Political News

పార్ల‌మెంటులో ‘స‌బ‌ర్మ‌తి రిపోర్టు’.. ‘చిత్రం’ ఏంటంటే!

దేశాన్ని రెండు ద‌శాబ్దాలుగా కుదిపేస్తున్న గుజ‌రాత్‌లోని గోద్రా రైలు దుర్ఘ‌ట‌న వ్య‌వ‌హారం.. ఇప్పుడు పార్ల‌మెంటుకు చేరింది. పార్ల‌మెంటులోని బాల‌యోగి ఆడిటోరియంలో ఈ రోజు ‘ద స‌బ‌ర్మ‌తి రిపోర్టు’ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌ద‌ర్శించే ఈ సినిమాను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా హాజ‌రై వీక్షించ‌నున్నారు. ఈ సినిమాను వీక్షించేందుకు కేంద్ర‌మంత్రులు, పార్ల‌మెంటు ఉభ‌య స‌భ్యుల‌ను కూడా ఆహ్వానించారు.

గుజ‌రాత్‌లోని గోద్రాలో 2002లో జ‌రిగిన రైలు ద‌హ‌నం ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో నాటి ఉదంతానికి సంబంధించి దాగి ఉన్న అనేక అంశాల‌ను చూపించారు. గ‌త నెల 15న విడుద‌లైన ద స‌బ‌ర్మ‌తి రిపోర్టు సినిమాకు ధీర‌జ్ స‌ర్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మొత్తం 50 కోట్ల రూపా య‌ల వ్య‌యంతో ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్, అమూల్ వికాస్ మోహ‌న్‌, అన్షుల్ మోహ‌న్‌లు నిర్మించారు. కాగా, గ‌తంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఈ సినిమాను ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే.

అస‌లేంటిది?

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ ఉన్న స‌మ‌యంలో 2002లో గోద్రా రైలు దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. వంద‌లాది మంది హిందువులు ప్ర‌యాణిస్తున్న రైలుకు.. కొంద‌రు దుండ‌గులు నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. త‌ర్వాత‌.. ఓ మ‌తానికి చెందిన వారిని పోలీసులు కాల్చి చంపారు. దీనిపై అప్ప‌ట్లోనే రాజ‌కీయంగా తీవ్ర దుమారం, విమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌దాని న‌రేంద్ర మోడీకి ఇప్ప‌టికీ గోద్రా తాలూకు విమ‌ర్శ‌లు త‌గులుతూనే ఉన్నాయి.

ఇదిలావుంటే.. ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ న్యూస్‌.. ‘మోడీ ఫైల్స్‌’ పేరుతో డాక్యుమెంట్ సిరీస్ తీసింది. ఈ సిరీస్‌లో మోడీ చుట్టూ ఉన్న అనేక విమ‌ర్శ‌ల‌ను ఎత్తి చూపించారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే బీబీసీ కార్యాల‌యాల‌పై సీబీఐ, ఐటీ దాడులు జ‌ర‌గ‌డం, ఆ సంస్థ భార‌త్‌లోని త‌మ కార్యాల‌యాల‌ను మూసి వేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే.

ఈ ఘ‌ట‌న కూడా అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ద‌ర్శ‌కుడు స‌ర్నా తీసిన స‌బ‌ర్మ‌తి సినిమాలో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని చెప్పార‌న్న‌ది బీజేపీ మాట‌. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాను ప్ర‌ధాని ప్ర‌శంసించ‌డం.. దానిని ఏకంగా పార్ల‌మెంటులో ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

5 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

6 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

8 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

9 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

11 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

11 hours ago