ఏపీలో సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పెన్షన్లు పొందారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పెన్షన్లను ఏరివేయాలని సీఎం చంద్రబాబు…కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి దగ్గర నుంచి పెన్షన్ మొత్తం సొమ్మును రికవరీ చేయాలని చంద్రబాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు.
10 వేల మందిలో 500 మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా సర్వేలో తేలిందని చంద్రబాబు అన్నారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి పెన్షన్ లబ్ధిదారుడిని జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని, అనర్హులను ఏరివేయాలని ఆదేశించారు. పెన్షన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్ సమర్పించిన వారితోపాటు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను కూడా ప్రాసిక్యూట్ చేయాలని చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్లు తెచ్చారని, అవి కూడా కొన్ని ఆసుపత్రులు మాత్రమే ఇటువంటి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లుగా తమ పరిశీలనలో తేలిందని చంద్రబాబు అన్నారు.
ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని దంతా నియోజకవర్గంలో 484 పెన్షన్లు ఉన్నాయని, 78 వికలాంగుల పెన్షన్లలో 56 మంది అనర్హులని తేలింది. కలెక్టర్లు అనర్హులైన పెన్షన్ దారులందరిని మూడు నెలల్లోపు గుర్తించాలని, ఆ తర్వాత కూడా ఎవరైనా అనర్హలు పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే సంబంధిత కలెక్టర్ ను బాధ్యులను చేస్తామని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా అర్హులు కాకుండానే పెన్షన్ తీసుకుంటున్న వారికి పెన్షన్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
This post was last modified on December 12, 2024 6:00 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…