Political News

రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌లు.. తెర‌పైకి మ‌రో వివాదం!

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో వాయిదాల‌ ప‌ర్వం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అదానీ, మ‌ణిపూర్‌, యూపీలో సంభాల్ వివాదం వంటివాటిపై చ‌ర్చ‌కు ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌ట్ట‌డంతో స‌భ‌లు స‌జావుగా సాగ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌ల వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఓ సీటు వ‌ద్ద‌ రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌లు ల‌భించడం వివాదానికి, అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారి తీసింది. ఈ నోట్ల క‌ట్ట‌లు ల‌భించ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేసిన చైర్మ‌న్‌.. విచార‌ణ‌కు ఆదేశించారు.

ఏం జ‌రిగింది?

శుక్ర‌వారం ఉద‌యం స‌భ ప్రారంభం అవుతూనే.. చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ మాట్లాడుతూ.. 222వ నెంబ‌రు సీటు వ‌ద్ద 500, 100 రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌లు ల‌భించాయ‌ని పేర్కొన్నారు. ఈ సీటును కాంగ్రెస్ అభ్య‌ర్థి అభిషేక్ మ‌ను సింఘ్వీకి కేటాయించాన‌ని, నోట్ల క‌ట్ట‌ల విష‌యం త‌న దృష్టికి రాగానే విచార‌ణ కు ఆదేశించాన‌ని చెప్పారు. గురువారం సాయంత్రం ఈ విష‌యం వెలుగు చూసింద‌న్నారు. అయితే.. జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ చేసిన ప్ర‌క‌ట‌న స‌భ‌లో నిర‌స‌నకు దారి తీసింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.

రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌లు వెలుగు చూడ‌డంపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని అధికార బీజేపీ స‌భ్యులు డిమాండ్ చేశారు. అయితే.. విచార‌ణ‌కు అభ్యంత‌రం లేద‌న్న కాంగ్రెస్ స‌భ్యులు అస‌లు విచార‌ణే జ‌ర‌గ‌కుండా.. త‌మ స‌భ్యుడి పేరు(సింఘ్వీ) ఎలా చెబుతార‌ని నిల‌దీశారు. రాజ్య‌స‌భ‌లో విపక్ష నాయ‌కుడు, కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఈ విష‌యంపై నిప్పులు చెరిగారు. అయితే.. విచార‌ణ‌కు తాము అభ్యంత‌రం చెప్ప‌డం లేద‌న్నారు.

శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా గురువారం స‌భ‌లో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. దీంతో స‌భ‌ను వాయిదా వేశారు. అనంత‌రం.. సాధార‌ణ విధుల్లో భాగంగా భ‌ద్ర‌తా సిబ్బంది ఛాంబ‌ర్‌ను తనిఖీ చేశారు. ఈ క్ర‌మంలోనే వారికి 222వ నెంబ‌రు సీటు వ‌ద్ద‌… రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌లు ల‌భించాయి. దీంతో చైర్మ‌న్ వెంట‌నే దీనిపై విచార‌ణ కు ఆదేశించారు. ఇదే విష‌యాన్ని శుక్ర‌వారం ఉద‌యం స‌భ ప్రారంభం కాగానే స‌భ్యుల‌కు వివ‌రించారు. అయితే.. “ఆ సీటును కాంగ్రెస్ అభ్య‌ర్థి అభిషేక్ మ‌ను సింఘ్వీకి కేటాయించాం” అని చైర్మ‌న్ వెల్ల‌డించ‌డం వివాదానికి దారితీసింది.

This post was last modified on December 6, 2024 2:02 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago