కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ, రేషన్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టే వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి దిశానిర్ధేశం చేశారు. ప్రత్యేక భద్రతా అధికారి (సీఎస్ఓ) పర్యవేక్షణలో 24 గంటల నిఘా ఉండేలా వ్యూహం అమలు చేస్తున్నారు.
కాకినాడ పోర్టులో ఇప్పటికే సీజ్ చేసిన షిప్పై కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం తరలింపునకు సంబంధించిన లింకులు వెలికితీసేందుకు రెవెన్యూ, కస్టమ్స్, పోలీస్, సివిల్ సప్లై టీమ్స్ కలిసి ఆరా తీస్తున్నాయి. ఇందులో గ్రామీణ స్థాయిలోనే అక్రమ రవాణాకు సహకారం అందిస్తున్న అధికారుల పాత్రపై దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేస్తూ, ప్రతి కార్యకలాపాన్ని కఠినంగా పర్యవేక్షించనున్నారు.
షిప్ సీజ్ చర్యల వల్ల అంతర్జాతీయంగా ప్రభావం ఉండొచ్చన్న ఆందోళనల మధ్య, కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణలో నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసిన “సీజ్ ది షిప్” కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారి తీసినప్పటికీ, కార్యాచరణ మాత్రం కట్టుదిట్టంగా ఉండబోతుంది.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి సర్కారు నిష్క్రమణ స్పష్టమైంది. గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు అన్ని కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ముఖ్యంగా కేంద్ర ఏజెన్సీలతో కలిసి వ్యవహరించడానికి సన్నద్ధమవుతోంది. త్వరలోనే మరిన్ని చర్యల ద్వారా రేషన్ బియ్యం మాఫియాకు ఎండ్ కార్డ్ వేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
This post was last modified on December 4, 2024 12:17 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…