Political News

ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ నేత‌, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలోని వేముల మండ‌లంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన అవినాష్ రెడ్డి పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా గృహ నిర్బంధం చేసిన‌ట్టు సీఐ న‌రసింహులు తెలిపారు.

ఏం జ‌రిగింది?

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తాహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించారు. అయితే.. త‌మ ఎంపీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ.. వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నించారు.

ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌లు జోక్యం చేసుకుని.. వైసీపీ నాయ‌కుల‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘ‌ర్ష‌ణ పెరిగే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన పోలీసులు అవినాష్ రెడ్డిని అక్క‌డ నుంచి త‌ర‌లించారు. ఆ వెంట‌నే పులివెందుల‌లో ని జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న‌ను నిర్బంధించారు. దీనికి ప్ర‌తిగా వైసీపీ నాయ‌కులు కూడా రంగంలోకి దిగి.. క్యాంపుకార్యాల‌యం ముందు ఆందోళ‌నకు దిగారు. త‌మ నేత‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నేత‌ల ఆదేశాల‌కు అనుగుణంగా పోలీసులు క‌క్ష సాధిపున‌కు దిగుతున్నార‌ని వారు ఆరోపించారు. ఏం జ‌రిగింద‌ని త‌మ నేత‌ను గృహ నిర్బంధం చేశార‌ని వారు ప్ర‌శ్నించారు. అయితే.. చ‌ట్ట ప్ర‌కార‌మే తాము వ్య‌వ‌హ‌రించామ‌ని.. క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని సీఐ న‌ర‌సింహులు తెలిపారు.

This post was last modified on December 13, 2024 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago