ఏపీలో సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పెన్షన్లు పొందారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పెన్షన్లను ఏరివేయాలని సీఎం చంద్రబాబు…కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి దగ్గర నుంచి పెన్షన్ మొత్తం సొమ్మును రికవరీ చేయాలని చంద్రబాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు.
10 వేల మందిలో 500 మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా సర్వేలో తేలిందని చంద్రబాబు అన్నారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి పెన్షన్ లబ్ధిదారుడిని జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని, అనర్హులను ఏరివేయాలని ఆదేశించారు. పెన్షన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్ సమర్పించిన వారితోపాటు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను కూడా ప్రాసిక్యూట్ చేయాలని చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్లు తెచ్చారని, అవి కూడా కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఇటువంటి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లుగా తమ పరిశీలనలో తేలిందని చంద్రబాబు అన్నారు.
ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని దంతా నియోజకవర్గంలో 484 పెన్షన్లు ఉన్నాయని, 78 వికలాంగుల పెన్షన్లలో 56 మంది అనర్హులని తేలింది. కలెక్టర్లు అనర్హులైన పెన్షన్ దారులందరిని మూడు నెలల్లోపు గుర్తించాలని, ఆ తర్వాత కూడా ఎవరైనా అనర్హలు పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే సంబంధిత కలెక్టర్ ను బాధ్యులను చేస్తామని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా అర్హులు కాకుండానే పెన్షన్ తీసుకుంటున్న వారికి పెన్షన్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
This post was last modified on December 12, 2024 6:00 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…