Political News

ఆ బియ్యం జంతువులూ తినవు – వైసీపీ ఎమ్మెల్యే !!

జగన్ సర్కారు ప్రతిచోటా ఏదో ఒక విషయంలో దొరికిపోతోంది. తాజాగా కరోనా సాయం కింద పంచిన బియ్యం ఎందుకు పనికిరానివని, ముగ్గుబట్టిపోయి జంతువులు కూడా మూతి చూడనంత దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. అయితే ఇది ప్రతిపక్షం చేసిన విమర్శలు కావు. జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శ ఇది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

ఆ జిల్లా కలెక్టరు కరోనాను లెక్కచేయకుండా పోరాడుతున్న జర్నలిస్టుకు కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యం, సరుకులు పంచారట. అయితే, అవి అత్యంత నాణ్యం రహితంగా పూర్తిగా పాడైపోయినవి పంచారు. ఆ సరుకులు తీసుకున్న జర్నిస్టులు మమ్మల్ని ఇంత అవమానిస్తారా? దీనికంటే మీరు ఇవ్వకుండా ఉంటే మాకు కొంచెం గౌరవంగా ఉండేది అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి… జర్నలిస్టుల వద్దకు వెళ్లారు. వారు తీసుకున్న బియ్యన్న పరిశీలించి ఆశ్చర్యపోయారు. మరీ ఇంత చండాలంగా పంచారే అని అన్నారు.

అనంతరం ఆయన దీనిపై మాట్లాడుతూ… కలెక్టరు పెద్ద మనసుతో జర్నలిస్టులకు అండగా నిలవాలనుకుని నిర్ణయం తీసుకున్నారు. బియ్యం పప్పులు పంచారు బానే ఉంది. కానీ వాటి నాణ్యత సంగతి పక్కన పెడితే జంతువులు తినేవిధంగా కూడా లేవు ఆ బియ్యం. పూర్తిగా పాడైపోయాయి అంటూ స్వయంగా తనే మీడియాతో చెప్పారు. మరి కలెక్టరుదు పెద్ద మనసు అన్నారు సరే, ఎమ్మెల్యే వచ్చి బాధపడ్డారు బానే ఉంది… మరి తప్పు ఎవరు చేసినట్టు? ఈ ఎమ్మెల్యే ఎవరిని నిందించినట్టు? కంటి తుడుపుకోసం చేసిన మాటలా? లేక జగన్ పై విమర్శలా? ఏమని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వమే పంచి, అధికార పార్టీ నాయకులే విమర్శలు చేస్తే… అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని తెలియని అయోమయ పరిస్థితి.

This post was last modified on April 28, 2020 8:56 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

3 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

5 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

10 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

10 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

11 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

11 hours ago