Political News

ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు స్వీట్ వార్నింగ్‌?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. “ఎమ్మెల్యేలు అయిపోయాం క‌దా.. అని కొంద‌రు ఎంజాయ్ మూడ్‌లో ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. పార్టీ స‌భ్య‌త్వాలు న‌మోదు కార్య‌క్ర‌మానికి ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతున్నారు. నాకు అన్ని విష‌యాలు తెలుసు. నా క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి.. మీరు నాట‌కాలు ఆడితే.. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. మ‌ళ్లీ టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటే కుద‌ర‌దు. సొంత వ్య‌వ‌హారాలు మానుకోండి. ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వండి. ఇత‌ర విష‌యాలు ఏమైనా ఉంటే.. నేను చూసుకుంటా” అని తేల్చి చెప్పారు.

తాజాగా శ‌నివారం మ‌ధ్యాహ్న ఆయ‌న మంగ‌ళ‌గిరిలో పార్టీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఈ ఏడాది చేప‌ట్టిన‌ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంపై ఆయ‌న పార్టీ ప్ర‌తినిధుల‌తో స‌మీక్షించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 73 ల‌క్ష‌ల మంది కొత్త‌గా స‌భ్య‌త్వం తీసుకున్న విష‌యం తెలిసి సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ స‌భ్య‌త్వ న‌మోదును మ‌రింత పెంచాల్సి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. ఎమ్మెల్యేలు, నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన వారు స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి దూరంగా ఉంటున్నార‌ని తెలిసి.. ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీరంతా ఏం చేస్తున్నారు? అని ఆయ‌న మీడియా ముందే పార్టీ ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు.

“పార్టీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డాలి. ఏదో మీడియా మీటింగులు పెట్టి విమ‌ర్శ‌లు చేసినంత మాత్రాన ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం క‌ష్టం. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవాలి. ప్ర‌జ‌ల‌ను మ‌రింత చేరువ అయ్యేలా చూడాలి. ప‌ద‌వులు ఊరికేనేరావు. చాలా మంది ప‌ద‌వులు రాలేద‌ని అలిగి ఇంట్లో ఉన్నారు. కానీ, క‌ష్ట‌ప‌డితేనే ప‌ద‌వులు ద‌క్కుతాయి. దీనికి నేనే పెద్ద ఉదాహ‌ర‌ణ. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సార్లు తిరిగాను. ఇంటికి కూడా వెళ్ల‌కుండా.. రోడ్డుపైనే భోజ‌నం చేశాను(చిత్తూరులో). జైలుకు కూడా వెళ్లాను. ఈ మాత్రం కూడా క‌ష్ట‌ప‌డ‌కుండా.. ప‌ద‌వులు ర‌మ్మంటే ఎక్క‌డ నుంచి వ‌స్తాయి” అని నిల‌దీశారు.

పార్టీలో క‌ష్ట‌ప‌డే వారిని తాను గ‌మ‌నిస్తున్నాన‌ని.. నివేదిక‌లు తెప్పించుకుంటున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. పార్టీలో క‌ష్ట‌ప‌డే వారు ఏ మూల దాగి ఉన్నా.. వెతికి మ‌రీ ప‌ద‌వులు ఇస్తామ‌న్నారు. అయితే.. ప‌ద‌వులు పొందిన వారు అల‌స‌త్వం వ‌హిస్తే.. ఆ ప‌ద‌వులు కూడా వెన‌క్కి తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. స‌భ్య‌త్వ న‌మోదుకు మ‌నం ఓ టార్గెట్ పెట్టుకున్నాం. కానీ, ఎచీవ్ చేసేందుకు కొంద‌రు మాత్ర‌మే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా.. వైసీపీకి కంచుకోట వంటి రాజంపేట‌లో టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు ఆశించిన దానికంటే ఎక్కువగా జ‌ర‌గ‌డం ప‌ట్ల సీఎం సంతోషం వ్య‌క్తం చేశారు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago