మన లోపాలను మనం గుర్తించుకోవడం విజ్ఞత. మన గొప్పలను ఇతరులు గుర్తించడం గొప్ప. కానీ, వైసీపీ అధినేత.. తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ.. తనకు తానే సన్మానాలు చేయాలని కోరడం ద్వారా.. వైసీపీ నాలుగు కాదు.. నలభై మెట్లు దిగజారిపోయిందన్న చర్చ సాగుతోంది. ఒకవైపు విద్యుత్ విషయంలో లంచాల వ్యవహారం తెరమీదికి వచ్చింది.
దీనికి జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ, ఆయన ఈ విషయాన్ని వదిలేసి.. తనకు సన్మానాలు చేయాలని.. శాలువాలు కప్పాలని, అవార్డులు ఇవ్వాలంటే తనకే ఇవ్వాలని కోరుకున్నారు. ఇలా అను కుంటే.. చంద్రబాబుకు అనేక శాలువాలు కప్పి.. అనేక అవార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే.. విభజిత రాష్ట్రంలో రాజధానిగా.. అమరావతిని ఎంచుకున్నారు. ఇక్కడ హైకోర్టు కట్టించారు. సచివాలయాలు నిర్మించారు. రోడ్డు వేయించారు. కానీ, జగన్ హయాంలో ఒక్కటి జరగలేదు.
అంతేకాదు… జగన్ హయాంలో నిర్వహించిన శాసన సభ, మండలి సమావేశాలు కూడా.. చంద్రబాబు నిర్మించిన భవనాల్లోనే సాగాయి. కాబట్టి.. చంద్రబాబుకే శాలువాలు కప్పాలని అంటున్నారు తమ్ముళ్లు. ఇక, పార్టీ పరంగా కూడా.. ముందుండి నడపడంలో చంద్రబాబు విజ్ఞతకు మార్కులు పడుతున్నాయి 70 + వయసులో కూడా ఆయన అలుపెరగకుండా.. పార్టీకోసం పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. కానీ, జగన్ 50+లో అడుగు కూడా బయటకు వేయడం లేదు.
ఇలా.. అనేక ఉదాహరణలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇక, తమ్ముళ్ల మాట ఎంత చెప్పుకొన్నా తనివి తీరదు. ఇలా.. సొంత డబ్బా అనవసరంగా కొట్టుకుని వైసీపీ అధినేత తనను తాను డైల్యూట్ చేసుకుని.. వైసీపీ ఫైర్ తగ్గించేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. పార్టీని ముందుకు నడిపించేందు కు దృష్టి పెట్టాల్సిన ఆయన.. ఇలా శ్వోత్కర్షలు, పరనిందలతో కాలక్షేపం చేస్తే.. మరింత పరువు పోవడం ఖాయమని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ఆయన కు జ్ఞానోదయం కలుగుతుందో లేదో చూడాలి.
This post was last modified on December 1, 2024 12:03 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…