Political News

ఆ బియ్యం జంతువులూ తినవు – వైసీపీ ఎమ్మెల్యే !!

జగన్ సర్కారు ప్రతిచోటా ఏదో ఒక విషయంలో దొరికిపోతోంది. తాజాగా కరోనా సాయం కింద పంచిన బియ్యం ఎందుకు పనికిరానివని, ముగ్గుబట్టిపోయి జంతువులు కూడా మూతి చూడనంత దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. అయితే ఇది ప్రతిపక్షం చేసిన విమర్శలు కావు. జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శ ఇది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

ఆ జిల్లా కలెక్టరు కరోనాను లెక్కచేయకుండా పోరాడుతున్న జర్నలిస్టుకు కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యం, సరుకులు పంచారట. అయితే, అవి అత్యంత నాణ్యం రహితంగా పూర్తిగా పాడైపోయినవి పంచారు. ఆ సరుకులు తీసుకున్న జర్నిస్టులు మమ్మల్ని ఇంత అవమానిస్తారా? దీనికంటే మీరు ఇవ్వకుండా ఉంటే మాకు కొంచెం గౌరవంగా ఉండేది అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి… జర్నలిస్టుల వద్దకు వెళ్లారు. వారు తీసుకున్న బియ్యన్న పరిశీలించి ఆశ్చర్యపోయారు. మరీ ఇంత చండాలంగా పంచారే అని అన్నారు.

అనంతరం ఆయన దీనిపై మాట్లాడుతూ… కలెక్టరు పెద్ద మనసుతో జర్నలిస్టులకు అండగా నిలవాలనుకుని నిర్ణయం తీసుకున్నారు. బియ్యం పప్పులు పంచారు బానే ఉంది. కానీ వాటి నాణ్యత సంగతి పక్కన పెడితే జంతువులు తినేవిధంగా కూడా లేవు ఆ బియ్యం. పూర్తిగా పాడైపోయాయి అంటూ స్వయంగా తనే మీడియాతో చెప్పారు. మరి కలెక్టరుదు పెద్ద మనసు అన్నారు సరే, ఎమ్మెల్యే వచ్చి బాధపడ్డారు బానే ఉంది… మరి తప్పు ఎవరు చేసినట్టు? ఈ ఎమ్మెల్యే ఎవరిని నిందించినట్టు? కంటి తుడుపుకోసం చేసిన మాటలా? లేక జగన్ పై విమర్శలా? ఏమని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వమే పంచి, అధికార పార్టీ నాయకులే విమర్శలు చేస్తే… అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని తెలియని అయోమయ పరిస్థితి.

This post was last modified on April 28, 2020 8:56 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

2 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

7 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

9 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

13 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

13 hours ago