Political News

ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు స్వీట్ వార్నింగ్‌?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. “ఎమ్మెల్యేలు అయిపోయాం క‌దా.. అని కొంద‌రు ఎంజాయ్ మూడ్‌లో ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. పార్టీ స‌భ్య‌త్వాలు న‌మోదు కార్య‌క్ర‌మానికి ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతున్నారు. నాకు అన్ని విష‌యాలు తెలుసు. నా క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి.. మీరు నాట‌కాలు ఆడితే.. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. మ‌ళ్లీ టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటే కుద‌ర‌దు. సొంత వ్య‌వ‌హారాలు మానుకోండి. ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వండి. ఇత‌ర విష‌యాలు ఏమైనా ఉంటే.. నేను చూసుకుంటా” అని తేల్చి చెప్పారు.

తాజాగా శ‌నివారం మ‌ధ్యాహ్న ఆయ‌న మంగ‌ళ‌గిరిలో పార్టీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఈ ఏడాది చేప‌ట్టిన‌ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంపై ఆయ‌న పార్టీ ప్ర‌తినిధుల‌తో స‌మీక్షించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 73 ల‌క్ష‌ల మంది కొత్త‌గా స‌భ్య‌త్వం తీసుకున్న విష‌యం తెలిసి సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ స‌భ్య‌త్వ న‌మోదును మ‌రింత పెంచాల్సి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. ఎమ్మెల్యేలు, నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన వారు స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి దూరంగా ఉంటున్నార‌ని తెలిసి.. ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీరంతా ఏం చేస్తున్నారు? అని ఆయ‌న మీడియా ముందే పార్టీ ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు.

“పార్టీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డాలి. ఏదో మీడియా మీటింగులు పెట్టి విమ‌ర్శ‌లు చేసినంత మాత్రాన ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం క‌ష్టం. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవాలి. ప్ర‌జ‌ల‌ను మ‌రింత చేరువ అయ్యేలా చూడాలి. ప‌ద‌వులు ఊరికేనేరావు. చాలా మంది ప‌ద‌వులు రాలేద‌ని అలిగి ఇంట్లో ఉన్నారు. కానీ, క‌ష్ట‌ప‌డితేనే ప‌ద‌వులు ద‌క్కుతాయి. దీనికి నేనే పెద్ద ఉదాహ‌ర‌ణ. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సార్లు తిరిగాను. ఇంటికి కూడా వెళ్ల‌కుండా.. రోడ్డుపైనే భోజ‌నం చేశాను(చిత్తూరులో). జైలుకు కూడా వెళ్లాను. ఈ మాత్రం కూడా క‌ష్ట‌ప‌డ‌కుండా.. ప‌ద‌వులు ర‌మ్మంటే ఎక్క‌డ నుంచి వ‌స్తాయి” అని నిల‌దీశారు.

పార్టీలో క‌ష్ట‌ప‌డే వారిని తాను గ‌మ‌నిస్తున్నాన‌ని.. నివేదిక‌లు తెప్పించుకుంటున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. పార్టీలో క‌ష్ట‌ప‌డే వారు ఏ మూల దాగి ఉన్నా.. వెతికి మ‌రీ ప‌ద‌వులు ఇస్తామ‌న్నారు. అయితే.. ప‌ద‌వులు పొందిన వారు అల‌స‌త్వం వ‌హిస్తే.. ఆ ప‌ద‌వులు కూడా వెన‌క్కి తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. స‌భ్య‌త్వ న‌మోదుకు మ‌నం ఓ టార్గెట్ పెట్టుకున్నాం. కానీ, ఎచీవ్ చేసేందుకు కొంద‌రు మాత్ర‌మే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా.. వైసీపీకి కంచుకోట వంటి రాజంపేట‌లో టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు ఆశించిన దానికంటే ఎక్కువగా జ‌ర‌గ‌డం ప‌ట్ల సీఎం సంతోషం వ్య‌క్తం చేశారు.

This post was last modified on December 15, 2024 8:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

8 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago