జగన్ సర్కారు ప్రతిచోటా ఏదో ఒక విషయంలో దొరికిపోతోంది. తాజాగా కరోనా సాయం కింద పంచిన బియ్యం ఎందుకు పనికిరానివని, ముగ్గుబట్టిపోయి జంతువులు కూడా మూతి చూడనంత దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. అయితే ఇది ప్రతిపక్షం చేసిన విమర్శలు కావు. జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శ ఇది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
ఆ జిల్లా కలెక్టరు కరోనాను లెక్కచేయకుండా పోరాడుతున్న జర్నలిస్టుకు కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యం, సరుకులు పంచారట. అయితే, అవి అత్యంత నాణ్యం రహితంగా పూర్తిగా పాడైపోయినవి పంచారు. ఆ సరుకులు తీసుకున్న జర్నిస్టులు మమ్మల్ని ఇంత అవమానిస్తారా? దీనికంటే మీరు ఇవ్వకుండా ఉంటే మాకు కొంచెం గౌరవంగా ఉండేది అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి… జర్నలిస్టుల వద్దకు వెళ్లారు. వారు తీసుకున్న బియ్యన్న పరిశీలించి ఆశ్చర్యపోయారు. మరీ ఇంత చండాలంగా పంచారే అని అన్నారు.
అనంతరం ఆయన దీనిపై మాట్లాడుతూ… కలెక్టరు పెద్ద మనసుతో జర్నలిస్టులకు అండగా నిలవాలనుకుని నిర్ణయం తీసుకున్నారు. బియ్యం పప్పులు పంచారు బానే ఉంది. కానీ వాటి నాణ్యత సంగతి పక్కన పెడితే జంతువులు తినేవిధంగా కూడా లేవు ఆ బియ్యం. పూర్తిగా పాడైపోయాయి అంటూ స్వయంగా తనే మీడియాతో చెప్పారు. మరి కలెక్టరుదు పెద్ద మనసు అన్నారు సరే, ఎమ్మెల్యే వచ్చి బాధపడ్డారు బానే ఉంది… మరి తప్పు ఎవరు చేసినట్టు? ఈ ఎమ్మెల్యే ఎవరిని నిందించినట్టు? కంటి తుడుపుకోసం చేసిన మాటలా? లేక జగన్ పై విమర్శలా? ఏమని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వమే పంచి, అధికార పార్టీ నాయకులే విమర్శలు చేస్తే… అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని తెలియని అయోమయ పరిస్థితి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…