Political News

ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ నేత‌, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలోని వేముల మండ‌లంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన అవినాష్ రెడ్డి పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా గృహ నిర్బంధం చేసిన‌ట్టు సీఐ న‌రసింహులు తెలిపారు.

ఏం జ‌రిగింది?

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తాహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించారు. అయితే.. త‌మ ఎంపీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ.. వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నించారు.

ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌లు జోక్యం చేసుకుని.. వైసీపీ నాయ‌కుల‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘ‌ర్ష‌ణ పెరిగే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన పోలీసులు అవినాష్ రెడ్డిని అక్క‌డ నుంచి త‌ర‌లించారు. ఆ వెంట‌నే పులివెందుల‌లో ని జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న‌ను నిర్బంధించారు. దీనికి ప్ర‌తిగా వైసీపీ నాయ‌కులు కూడా రంగంలోకి దిగి.. క్యాంపుకార్యాల‌యం ముందు ఆందోళ‌నకు దిగారు. త‌మ నేత‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నేత‌ల ఆదేశాల‌కు అనుగుణంగా పోలీసులు క‌క్ష సాధిపున‌కు దిగుతున్నార‌ని వారు ఆరోపించారు. ఏం జ‌రిగింద‌ని త‌మ నేత‌ను గృహ నిర్బంధం చేశార‌ని వారు ప్ర‌శ్నించారు. అయితే.. చ‌ట్ట ప్ర‌కార‌మే తాము వ్య‌వ‌హ‌రించామ‌ని.. క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని సీఐ న‌ర‌సింహులు తెలిపారు.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

11 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

6 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago