వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల మండలంలో వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అవినాష్ రెడ్డి పోలీసులు ముందు జాగ్రత్తగా గృహ నిర్బంధం చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు.
ఏం జరిగింది?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తాహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించారు. అయితే.. తమ ఎంపీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ.. వైసీపీ నాయకులు ప్రశ్నించారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని.. వైసీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘర్షణ పెరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు అవినాష్ రెడ్డిని అక్కడ నుంచి తరలించారు. ఆ వెంటనే పులివెందులలో ని జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను నిర్బంధించారు. దీనికి ప్రతిగా వైసీపీ నాయకులు కూడా రంగంలోకి దిగి.. క్యాంపుకార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమ నేతను తక్షణమే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
అధికార పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కక్ష సాధిపునకు దిగుతున్నారని వారు ఆరోపించారు. ఏం జరిగిందని తమ నేతను గృహ నిర్బంధం చేశారని వారు ప్రశ్నించారు. అయితే.. చట్ట ప్రకారమే తాము వ్యవహరించామని.. కక్ష పూరితంగా వ్యవహరించలేదని సీఐ నరసింహులు తెలిపారు.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…