Political News

ఆ బియ్యం జంతువులూ తినవు – వైసీపీ ఎమ్మెల్యే !!

జగన్ సర్కారు ప్రతిచోటా ఏదో ఒక విషయంలో దొరికిపోతోంది. తాజాగా కరోనా సాయం కింద పంచిన బియ్యం ఎందుకు పనికిరానివని, ముగ్గుబట్టిపోయి జంతువులు కూడా మూతి చూడనంత దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. అయితే ఇది ప్రతిపక్షం చేసిన విమర్శలు కావు. జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శ ఇది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

ఆ జిల్లా కలెక్టరు కరోనాను లెక్కచేయకుండా పోరాడుతున్న జర్నలిస్టుకు కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యం, సరుకులు పంచారట. అయితే, అవి అత్యంత నాణ్యం రహితంగా పూర్తిగా పాడైపోయినవి పంచారు. ఆ సరుకులు తీసుకున్న జర్నిస్టులు మమ్మల్ని ఇంత అవమానిస్తారా? దీనికంటే మీరు ఇవ్వకుండా ఉంటే మాకు కొంచెం గౌరవంగా ఉండేది అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి… జర్నలిస్టుల వద్దకు వెళ్లారు. వారు తీసుకున్న బియ్యన్న పరిశీలించి ఆశ్చర్యపోయారు. మరీ ఇంత చండాలంగా పంచారే అని అన్నారు.

అనంతరం ఆయన దీనిపై మాట్లాడుతూ… కలెక్టరు పెద్ద మనసుతో జర్నలిస్టులకు అండగా నిలవాలనుకుని నిర్ణయం తీసుకున్నారు. బియ్యం పప్పులు పంచారు బానే ఉంది. కానీ వాటి నాణ్యత సంగతి పక్కన పెడితే జంతువులు తినేవిధంగా కూడా లేవు ఆ బియ్యం. పూర్తిగా పాడైపోయాయి అంటూ స్వయంగా తనే మీడియాతో చెప్పారు. మరి కలెక్టరుదు పెద్ద మనసు అన్నారు సరే, ఎమ్మెల్యే వచ్చి బాధపడ్డారు బానే ఉంది… మరి తప్పు ఎవరు చేసినట్టు? ఈ ఎమ్మెల్యే ఎవరిని నిందించినట్టు? కంటి తుడుపుకోసం చేసిన మాటలా? లేక జగన్ పై విమర్శలా? ఏమని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వమే పంచి, అధికార పార్టీ నాయకులే విమర్శలు చేస్తే… అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని తెలియని అయోమయ పరిస్థితి.

This post was last modified on April 28, 2020 8:56 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

సంక్రాంతి కోసం నాగార్జున స్కెచ్

మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…

19 mins ago

సాయిపల్లవిని టార్గెట్ చేసుకుంటున్నారు

నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…

43 mins ago

సమంతా ఇంత మాస్ గా వుందేంటి

తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…

1 hour ago

రజని – కమల్ – చరణ్ ఒకే వేదికపై

కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…

1 hour ago

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

5 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

5 hours ago