Political News

బీజేపీ జాతీయ పీఠంపై పురందేశ్వ‌రి..!?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ అధ్య‌క్షురాలిగా రాజ‌మండ్రి ఎంపీ, ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉన్న పురందేశ్వ‌రికి ప‌ట్టంక‌ట్ట‌నున్నారా? ఆమె పేరు ప‌రిశీల‌న‌లో ఉందా? అంటే.. జాతీయ మీడియా వ‌ర్గాలు ఔన‌నే అంటున్నాయి. ఆమె పేరు అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చింద‌ని కూడా చెబుతున్నాయి. దీనికి రెండు కార‌ణాలు పేర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆమె పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

1) వ‌చ్చే నెల‌లో.. ఢిల్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఇక్క‌డ మ‌హిళా ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు అవ‌కాశం. 2) ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్త‌రించేందుకు పార్టీ నేత‌లు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. పురందేశ్వ‌రి అయితే.. మూడు రాష్ట్రాల్లో(ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు) మంచి ప‌లుకుబ‌డి ఉన్న నాయ‌కురాలు కావ‌డం.. అన‌ర్గ‌ళం ఆయా భాష‌లు మాట్లాడే సామ‌ర్థ్యం ఉండ‌డం.. తండ్రి వార‌స‌త్వం వంటివి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటున్నాయి.

మొత్తంగా పురందేశ్వ‌రి పేరు అయితే.. ఇప్పుడు బీజేపీ వ‌ర్గాల్లో హ‌ల్చల్ చేస్తోంద‌ని చెబుతుండ‌డం గ‌మ నార్హం. 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న పురందేశ్వ‌రి.. రాజంపేట నుంచి ఎంపీ గా పోటీ చేశారు. అయితే.. ఓడిపోయారు. తాజాగా రాజ‌మండ్రి నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నా రు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో మంత్రి ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, ఆమె పేరును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. దీనికి కార‌ణం అప్ప‌ట్లోనే ఆమెకు అంత‌క‌న్నా పెద్ద ప‌ద‌విని ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు రావ‌డ‌మే.

ఇక‌, ఇప్పుడు ప్ర‌స్తుతం కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా బీజేపీ సార‌థిగా ఉన్నారు. అయితే.. ఆయ‌న‌కు ప‌నిభారం పెర‌గ‌డంతోపాటు బీజేపీ నిర్దేశిత నిబంధ‌న‌లు కూడా.. వ‌రుస‌గా ఒకే వ్య‌క్తికి ఇన్నిమార్లు ప‌ద‌విని కొన‌సా గించ‌డాన్ని నిషేధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో న‌డ్డాను మార్చ‌డం ఖాయం. మ‌రోవైపు వ‌చ్చే ఏడాది ఎన్నిక లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో పురందేశ్వ‌రికి ఈ ప‌ద‌విని ఇచ్చి.. ఆయా రాష్ట్రాల్లో విజ‌యం ద‌క్కించుకునేలా మ‌హిళా సెంటిమెంటును ప్రోది చేసేలా క‌మ‌ల నాథులు ప్లాన్ చేస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల మాట‌.

ఏపీకి కొత్త‌కాదు..

బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వి.. ఏపీ నాయ‌కుల‌కు కొత్త‌కాదు. గ‌తంలో ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు జాతీయ అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. రెండు సార్లు ఆయ‌న టెర్మ్ పొడిగించారు. త‌ర్వాత‌.. ఉమ్మ‌డి ఏపీకే చెందిన బంగారు ల‌క్ష్మ‌ణ్ కూడా.. బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌దవిని చేసిన‌వారే. బండారు ద‌త్తాత్రేయ కూడా.. కొన్ని నెల‌ల‌పాటు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్నారు. సో.. ఇప్పుడు పురందేశ్వ‌రి ఇవ్వ‌డం కొత్త‌కాక‌పోయినా.. మ‌హిళా నాయ‌కురాలిని ఎన్నుకోవ‌డం మాత్రం సంచ‌ల‌న‌మే కానుంది. మ‌రి జ‌రుగుతుందా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on December 2, 2024 9:30 am

Share

Recent Posts

ప్యాన్ ఇండియా సినిమాలకు ప్రాణ సంకటం

తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…

4 hours ago

రామాయ‌ణంలో వాళ్లిద్దరూ ఎక్క‌డ‌?

చాన్నాళ్ల నుంచి భార‌తీయ ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్న ప్రోమో రానే వ‌చ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్స్‌లో ఒక‌టైన రామాయ‌ణం ఆధారంగా…

8 hours ago

బాధితులను వదిలేసి నిందితులకు పరమార్శేంటి జగన్?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును జైల్లో ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అప్ప‌ల‌రాజును…

11 hours ago

న‌న్ను రాజీనామా కోరే హ‌క్కు ఎవ‌రికీ లేదు: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల‌పైనా తాను ముఖ్య‌మంత్రిని కాలేద‌ని.. 4 కోట్ల మంది ఓట‌ర్లు ఓటేసి త‌న‌ను గెలిపించుకున్నార‌ని.. వారి ఆశీర్వాదం,…

12 hours ago

‘పిల్లలను హాస్టల్లో వేస్తే… వాళ్ళు పెద్దలను ఓల్డేజ్ హోమ్ లలో వేస్తారు’

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…

13 hours ago

చంద్రబాబు అన్నం తింటున్నాడా.. గడ్డి తింటున్నాడా: జగన్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…

14 hours ago