Political News

ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ నేత‌, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలోని వేముల మండ‌లంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన అవినాష్ రెడ్డి పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా గృహ నిర్బంధం చేసిన‌ట్టు సీఐ న‌రసింహులు తెలిపారు.

ఏం జ‌రిగింది?

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తాహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించారు. అయితే.. త‌మ ఎంపీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ.. వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నించారు.

ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌లు జోక్యం చేసుకుని.. వైసీపీ నాయ‌కుల‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘ‌ర్ష‌ణ పెరిగే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన పోలీసులు అవినాష్ రెడ్డిని అక్క‌డ నుంచి త‌ర‌లించారు. ఆ వెంట‌నే పులివెందుల‌లో ని జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న‌ను నిర్బంధించారు. దీనికి ప్ర‌తిగా వైసీపీ నాయ‌కులు కూడా రంగంలోకి దిగి.. క్యాంపుకార్యాల‌యం ముందు ఆందోళ‌నకు దిగారు. త‌మ నేత‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నేత‌ల ఆదేశాల‌కు అనుగుణంగా పోలీసులు క‌క్ష సాధిపున‌కు దిగుతున్నార‌ని వారు ఆరోపించారు. ఏం జ‌రిగింద‌ని త‌మ నేత‌ను గృహ నిర్బంధం చేశార‌ని వారు ప్ర‌శ్నించారు. అయితే.. చ‌ట్ట ప్ర‌కార‌మే తాము వ్య‌వ‌హ‌రించామ‌ని.. క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని సీఐ న‌ర‌సింహులు తెలిపారు.

This post was last modified on December 13, 2024 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago