Political News

ప‌వ‌న్ టార్గెట్ @ జ‌న‌వ‌రి 14!

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు జ‌న‌వ‌రి 14 వ‌తేదీ క‌ళ్ల ముందే క‌నిపిస్తోంది. ఈ స‌మ‌యానికి ఆయ‌న పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావడం అత్యంత కీల‌కంగా మారింది. దీనికి గాను మ‌రో నెల రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డం.. ప‌నులు వేగంగా పూర్తి కాక‌పోవ‌డంతో ప‌వ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇంత‌కీ ఆయ‌న నిర్దేశించుకున్న ల‌క్ష్యం.. త‌న ప‌రిధిలోని అన్ని గ్రామాల్లోనూ.. ర‌హ‌దారుల‌ను సుంద‌రీక‌రించ‌డం. దీనికి గాను జ‌న‌వ‌రి 14 సంక్రాంతిని ఆయ‌న ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తుతో కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌ల‌కాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. దీనిపై ఇప్ప‌టికే రెండు సార్లు వ‌ర్చువ‌ల్‌గా గ్రామీణ ప్రాంత అధికారులు, పార్టీ నాయ‌కుల‌తో ఆయ‌న భేటీ అయ్యా రు. త‌న ల‌క్ష్యాన్ని కూడా వివ‌రించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు స‌గానకిపైగా గ్రామాల్లో ప‌నులే ప్రారంభం కాలేదు. చేయాల్సిన ప‌నులు ఎక్కువ‌గా ఉండ‌డం స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డంతో ఏం జ‌రుగుతుందో అని ప‌వ‌న్‌త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

ఇప్ప‌టికి 861 కోట్ల నిధులు విడుద‌ల చేశారు. ఇవికేవ‌లం గ్రామీణ ప్రాంత ర‌హ‌దారుల‌ను అభివృద్ధి ప‌రిచేందుకేన‌ని మొద‌ట్లో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కూడా ప్ర‌క‌టించారు. కానీ, కేవ‌లం గ్రామీణ ప్రాంతాల‌ను మాత్రమే డెవ‌ల‌ప్ చేస్తే.. న‌గ‌ర వాసుల నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని భావించిన ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి కొంత మొత్తం నిధుల‌ను న‌గ‌రాల‌కు కూడా కేటాయించాల‌ని సీఎం చంద్ర‌బాబుకు విన్న‌వించారు. దీంతో 200 కోట్ల‌ను న‌గ‌రాల‌కు వాడుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.

అయితే.. ఈ విష‌యం డిప్యూటీసీఎంకు తెలియ‌క‌పోవ‌డం.. మొత్తం నిధుల‌ను గ్రామీణ ప్రాంతాల‌కే వాడుతున్నార‌ని ఆయ‌న భావించ‌డంతో ప‌నులు వేగంగా పుంజుకుంటాయ‌ని అనుకున్నారు. కానీ, ప‌రిస్థితి అలా క‌నిపించ‌డం లేదు. పైగా రాయ‌ల సీమ జిల్లాల్లో ప‌నులు ఇప్ప‌టికీ ప్రారంభం కాలేదు. కేవ‌లం ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనే ప‌నులు చేప‌ట్టేలా.. కాంట్రాక్టులు తీసుకోవ‌డంతో స‌రిపుచ్చారు. ఇత‌ర జిల్లాల విష‌యం ఇంకా ప‌రిశీల‌న‌లోనే ఉంద‌ని తెలిసింది. దీంతో ఇప్పుడు టార్గెట్ చేరుకోవ‌డంపై ప‌వ‌న్ దృష్టి పెట్టారు. మొత్తం నిధుల‌ను గ్రామీణ ప్రాంతాల‌కే ఇవ్వాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలిసింది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

7 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

35 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago