Political News

ఏపీలో బ‌ల‌మైన మీడియాతో.. బ‌ల‌హీన విప‌క్షం

ఏమాట‌కు ఆమాట చెప్పాల్సి వ‌స్తే.. ఏపీలో బ‌ల‌మైన మీడియా ఏదంటే ఓ రెండు ప‌త్రిక‌లు, ఓ మూడు చానెళ్లు మాత్ర‌మే క‌నిపిస్తాయి వినిపిస్తాయి. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా.. ఈ బ‌ల‌మైన మీడియా బాధితుడే. ఆయ‌నే ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెప్పుకొనేవారు. బ‌ల‌మైన మీడియా కార‌ణంగా తాము నెగ్గ‌లేక‌పోతున్నామ‌ని.. అబద్ధాలు ప్ర‌చారం చేయడంలో గోబెల్స్‌ను మించి పోతున్నార‌ని కూడా.. వైఎస్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ నేప‌థ్యంలోనే రాత్రికి రాత్రికి 2006లో సాక్షి మీడియాకు శ్రీకారం చుట్టారు. కేవ‌లం అనుకున్న వెంట‌నే ఒకే ఒక్క ఏడాదిలో దీనిని ప్రారంభించారు. అయిన‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన మీడియా ముందు .. సాక్షి.. స‌సాక్ష్యంగా నిలువ‌లేక పోయింది. ఇక‌, ఆ త‌ర్వాత కూడా.. అదే ప‌రిస్థితి కొన‌సాగింది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి కూడా ఈ మీడియానే కార‌ణ‌మ‌ని వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు.

అయితే.. ఇప్పుడు అదే బ‌ల‌మైన మీడియాతో సంఖ్యాప‌రంగా అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న వైసీపీ ఢీ అంటే ఢీ అంటూ డిష్యుం- డిష్యుంకు రెడీ అయింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న‌పై అతిగా వార్త‌లు రాస్తున్నారని.. ముఖ్యంగా అదానీ ప‌వ‌ర్ విష‌యంలో తాను లంచాలు తీసుకున్న‌ట్టు ఆరోపిస్తున్నార‌ని, కానీ, తాను ఎలాంటి త‌ప్పులు చేయ‌లేద‌న్నారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు మీడియా సంస్థ‌ల‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని చెప్పారు.

త‌న పేరుతో ముద్రించిన వార్త‌ల స్థానంలో క్ష‌మాప‌ణ‌లు చెబుతూ.. రాయాల‌ని కూడా జ‌గ‌న్ కోరారు. కానీ, ఆయా మీడియా సంస్థ‌లు ఎక్క‌డా స్పందించ‌లేదు. దీంతో తాజాగా శ‌నివారం జ‌గ‌న్ ఆ రెండు సంస్థ‌ల‌కు లీగల్ నోటీసులు పంపించారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరారు. లేకపోతే.. కోర్టులో పోరాటానికి దిగుతాన‌ని చెప్పారు. అయితే.. ఈక్ర‌మంలో త‌న ప‌రువును కేవ‌లం క్ష‌మాప‌ణ‌ల‌కే ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ప‌రువు న‌ష్టం కేసులు అంటే.. వారి వారి స్థాయిని బ‌ట్టి వేల నుంచి వంద‌ల కోట్లలో ఈ కేసులు ఉంటాయి. కానీ, జ‌గ‌న్ ఎందుకో.. ఈ విస‌యంలో సొమ్ములు కాకుండా.. క్ష‌మాప‌ణ‌ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి త‌దుప‌రి.. ఆరెండు ప‌త్రిక‌లు.. ఏం చేస్తాయ‌నేది చూడాలి.

Satya

Recent Posts

పెహల్వాన్ అసలు కుస్తీ ఇప్పుడు మొదలు

పెద్ది మొదటి వారాంతం ఘనంగా పూర్తి చేసుకుంది. రెండు వందల యాభై కోట్లకు కొంచెం అటు ఇటు నెంబర్ నమోదు…

8 minutes ago

రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి… హీటెక్కిపోయింది!

తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరోమారు వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్…

1 hour ago

భాగ్యరేఖ మార్చాల్సిన బాధ్యత ‘లెనిన్’దే

అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. కాకపోతే బ్యాడ్ లక్ భుజాన వేసుకుని తిరుగుతోంది. ఆఫర్లకు లోటు…

2 hours ago

పవన్ కన్నెర్ర చేస్తే…

ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేనలో ఇప్పుడు ప్రక్షాళన మొదలైందని చెప్పక తప్పదు. తన మాట నమ్మి…

2 hours ago

మంగ‌ళ‌గిరి ఆద‌ర్శం.. త‌మ్ముళ్లు ఫాలో అవుతారా… ?

స‌హ‌జంగా టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఒక‌రిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పెద్ద‌గా చెప్ప‌రు. ఆయ‌న ఏదైనా చెప్పారంటే ఖ‌చ్చితంగా దానిలో…

3 hours ago

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు చంద్ర‌బాబు అదిరిపోయే వ్యూహం!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వ‌చ్చే ఏడాది నుంచి దాదాపు ఏడాదిన్న‌ర పాటు పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఆ…

5 hours ago