దేశాన్ని రెండు దశాబ్దాలుగా కుదిపేస్తున్న గుజరాత్లోని గోద్రా రైలు దుర్ఘటన వ్యవహారం.. ఇప్పుడు పార్లమెంటుకు చేరింది. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఈ రోజు ‘ద సబర్మతి రిపోర్టు’ సినిమాను ప్రదర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రదర్శించే ఈ సినిమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హాజరై వీక్షించనున్నారు. ఈ సినిమాను వీక్షించేందుకు కేంద్రమంత్రులు, పార్లమెంటు ఉభయ సభ్యులను కూడా ఆహ్వానించారు.
గుజరాత్లోని గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో నాటి ఉదంతానికి సంబంధించి దాగి ఉన్న అనేక అంశాలను చూపించారు. గత నెల 15న విడుదలైన ద సబర్మతి రిపోర్టు సినిమాకు ధీరజ్ సర్నా దర్శకత్వం వహించారు. మొత్తం 50 కోట్ల రూపా యల వ్యయంతో ఏక్తా కపూర్, శోభా కపూర్, అమూల్ వికాస్ మోహన్, అన్షుల్ మోహన్లు నిర్మించారు. కాగా, గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సినిమాను ప్రశంసించిన విషయం తెలిసిందే.
అసలేంటిది?
గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోడీ ఉన్న సమయంలో 2002లో గోద్రా రైలు దుర్ఘటన చోటు చేసుకుంది. వందలాది మంది హిందువులు ప్రయాణిస్తున్న రైలుకు.. కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత.. ఓ మతానికి చెందిన వారిని పోలీసులు కాల్చి చంపారు. దీనిపై అప్పట్లోనే రాజకీయంగా తీవ్ర దుమారం, విమర్శలు చోటు చేసుకున్నాయి. ప్రదాని నరేంద్ర మోడీకి ఇప్పటికీ గోద్రా తాలూకు విమర్శలు తగులుతూనే ఉన్నాయి.
ఇదిలావుంటే.. ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ న్యూస్.. ‘మోడీ ఫైల్స్’ పేరుతో డాక్యుమెంట్ సిరీస్ తీసింది. ఈ సిరీస్లో మోడీ చుట్టూ ఉన్న అనేక విమర్శలను ఎత్తి చూపించారు. ఈ పరిణామాల క్రమంలోనే బీబీసీ కార్యాలయాలపై సీబీఐ, ఐటీ దాడులు జరగడం, ఆ సంస్థ భారత్లోని తమ కార్యాలయాలను మూసి వేస్తున్నామని ప్రకటించడం తెలిసిందే.
ఈ ఘటన కూడా అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. అయితే.. ఇప్పుడు దర్శకుడు సర్నా తీసిన సబర్మతి సినిమాలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పారన్నది బీజేపీ మాట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ప్రధాని ప్రశంసించడం.. దానిని ఏకంగా పార్లమెంటులో ప్రదర్శిస్తుండడం గమనార్హం.
This post was last modified on December 2, 2024 2:05 pm
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…