Political News

పార్ల‌మెంటులో ‘స‌బ‌ర్మ‌తి రిపోర్టు’.. ‘చిత్రం’ ఏంటంటే!

దేశాన్ని రెండు ద‌శాబ్దాలుగా కుదిపేస్తున్న గుజ‌రాత్‌లోని గోద్రా రైలు దుర్ఘ‌ట‌న వ్య‌వ‌హారం.. ఇప్పుడు పార్ల‌మెంటుకు చేరింది. పార్ల‌మెంటులోని బాల‌యోగి ఆడిటోరియంలో ఈ రోజు ‘ద స‌బ‌ర్మ‌తి రిపోర్టు’ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌ద‌ర్శించే ఈ సినిమాను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా హాజ‌రై వీక్షించ‌నున్నారు. ఈ సినిమాను వీక్షించేందుకు కేంద్ర‌మంత్రులు, పార్ల‌మెంటు ఉభ‌య స‌భ్యుల‌ను కూడా ఆహ్వానించారు.

గుజ‌రాత్‌లోని గోద్రాలో 2002లో జ‌రిగిన రైలు ద‌హ‌నం ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో నాటి ఉదంతానికి సంబంధించి దాగి ఉన్న అనేక అంశాల‌ను చూపించారు. గ‌త నెల 15న విడుద‌లైన ద స‌బ‌ర్మ‌తి రిపోర్టు సినిమాకు ధీర‌జ్ స‌ర్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మొత్తం 50 కోట్ల రూపా య‌ల వ్య‌యంతో ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్, అమూల్ వికాస్ మోహ‌న్‌, అన్షుల్ మోహ‌న్‌లు నిర్మించారు. కాగా, గ‌తంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఈ సినిమాను ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే.

అస‌లేంటిది?

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ ఉన్న స‌మ‌యంలో 2002లో గోద్రా రైలు దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. వంద‌లాది మంది హిందువులు ప్ర‌యాణిస్తున్న రైలుకు.. కొంద‌రు దుండ‌గులు నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. త‌ర్వాత‌.. ఓ మ‌తానికి చెందిన వారిని పోలీసులు కాల్చి చంపారు. దీనిపై అప్ప‌ట్లోనే రాజ‌కీయంగా తీవ్ర దుమారం, విమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌దాని న‌రేంద్ర మోడీకి ఇప్ప‌టికీ గోద్రా తాలూకు విమ‌ర్శ‌లు త‌గులుతూనే ఉన్నాయి.

ఇదిలావుంటే.. ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ న్యూస్‌.. ‘మోడీ ఫైల్స్‌’ పేరుతో డాక్యుమెంట్ సిరీస్ తీసింది. ఈ సిరీస్‌లో మోడీ చుట్టూ ఉన్న అనేక విమ‌ర్శ‌ల‌ను ఎత్తి చూపించారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే బీబీసీ కార్యాల‌యాల‌పై సీబీఐ, ఐటీ దాడులు జ‌ర‌గ‌డం, ఆ సంస్థ భార‌త్‌లోని త‌మ కార్యాల‌యాల‌ను మూసి వేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే.

ఈ ఘ‌ట‌న కూడా అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ద‌ర్శ‌కుడు స‌ర్నా తీసిన స‌బ‌ర్మ‌తి సినిమాలో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని చెప్పార‌న్న‌ది బీజేపీ మాట‌. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాను ప్ర‌ధాని ప్ర‌శంసించ‌డం.. దానిని ఏకంగా పార్ల‌మెంటులో ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 2, 2024 2:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago