Political News

వారి దగ్గర పెన్షన్ సొమ్ము రికవరీ: చంద్రబాబు

ఏపీలో సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పెన్షన్లు పొందారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పెన్షన్లను ఏరివేయాలని సీఎం చంద్రబాబు…కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి దగ్గర నుంచి పెన్షన్ మొత్తం సొమ్మును రికవరీ చేయాలని చంద్రబాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు.

10 వేల మందిలో 500 మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా సర్వేలో తేలిందని చంద్రబాబు అన్నారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి పెన్షన్ లబ్ధిదారుడిని జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని, అనర్హులను ఏరివేయాలని ఆదేశించారు. పెన్షన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్ సమర్పించిన వారితోపాటు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను కూడా ప్రాసిక్యూట్ చేయాలని చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్లు తెచ్చారని, అవి కూడా కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఇటువంటి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లుగా తమ పరిశీలనలో తేలిందని చంద్రబాబు అన్నారు.

ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని దంతా నియోజకవర్గంలో 484 పెన్షన్లు ఉన్నాయని, 78 వికలాంగుల పెన్షన్లలో 56 మంది అనర్హులని తేలింది. కలెక్టర్లు అనర్హులైన పెన్షన్ దారులందరిని మూడు నెలల్లోపు గుర్తించాలని, ఆ తర్వాత కూడా ఎవరైనా అనర్హలు పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే సంబంధిత కలెక్టర్ ను బాధ్యులను చేస్తామని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా అర్హులు కాకుండానే పెన్షన్ తీసుకుంటున్న వారికి పెన్షన్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

This post was last modified on December 12, 2024 6:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌వితేజ పెద్ద హిట్ మిస్స‌య్యాడా?

మాస్ రాజా ర‌వితేజ స‌రైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. క‌రోనా కాలంలో వ‌చ్చిన క్రాక్ మూవీనే ర‌వితేజ‌కు…

51 minutes ago

యాంకర్ అబ్బాయికి భలే మంచి ఛాన్స్

రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…

3 hours ago

ఏప్రిల్ 11 – ఓటిటి అభిమానులకు పండగే

థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…

4 hours ago

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…

6 hours ago

వైరల్ వీడియో… గోరంట్ల మాధవ్ ఏం చేశారంటే?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…

7 hours ago

పోలీసులను వాచ్ మెన్ లతో పోల్చిన జగన్

ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…

7 hours ago