ప్రతిపక్ష వైసీపీ నాయకులు తరచుగా సీఎం చంద్రబాబుపై చేస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆయన చెక్ పెట్టనున్నారు. రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని.. ఆయన రాజధానిని కడతానని చెబుతు న్నారంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కారణం.. ప్రస్తుతం ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్స్కు చెందిన ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. ఈ కారణంగానే చంద్రబాబుపై అనేక విమర్శలు వచ్చాయి.
అయితే.. ఇప్పుడు చంద్రబాబు అదే రాజధానిలోని వెలగపూడిలో శాస్వత నివాసం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాజధానికి నడిబొడ్డు ప్రాంతమైన వెలగపూడిలో 25 వేల చదరపు గజాల(ఐదు ఎకరాలు) స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతులది కావడం గమనార్హం. ఇది కూడా రాజధాని ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నదేనని, రిటర్నబుల్ ఫ్లాట్ అని తెలిసింది. ఆ రైతులకు ఇప్పటికే సంబంధిత సొమ్ములు జమ చేశారని సమాచారం.
ఇక, స్థలం విషయానికి వస్తే.. వెలగపూడిలోని ప్రధాన సీడ్ యాక్సిస్ రోడ్డుకు పక్కనే ఈ స్థల ఉంటుంది. పైగా.. నాలుగువైపులా రోడ్డు ఉండేలా చూసుకున్నారు. అదేవిదంగా గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోల నివాసాల మధ్య, న్యాయమూర్తుల బంగళాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లకు ఈ స్థలానికి కేవలం రెండు కిలో మీటర్ల పరిదిలోనే ఉన్నాయి. దాదాపు ఐదు ఎకరాల్లోని ఈ స్థలంలో కొంత స్థలాన్ని ఇంటికి, మరికొంత స్థలాన్ని తోటలకు, భద్రతా సిబ్బంది గదులకు కేటాయిస్తారు. అదేవిధంగా పార్కింగ్కు కూడా కొంత స్థలాన్నికేటాయించనున్నారు.
ఈ నిర్మాణం ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా.. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన, చేస్తున్న విమర్శలకు ఆయన తనదైన శైలిలో జవాబు చెప్పనున్నారనేది స్పష్టం. ఇదిలావుంటే.. సొంత నియోజకవర్గం కుప్పంలోనూ చంద్రబాబుకు నివాసం లేదని అప్పట్లో వైసీపీ నాయకులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 35 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నా.. సొంత ఇల్లు కట్టుకోలేదని విమర్శించారు. దీంతో గత ఏడాదిన్నర కిందటే కుప్పంలోనూ చంద్రబాబు ఇంటికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి.. అంటే మరో నాలుగు మాసాల్లో ఆ ఇల్లు కూడా పూర్తి కావస్తోంది. ఏదేమైనా.. వైసీపీ విమర్శల పుణ్యమా అని.. చంద్రబాబు ఒక ఇల్లు కాదు.. నాలుగిళ్ల వాడవుతున్నారన్నది ఆసక్తికరం.
This post was last modified on December 4, 2024 1:00 pm
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…
శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా…
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…