వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల మండలంలో వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అవినాష్ రెడ్డి పోలీసులు ముందు జాగ్రత్తగా గృహ నిర్బంధం చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు.
ఏం జరిగింది?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తాహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించారు. అయితే.. తమ ఎంపీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ.. వైసీపీ నాయకులు ప్రశ్నించారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని.. వైసీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘర్షణ పెరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు అవినాష్ రెడ్డిని అక్కడ నుంచి తరలించారు. ఆ వెంటనే పులివెందులలో ని జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను నిర్బంధించారు. దీనికి ప్రతిగా వైసీపీ నాయకులు కూడా రంగంలోకి దిగి.. క్యాంపుకార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమ నేతను తక్షణమే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
అధికార పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కక్ష సాధిపునకు దిగుతున్నారని వారు ఆరోపించారు. ఏం జరిగిందని తమ నేతను గృహ నిర్బంధం చేశారని వారు ప్రశ్నించారు. అయితే.. చట్ట ప్రకారమే తాము వ్యవహరించామని.. కక్ష పూరితంగా వ్యవహరించలేదని సీఐ నరసింహులు తెలిపారు.
This post was last modified on December 13, 2024 3:54 pm
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…
పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…
జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా…
జనసేన ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల్లో ఏ మేర జోష్ ను నింపాయన్నది.. పిఠాపురం శివారు చిత్రాడలో జయకేతనం…