Political News

రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌లు.. తెర‌పైకి మ‌రో వివాదం!

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో వాయిదాల‌ ప‌ర్వం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అదానీ, మ‌ణిపూర్‌, యూపీలో సంభాల్ వివాదం వంటివాటిపై చ‌ర్చ‌కు ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌ట్ట‌డంతో స‌భ‌లు స‌జావుగా సాగ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌ల వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఓ సీటు వ‌ద్ద‌ రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌లు ల‌భించడం వివాదానికి, అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారి తీసింది. ఈ నోట్ల క‌ట్ట‌లు ల‌భించ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేసిన చైర్మ‌న్‌.. విచార‌ణ‌కు ఆదేశించారు.

ఏం జ‌రిగింది?

శుక్ర‌వారం ఉద‌యం స‌భ ప్రారంభం అవుతూనే.. చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ మాట్లాడుతూ.. 222వ నెంబ‌రు సీటు వ‌ద్ద 500, 100 రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌లు ల‌భించాయ‌ని పేర్కొన్నారు. ఈ సీటును కాంగ్రెస్ అభ్య‌ర్థి అభిషేక్ మ‌ను సింఘ్వీకి కేటాయించాన‌ని, నోట్ల క‌ట్ట‌ల విష‌యం త‌న దృష్టికి రాగానే విచార‌ణ కు ఆదేశించాన‌ని చెప్పారు. గురువారం సాయంత్రం ఈ విష‌యం వెలుగు చూసింద‌న్నారు. అయితే.. జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ చేసిన ప్ర‌క‌ట‌న స‌భ‌లో నిర‌స‌నకు దారి తీసింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.

రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌లు వెలుగు చూడ‌డంపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని అధికార బీజేపీ స‌భ్యులు డిమాండ్ చేశారు. అయితే.. విచార‌ణ‌కు అభ్యంత‌రం లేద‌న్న కాంగ్రెస్ స‌భ్యులు అస‌లు విచార‌ణే జ‌ర‌గ‌కుండా.. త‌మ స‌భ్యుడి పేరు(సింఘ్వీ) ఎలా చెబుతార‌ని నిల‌దీశారు. రాజ్య‌స‌భ‌లో విపక్ష నాయ‌కుడు, కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఈ విష‌యంపై నిప్పులు చెరిగారు. అయితే.. విచార‌ణ‌కు తాము అభ్యంత‌రం చెప్ప‌డం లేద‌న్నారు.

శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా గురువారం స‌భ‌లో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. దీంతో స‌భ‌ను వాయిదా వేశారు. అనంత‌రం.. సాధార‌ణ విధుల్లో భాగంగా భ‌ద్ర‌తా సిబ్బంది ఛాంబ‌ర్‌ను తనిఖీ చేశారు. ఈ క్ర‌మంలోనే వారికి 222వ నెంబ‌రు సీటు వ‌ద్ద‌… రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌లు ల‌భించాయి. దీంతో చైర్మ‌న్ వెంట‌నే దీనిపై విచార‌ణ కు ఆదేశించారు. ఇదే విష‌యాన్ని శుక్ర‌వారం ఉద‌యం స‌భ ప్రారంభం కాగానే స‌భ్యుల‌కు వివ‌రించారు. అయితే.. “ఆ సీటును కాంగ్రెస్ అభ్య‌ర్థి అభిషేక్ మ‌ను సింఘ్వీకి కేటాయించాం” అని చైర్మ‌న్ వెల్ల‌డించ‌డం వివాదానికి దారితీసింది.

This post was last modified on December 6, 2024 2:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: Rajya Sabha

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago