వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల మండలంలో వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అవినాష్ రెడ్డి పోలీసులు ముందు జాగ్రత్తగా గృహ నిర్బంధం చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు.
ఏం జరిగింది?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తాహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించారు. అయితే.. తమ ఎంపీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ.. వైసీపీ నాయకులు ప్రశ్నించారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని.. వైసీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘర్షణ పెరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు అవినాష్ రెడ్డిని అక్కడ నుంచి తరలించారు. ఆ వెంటనే పులివెందులలో ని జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను నిర్బంధించారు. దీనికి ప్రతిగా వైసీపీ నాయకులు కూడా రంగంలోకి దిగి.. క్యాంపుకార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమ నేతను తక్షణమే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
అధికార పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కక్ష సాధిపునకు దిగుతున్నారని వారు ఆరోపించారు. ఏం జరిగిందని తమ నేతను గృహ నిర్బంధం చేశారని వారు ప్రశ్నించారు. అయితే.. చట్ట ప్రకారమే తాము వ్యవహరించామని.. కక్ష పూరితంగా వ్యవహరించలేదని సీఐ నరసింహులు తెలిపారు.
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…