Political News

బీజేపీ జాతీయ పీఠంపై పురందేశ్వ‌రి..!?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ అధ్య‌క్షురాలిగా రాజ‌మండ్రి ఎంపీ, ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉన్న పురందేశ్వ‌రికి ప‌ట్టంక‌ట్ట‌నున్నారా? ఆమె పేరు ప‌రిశీల‌న‌లో ఉందా? అంటే.. జాతీయ మీడియా వ‌ర్గాలు ఔన‌నే అంటున్నాయి. ఆమె పేరు అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చింద‌ని కూడా చెబుతున్నాయి. దీనికి రెండు కార‌ణాలు పేర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆమె పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

1) వ‌చ్చే నెల‌లో.. ఢిల్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఇక్క‌డ మ‌హిళా ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు అవ‌కాశం. 2) ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్త‌రించేందుకు పార్టీ నేత‌లు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. పురందేశ్వ‌రి అయితే.. మూడు రాష్ట్రాల్లో(ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు) మంచి ప‌లుకుబ‌డి ఉన్న నాయ‌కురాలు కావ‌డం.. అన‌ర్గ‌ళం ఆయా భాష‌లు మాట్లాడే సామ‌ర్థ్యం ఉండ‌డం.. తండ్రి వార‌స‌త్వం వంటివి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటున్నాయి.

మొత్తంగా పురందేశ్వ‌రి పేరు అయితే.. ఇప్పుడు బీజేపీ వ‌ర్గాల్లో హ‌ల్చల్ చేస్తోంద‌ని చెబుతుండ‌డం గ‌మ నార్హం. 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న పురందేశ్వ‌రి.. రాజంపేట నుంచి ఎంపీ గా పోటీ చేశారు. అయితే.. ఓడిపోయారు. తాజాగా రాజ‌మండ్రి నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నా రు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో మంత్రి ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, ఆమె పేరును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. దీనికి కార‌ణం అప్ప‌ట్లోనే ఆమెకు అంత‌క‌న్నా పెద్ద ప‌ద‌విని ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు రావ‌డ‌మే.

ఇక‌, ఇప్పుడు ప్ర‌స్తుతం కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా బీజేపీ సార‌థిగా ఉన్నారు. అయితే.. ఆయ‌న‌కు ప‌నిభారం పెర‌గ‌డంతోపాటు బీజేపీ నిర్దేశిత నిబంధ‌న‌లు కూడా.. వ‌రుస‌గా ఒకే వ్య‌క్తికి ఇన్నిమార్లు ప‌ద‌విని కొన‌సా గించ‌డాన్ని నిషేధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో న‌డ్డాను మార్చ‌డం ఖాయం. మ‌రోవైపు వ‌చ్చే ఏడాది ఎన్నిక లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో పురందేశ్వ‌రికి ఈ ప‌ద‌విని ఇచ్చి.. ఆయా రాష్ట్రాల్లో విజ‌యం ద‌క్కించుకునేలా మ‌హిళా సెంటిమెంటును ప్రోది చేసేలా క‌మ‌ల నాథులు ప్లాన్ చేస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల మాట‌.

ఏపీకి కొత్త‌కాదు..

బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వి.. ఏపీ నాయ‌కుల‌కు కొత్త‌కాదు. గ‌తంలో ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు జాతీయ అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. రెండు సార్లు ఆయ‌న టెర్మ్ పొడిగించారు. త‌ర్వాత‌.. ఉమ్మ‌డి ఏపీకే చెందిన బంగారు ల‌క్ష్మ‌ణ్ కూడా.. బీజేపీ జాతీయ అధ్య‌క్ష ప‌దవిని చేసిన‌వారే. బండారు ద‌త్తాత్రేయ కూడా.. కొన్ని నెల‌ల‌పాటు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్నారు. సో.. ఇప్పుడు పురందేశ్వ‌రి ఇవ్వ‌డం కొత్త‌కాక‌పోయినా.. మ‌హిళా నాయ‌కురాలిని ఎన్నుకోవ‌డం మాత్రం సంచ‌ల‌న‌మే కానుంది. మ‌రి జ‌రుగుతుందా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on December 2, 2024 9:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

1 hour ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

6 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

7 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

7 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

9 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

10 hours ago