్న బిగ్ టాస్క్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on December 15, 2024 2:25 pm
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…