Political News

ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు స్వీట్ వార్నింగ్‌?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. “ఎమ్మెల్యేలు అయిపోయాం క‌దా.. అని కొంద‌రు ఎంజాయ్ మూడ్‌లో ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. పార్టీ స‌భ్య‌త్వాలు న‌మోదు కార్య‌క్ర‌మానికి ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతున్నారు. నాకు అన్ని విష‌యాలు తెలుసు. నా క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి.. మీరు నాట‌కాలు ఆడితే.. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. మ‌ళ్లీ టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటే కుద‌ర‌దు. సొంత వ్య‌వ‌హారాలు మానుకోండి. ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వండి. ఇత‌ర విష‌యాలు ఏమైనా ఉంటే.. నేను చూసుకుంటా” అని తేల్చి చెప్పారు.

తాజాగా శ‌నివారం మ‌ధ్యాహ్న ఆయ‌న మంగ‌ళ‌గిరిలో పార్టీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఈ ఏడాది చేప‌ట్టిన‌ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంపై ఆయ‌న పార్టీ ప్ర‌తినిధుల‌తో స‌మీక్షించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 73 ల‌క్ష‌ల మంది కొత్త‌గా స‌భ్య‌త్వం తీసుకున్న విష‌యం తెలిసి సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ స‌భ్య‌త్వ న‌మోదును మ‌రింత పెంచాల్సి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. ఎమ్మెల్యేలు, నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన వారు స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి దూరంగా ఉంటున్నార‌ని తెలిసి.. ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీరంతా ఏం చేస్తున్నారు? అని ఆయ‌న మీడియా ముందే పార్టీ ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు.

“పార్టీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డాలి. ఏదో మీడియా మీటింగులు పెట్టి విమ‌ర్శ‌లు చేసినంత మాత్రాన ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం క‌ష్టం. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవాలి. ప్ర‌జ‌ల‌ను మ‌రింత చేరువ అయ్యేలా చూడాలి. ప‌ద‌వులు ఊరికేనేరావు. చాలా మంది ప‌ద‌వులు రాలేద‌ని అలిగి ఇంట్లో ఉన్నారు. కానీ, క‌ష్ట‌ప‌డితేనే ప‌ద‌వులు ద‌క్కుతాయి. దీనికి నేనే పెద్ద ఉదాహ‌ర‌ణ. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సార్లు తిరిగాను. ఇంటికి కూడా వెళ్ల‌కుండా.. రోడ్డుపైనే భోజ‌నం చేశాను(చిత్తూరులో). జైలుకు కూడా వెళ్లాను. ఈ మాత్రం కూడా క‌ష్ట‌ప‌డ‌కుండా.. ప‌ద‌వులు ర‌మ్మంటే ఎక్క‌డ నుంచి వ‌స్తాయి” అని నిల‌దీశారు.

పార్టీలో క‌ష్ట‌ప‌డే వారిని తాను గ‌మ‌నిస్తున్నాన‌ని.. నివేదిక‌లు తెప్పించుకుంటున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. పార్టీలో క‌ష్ట‌ప‌డే వారు ఏ మూల దాగి ఉన్నా.. వెతికి మ‌రీ ప‌ద‌వులు ఇస్తామ‌న్నారు. అయితే.. ప‌ద‌వులు పొందిన వారు అల‌స‌త్వం వ‌హిస్తే.. ఆ ప‌ద‌వులు కూడా వెన‌క్కి తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. స‌భ్య‌త్వ న‌మోదుకు మ‌నం ఓ టార్గెట్ పెట్టుకున్నాం. కానీ, ఎచీవ్ చేసేందుకు కొంద‌రు మాత్ర‌మే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా.. వైసీపీకి కంచుకోట వంటి రాజంపేట‌లో టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు ఆశించిన దానికంటే ఎక్కువగా జ‌ర‌గ‌డం ప‌ట్ల సీఎం సంతోషం వ్య‌క్తం చేశారు.

This post was last modified on December 15, 2024 8:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

3 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

3 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

5 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

5 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

7 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

8 hours ago