Political News

మాఫియాకు పవన్ చెక్‌మేట్.. పోర్టుపై ప్రత్యేక నిఘా

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ, రేషన్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టే వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి దిశానిర్ధేశం చేశారు. ప్రత్యేక భద్రతా అధికారి (సీఎస్ఓ) పర్యవేక్షణలో 24 గంటల నిఘా ఉండేలా వ్యూహం అమలు చేస్తున్నారు.

కాకినాడ పోర్టులో ఇప్పటికే సీజ్ చేసిన షిప్‌పై కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం తరలింపునకు సంబంధించిన లింకులు వెలికితీసేందుకు రెవెన్యూ, కస్టమ్స్, పోలీస్, సివిల్ సప్లై టీమ్స్ కలిసి ఆరా తీస్తున్నాయి. ఇందులో గ్రామీణ స్థాయిలోనే అక్రమ రవాణాకు సహకారం అందిస్తున్న అధికారుల పాత్రపై దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేస్తూ, ప్రతి కార్యకలాపాన్ని కఠినంగా పర్యవేక్షించనున్నారు.

షిప్ సీజ్ చర్యల వల్ల అంతర్జాతీయంగా ప్రభావం ఉండొచ్చన్న ఆందోళనల మధ్య, కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణలో నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసిన “సీజ్ ది షిప్” కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారి తీసినప్పటికీ, కార్యాచరణ మాత్రం కట్టుదిట్టంగా ఉండబోతుంది.

రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి సర్కారు నిష్క్రమణ స్పష్టమైంది. గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు అన్ని కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ముఖ్యంగా కేంద్ర ఏజెన్సీలతో కలిసి వ్యవహరించడానికి సన్నద్ధమవుతోంది. త్వరలోనే మరిన్ని చర్యల ద్వారా రేషన్ బియ్యం మాఫియాకు ఎండ్ కార్డ్ వేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

This post was last modified on December 4, 2024 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

8 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

10 hours ago