పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదానీ, మణిపూర్, యూపీలో సంభాల్ వివాదం వంటివాటిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సభలు సజావుగా సాగడం లేదు. ఇక, ఇప్పుడు రాజ్యసభలో నోట్ల కట్టల వివాదం తెరమీదికి వచ్చింది. ఓ సీటు వద్ద రూ.500, రూ.100 నోట్ల కట్టలు లభించడం వివాదానికి, అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ నోట్ల కట్టలు లభించడంపై విస్మయం వ్యక్తం చేసిన చైర్మన్.. విచారణకు ఆదేశించారు.
ఏం జరిగింది?
శుక్రవారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే.. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ.. 222వ నెంబరు సీటు వద్ద 500, 100 రూపాయల నోట్ల కట్టలు లభించాయని పేర్కొన్నారు. ఈ సీటును కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించానని, నోట్ల కట్టల విషయం తన దృష్టికి రాగానే విచారణ కు ఆదేశించానని చెప్పారు. గురువారం సాయంత్రం ఈ విషయం వెలుగు చూసిందన్నారు. అయితే.. జగదీప్ ధన్ఖడ్ చేసిన ప్రకటన సభలో నిరసనకు దారి తీసింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
రూ.500, రూ.100 నోట్ల కట్టలు వెలుగు చూడడంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని అధికార బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే.. విచారణకు అభ్యంతరం లేదన్న కాంగ్రెస్ సభ్యులు అసలు విచారణే జరగకుండా.. తమ సభ్యుడి పేరు(సింఘ్వీ) ఎలా చెబుతారని నిలదీశారు. రాజ్యసభలో విపక్ష నాయకుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయంపై నిప్పులు చెరిగారు. అయితే.. విచారణకు తాము అభ్యంతరం చెప్పడం లేదన్నారు.
శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం సభలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సభను వాయిదా వేశారు. అనంతరం.. సాధారణ విధుల్లో భాగంగా భద్రతా సిబ్బంది ఛాంబర్ను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే వారికి 222వ నెంబరు సీటు వద్ద… రూ.500, రూ.100 నోట్ల కట్టలు లభించాయి. దీంతో చైర్మన్ వెంటనే దీనిపై విచారణ కు ఆదేశించారు. ఇదే విషయాన్ని శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే సభ్యులకు వివరించారు. అయితే.. “ఆ సీటును కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించాం” అని చైర్మన్ వెల్లడించడం వివాదానికి దారితీసింది.
This post was last modified on December 6, 2024 2:02 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…