Political News

రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌లు.. తెర‌పైకి మ‌రో వివాదం!

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో వాయిదాల‌ ప‌ర్వం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అదానీ, మ‌ణిపూర్‌, యూపీలో సంభాల్ వివాదం వంటివాటిపై చ‌ర్చ‌కు ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌ట్ట‌డంతో స‌భ‌లు స‌జావుగా సాగ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో నోట్ల క‌ట్ట‌ల వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఓ సీటు వ‌ద్ద‌ రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌లు ల‌భించడం వివాదానికి, అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారి తీసింది. ఈ నోట్ల క‌ట్ట‌లు ల‌భించ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేసిన చైర్మ‌న్‌.. విచార‌ణ‌కు ఆదేశించారు.

ఏం జ‌రిగింది?

శుక్ర‌వారం ఉద‌యం స‌భ ప్రారంభం అవుతూనే.. చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ మాట్లాడుతూ.. 222వ నెంబ‌రు సీటు వ‌ద్ద 500, 100 రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌లు ల‌భించాయ‌ని పేర్కొన్నారు. ఈ సీటును కాంగ్రెస్ అభ్య‌ర్థి అభిషేక్ మ‌ను సింఘ్వీకి కేటాయించాన‌ని, నోట్ల క‌ట్ట‌ల విష‌యం త‌న దృష్టికి రాగానే విచార‌ణ కు ఆదేశించాన‌ని చెప్పారు. గురువారం సాయంత్రం ఈ విష‌యం వెలుగు చూసింద‌న్నారు. అయితే.. జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ చేసిన ప్ర‌క‌ట‌న స‌భ‌లో నిర‌స‌నకు దారి తీసింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.

రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌లు వెలుగు చూడ‌డంపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని అధికార బీజేపీ స‌భ్యులు డిమాండ్ చేశారు. అయితే.. విచార‌ణ‌కు అభ్యంత‌రం లేద‌న్న కాంగ్రెస్ స‌భ్యులు అస‌లు విచార‌ణే జ‌ర‌గ‌కుండా.. త‌మ స‌భ్యుడి పేరు(సింఘ్వీ) ఎలా చెబుతార‌ని నిల‌దీశారు. రాజ్య‌స‌భ‌లో విపక్ష నాయ‌కుడు, కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఈ విష‌యంపై నిప్పులు చెరిగారు. అయితే.. విచార‌ణ‌కు తాము అభ్యంత‌రం చెప్ప‌డం లేద‌న్నారు.

శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా గురువారం స‌భ‌లో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. దీంతో స‌భ‌ను వాయిదా వేశారు. అనంత‌రం.. సాధార‌ణ విధుల్లో భాగంగా భ‌ద్ర‌తా సిబ్బంది ఛాంబ‌ర్‌ను తనిఖీ చేశారు. ఈ క్ర‌మంలోనే వారికి 222వ నెంబ‌రు సీటు వ‌ద్ద‌… రూ.500, రూ.100 నోట్ల క‌ట్ట‌లు ల‌భించాయి. దీంతో చైర్మ‌న్ వెంట‌నే దీనిపై విచార‌ణ కు ఆదేశించారు. ఇదే విష‌యాన్ని శుక్ర‌వారం ఉద‌యం స‌భ ప్రారంభం కాగానే స‌భ్యుల‌కు వివ‌రించారు. అయితే.. “ఆ సీటును కాంగ్రెస్ అభ్య‌ర్థి అభిషేక్ మ‌ను సింఘ్వీకి కేటాయించాం” అని చైర్మ‌న్ వెల్ల‌డించ‌డం వివాదానికి దారితీసింది.

This post was last modified on December 6, 2024 2:02 pm

Share

Recent Posts

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

14 minutes ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

3 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

4 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

5 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

9 hours ago