Political News

పార్ల‌మెంటులో ‘స‌బ‌ర్మ‌తి రిపోర్టు’.. ‘చిత్రం’ ఏంటంటే!

దేశాన్ని రెండు ద‌శాబ్దాలుగా కుదిపేస్తున్న గుజ‌రాత్‌లోని గోద్రా రైలు దుర్ఘ‌ట‌న వ్య‌వ‌హారం.. ఇప్పుడు పార్ల‌మెంటుకు చేరింది. పార్ల‌మెంటులోని బాల‌యోగి ఆడిటోరియంలో ఈ రోజు ‘ద స‌బ‌ర్మ‌తి రిపోర్టు’ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌ద‌ర్శించే ఈ సినిమాను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా హాజ‌రై వీక్షించ‌నున్నారు. ఈ సినిమాను వీక్షించేందుకు కేంద్ర‌మంత్రులు, పార్ల‌మెంటు ఉభ‌య స‌భ్యుల‌ను కూడా ఆహ్వానించారు.

గుజ‌రాత్‌లోని గోద్రాలో 2002లో జ‌రిగిన రైలు ద‌హ‌నం ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో నాటి ఉదంతానికి సంబంధించి దాగి ఉన్న అనేక అంశాల‌ను చూపించారు. గ‌త నెల 15న విడుద‌లైన ద స‌బ‌ర్మ‌తి రిపోర్టు సినిమాకు ధీర‌జ్ స‌ర్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మొత్తం 50 కోట్ల రూపా య‌ల వ్య‌యంతో ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్, అమూల్ వికాస్ మోహ‌న్‌, అన్షుల్ మోహ‌న్‌లు నిర్మించారు. కాగా, గ‌తంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఈ సినిమాను ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే.

అస‌లేంటిది?

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ ఉన్న స‌మ‌యంలో 2002లో గోద్రా రైలు దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. వంద‌లాది మంది హిందువులు ప్ర‌యాణిస్తున్న రైలుకు.. కొంద‌రు దుండ‌గులు నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. త‌ర్వాత‌.. ఓ మ‌తానికి చెందిన వారిని పోలీసులు కాల్చి చంపారు. దీనిపై అప్ప‌ట్లోనే రాజ‌కీయంగా తీవ్ర దుమారం, విమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌దాని న‌రేంద్ర మోడీకి ఇప్ప‌టికీ గోద్రా తాలూకు విమ‌ర్శ‌లు త‌గులుతూనే ఉన్నాయి.

ఇదిలావుంటే.. ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ న్యూస్‌.. ‘మోడీ ఫైల్స్‌’ పేరుతో డాక్యుమెంట్ సిరీస్ తీసింది. ఈ సిరీస్‌లో మోడీ చుట్టూ ఉన్న అనేక విమ‌ర్శ‌ల‌ను ఎత్తి చూపించారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే బీబీసీ కార్యాల‌యాల‌పై సీబీఐ, ఐటీ దాడులు జ‌ర‌గ‌డం, ఆ సంస్థ భార‌త్‌లోని త‌మ కార్యాల‌యాల‌ను మూసి వేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే.

ఈ ఘ‌ట‌న కూడా అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ద‌ర్శ‌కుడు స‌ర్నా తీసిన స‌బ‌ర్మ‌తి సినిమాలో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని చెప్పార‌న్న‌ది బీజేపీ మాట‌. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాను ప్ర‌ధాని ప్ర‌శంసించ‌డం.. దానిని ఏకంగా పార్ల‌మెంటులో ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 2, 2024 2:05 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

5 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

5 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

5 hours ago