Political News

మ‌హారాష్ట్ర సీఎంగా ఫ‌డ‌ణ‌వీస్‌, డిప్యూటీగా షిండే

మ‌హారాష్ట్ర‌లో గ‌త 10 రోజుల‌కు పైగానే నెల‌కొన్న రాజ‌కీయ ప్ర‌తిష్ఠంభ‌న‌కు బీజేపీ పెద్ద‌లు ముగింపు ప‌లికారు. గ‌త నెల 23న వెలువ‌డిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి భారీ విజ‌యం ద‌క్కించుకుంది. మొత్తం 288 స్థానాలున్న అసెంబ్లీలో మ‌హాయుతి కూట‌మి 235 స్థానాలు ద‌క్కించుకుంది. అయితే.. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిన న‌వంబ‌రు 26వ తేదీనాటికి.. మ‌హాయుతిలో ముఖ్య‌మంత్రిపీఠంపై ర‌గ‌డ ఏర్ప‌డింది. దీంతో అప్ప‌టి నుంచి ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వ‌మే కొన‌సాగుతోంది. మొత్తం 235 స్థానాల‌లో త‌మ‌కు 132 స్థానాలు ద‌క్కడంతో త‌మ‌కే ముఖ్య‌మంత్రి స్తానం ద‌క్కాల‌ని క‌మ‌ల‌నాథులు ప‌ట్టుబ‌ట్టారు.

అయితే.. త‌మ స‌హ‌కారం లేకుండా మ‌హాయుతి ఏర్ప‌డ‌లేద‌ని శివ‌సేన అధినేత‌, ప్ర‌స్తుత ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా.. ముఖ్య‌మంత్రిపీఠాన్ని త‌న‌కే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో ముఖ్య‌మంత్రిపీఠంపై ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డింది. ఈ విష‌యంపై ప‌లు మార్లు ఢిల్లీలో ఇరు ప‌క్షాల మ‌ధ్య చ‌ర్య‌లు జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా ప‌రిష్కారం ల‌భించ‌లేదు. చివ‌ర‌కు ఏక్‌నాథ్ షిండే అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలో ఇక‌, మ‌హాయుతి విచ్ఛిన్నం అవుతుంద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలువ‌చ్చాయి. దీనిపై హుటాహుటిన స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి,బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను అలెర్టు చేశారు.

ఈ క్ర‌మంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రినిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలో ద్విస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసి మ‌హారాష్ట్ర‌కు పంపిం చారు. ఈ క్ర‌మంలో రెండున్న‌రేళ్లు మీరు.. రెండున్న‌రేళ్లు మేము! అనే ప్ర‌తిపాద‌న కూడా.. శివ‌సేన నుంచి తెర‌మీదికి వ‌చ్చింది. దీనికి కూడా బీజేపీ అంగీక‌రించ‌లేదు. ఇక‌, హోం శాఖ‌ను మాత్రం శివ‌సేన వ‌ర్గానికి కేటాయించేలా నిర్ణ‌యించారు. దీంతో వివాదం దాదాపు కొలిక్కి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఉన్న‌ట్టుగానే ముఖ్య‌మంత్రి, ఇద్ద‌రు ఉప ముఖ్య‌మంత్రులు ఉండేలా నిర్ణ‌యించారు. దీనిప్ర‌కారం.. బీజేపీ నాయ‌కుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను సీఎంగా, శివ‌సేన అధినేత ఏక్‌నాథ్ షిండేను ఉప ముఖ్య‌మంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ ప‌వార్‌ను మ‌రో ఉప ముఖ్య‌మంత్రిగా నిర్ణ‌యించారు.

ఆయా ప్ర‌తిపాద‌న‌ల‌కు ఇరు ప‌క్షాలు అంగీకారం తెలిపాయి. హోం శాఖ‌ను శాంతి భ‌ద్ర‌త‌ల‌తో స‌హా శివ‌సేన‌కు అప్ప‌గిస్తారు. అదేవిధంగా మునిసిప‌ల్ శాఖ‌ను కూడా ఈ పార్టీకే ఇస్తారు. ఇక‌, అట‌వీ, ర‌హ‌దారి శాఖ‌ల‌ను ఎన్సీపీకి కేటాయిస్తారు. మొత్తంగా.. మ‌హాయుతిలో కీల‌క నిర్ణ‌యాల‌కు ప‌చ్చ జెండా ఊపారు. దీంతో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగ‌మం అయింది. మ‌రో వైపు ఈ నెల 5న నూత‌న ప్ర‌భుత్వం ఏర్పాటుకు వీలుగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీ స‌హా కేంద్ర మంత్రులు, బీజేపీ నాయ‌కులు హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు కూడా ప్ర‌త్యేక ఆహ్వానాలు అంద‌నున్నాయి.

This post was last modified on December 4, 2024 9:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

3 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

4 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

5 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

5 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

6 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

8 hours ago