కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ, రేషన్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టే వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి దిశానిర్ధేశం చేశారు. ప్రత్యేక భద్రతా అధికారి (సీఎస్ఓ) పర్యవేక్షణలో 24 గంటల నిఘా ఉండేలా వ్యూహం అమలు చేస్తున్నారు.
కాకినాడ పోర్టులో ఇప్పటికే సీజ్ చేసిన షిప్పై కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం తరలింపునకు సంబంధించిన లింకులు వెలికితీసేందుకు రెవెన్యూ, కస్టమ్స్, పోలీస్, సివిల్ సప్లై టీమ్స్ కలిసి ఆరా తీస్తున్నాయి. ఇందులో గ్రామీణ స్థాయిలోనే అక్రమ రవాణాకు సహకారం అందిస్తున్న అధికారుల పాత్రపై దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేస్తూ, ప్రతి కార్యకలాపాన్ని కఠినంగా పర్యవేక్షించనున్నారు.
షిప్ సీజ్ చర్యల వల్ల అంతర్జాతీయంగా ప్రభావం ఉండొచ్చన్న ఆందోళనల మధ్య, కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణలో నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసిన “సీజ్ ది షిప్” కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారి తీసినప్పటికీ, కార్యాచరణ మాత్రం కట్టుదిట్టంగా ఉండబోతుంది.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి సర్కారు నిష్క్రమణ స్పష్టమైంది. గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు అన్ని కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ముఖ్యంగా కేంద్ర ఏజెన్సీలతో కలిసి వ్యవహరించడానికి సన్నద్ధమవుతోంది. త్వరలోనే మరిన్ని చర్యల ద్వారా రేషన్ బియ్యం మాఫియాకు ఎండ్ కార్డ్ వేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
This post was last modified on December 4, 2024 12:17 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…