Political News

ఏపీలో బ‌ల‌మైన మీడియాతో.. బ‌ల‌హీన విప‌క్షం

ఏమాట‌కు ఆమాట చెప్పాల్సి వ‌స్తే.. ఏపీలో బ‌ల‌మైన మీడియా ఏదంటే ఓ రెండు ప‌త్రిక‌లు, ఓ మూడు చానెళ్లు మాత్ర‌మే క‌నిపిస్తాయి వినిపిస్తాయి. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా.. ఈ బ‌ల‌మైన మీడియా బాధితుడే. ఆయ‌నే ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెప్పుకొనేవారు. బ‌ల‌మైన మీడియా కార‌ణంగా తాము నెగ్గ‌లేక‌పోతున్నామ‌ని.. అబద్ధాలు ప్ర‌చారం చేయడంలో గోబెల్స్‌ను మించి పోతున్నార‌ని కూడా.. వైఎస్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ నేప‌థ్యంలోనే రాత్రికి రాత్రికి 2006లో సాక్షి మీడియాకు శ్రీకారం చుట్టారు. కేవ‌లం అనుకున్న వెంట‌నే ఒకే ఒక్క ఏడాదిలో దీనిని ప్రారంభించారు. అయిన‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన మీడియా ముందు .. సాక్షి.. స‌సాక్ష్యంగా నిలువ‌లేక పోయింది. ఇక‌, ఆ త‌ర్వాత కూడా.. అదే ప‌రిస్థితి కొన‌సాగింది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి కూడా ఈ మీడియానే కార‌ణ‌మ‌ని వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు.

అయితే.. ఇప్పుడు అదే బ‌ల‌మైన మీడియాతో సంఖ్యాప‌రంగా అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న వైసీపీ ఢీ అంటే ఢీ అంటూ డిష్యుం- డిష్యుంకు రెడీ అయింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న‌పై అతిగా వార్త‌లు రాస్తున్నారని.. ముఖ్యంగా అదానీ ప‌వ‌ర్ విష‌యంలో తాను లంచాలు తీసుకున్న‌ట్టు ఆరోపిస్తున్నార‌ని, కానీ, తాను ఎలాంటి త‌ప్పులు చేయ‌లేద‌న్నారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు మీడియా సంస్థ‌ల‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని చెప్పారు.

త‌న పేరుతో ముద్రించిన వార్త‌ల స్థానంలో క్ష‌మాప‌ణ‌లు చెబుతూ.. రాయాల‌ని కూడా జ‌గ‌న్ కోరారు. కానీ, ఆయా మీడియా సంస్థ‌లు ఎక్క‌డా స్పందించ‌లేదు. దీంతో తాజాగా శ‌నివారం జ‌గ‌న్ ఆ రెండు సంస్థ‌ల‌కు లీగల్ నోటీసులు పంపించారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరారు. లేకపోతే.. కోర్టులో పోరాటానికి దిగుతాన‌ని చెప్పారు. అయితే.. ఈక్ర‌మంలో త‌న ప‌రువును కేవ‌లం క్ష‌మాప‌ణ‌ల‌కే ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ప‌రువు న‌ష్టం కేసులు అంటే.. వారి వారి స్థాయిని బ‌ట్టి వేల నుంచి వంద‌ల కోట్లలో ఈ కేసులు ఉంటాయి. కానీ, జ‌గ‌న్ ఎందుకో.. ఈ విస‌యంలో సొమ్ములు కాకుండా.. క్ష‌మాప‌ణ‌ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి త‌దుప‌రి.. ఆరెండు ప‌త్రిక‌లు.. ఏం చేస్తాయ‌నేది చూడాలి.

This post was last modified on December 1, 2024 11:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

2 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

4 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

6 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

6 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

8 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

10 hours ago