Political News

వెంటనే ఆ దేశం నుంచి వచ్చేయండి.. భారత్ హెచ్చరిక

సిరియాలో పరిణామాలు ఉద్రిక్తతకు దారితీయడంతో భారత ప్రభుత్వం అక్కడ ఉన్న పౌరులకు ఆ దేశాన్ని వెంటనే విడిచి రావాలని సూచించింది. శుక్రవారం రాత్రి కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై కీలక అడ్వైజరీ విడుదల చేస్తూ, సిరియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పేర్కొంది. అక్కడ ఉన్న భారతీయులు కమర్షియల్ విమానాల ద్వారా వెంటనే తిరిగి రావాలని సూచించింది.

కేంద్రం జారీ చేసిన సూచనల ప్రకారం, సిరియాలో ఉన్న పౌరులు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదించాలి. అత్యవసర సమస్యల పరిష్కారానికి +963 993385973 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. ఇది వాట్సాప్‌కు కూడా ఉపయోగపడుతుందని పేర్కొంది. అదనంగా, hoc.damascus@mea.gov.in అనే ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఎంబసీ సిబ్బందిని సంప్రదించవచ్చని వివరించింది.

సిరియాలో పరిస్థితులు అత్యంత విషమంగా మారాయి. అక్కడి తిరుగుబాటు గ్రూపులు అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. టర్కీ మద్దతు పొందిన ఈ తిరుగుబాటు దళాలు గత కొద్ది రోజులుగా దేశంలో అనేక హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. రష్యా, ఇరాన్ మద్దతు ఉన్న బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ గ్రూపులు తమ దాడులను మరింత ఉద్ధృతం చేశాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణమే అప్రమత్తంగా వ్యవహరించింది. అక్కడ ఉన్న భారతీయులు తమ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, అవసరమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది. సిరియా నుంచి తక్షణమే బయటకు రావాలని జారీ చేసిన ఈ హెచ్చరిక భారత పౌరుల భద్రతపై కేంద్రం తీసుకుంటున్న చొరవను సూచిస్తోంది.

Kumar

Recent Posts

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

16 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago