Political News

ఏపీలో బ‌ల‌మైన మీడియాతో.. బ‌ల‌హీన విప‌క్షం

ఏమాట‌కు ఆమాట చెప్పాల్సి వ‌స్తే.. ఏపీలో బ‌ల‌మైన మీడియా ఏదంటే ఓ రెండు ప‌త్రిక‌లు, ఓ మూడు చానెళ్లు మాత్ర‌మే క‌నిపిస్తాయి వినిపిస్తాయి. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా.. ఈ బ‌ల‌మైన మీడియా బాధితుడే. ఆయ‌నే ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెప్పుకొనేవారు. బ‌ల‌మైన మీడియా కార‌ణంగా తాము నెగ్గ‌లేక‌పోతున్నామ‌ని.. అబద్ధాలు ప్ర‌చారం చేయడంలో గోబెల్స్‌ను మించి పోతున్నార‌ని కూడా.. వైఎస్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ నేప‌థ్యంలోనే రాత్రికి రాత్రికి 2006లో సాక్షి మీడియాకు శ్రీకారం చుట్టారు. కేవ‌లం అనుకున్న వెంట‌నే ఒకే ఒక్క ఏడాదిలో దీనిని ప్రారంభించారు. అయిన‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన మీడియా ముందు .. సాక్షి.. స‌సాక్ష్యంగా నిలువ‌లేక పోయింది. ఇక‌, ఆ త‌ర్వాత కూడా.. అదే ప‌రిస్థితి కొన‌సాగింది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి కూడా ఈ మీడియానే కార‌ణ‌మ‌ని వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు.

అయితే.. ఇప్పుడు అదే బ‌ల‌మైన మీడియాతో సంఖ్యాప‌రంగా అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న వైసీపీ ఢీ అంటే ఢీ అంటూ డిష్యుం- డిష్యుంకు రెడీ అయింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న‌పై అతిగా వార్త‌లు రాస్తున్నారని.. ముఖ్యంగా అదానీ ప‌వ‌ర్ విష‌యంలో తాను లంచాలు తీసుకున్న‌ట్టు ఆరోపిస్తున్నార‌ని, కానీ, తాను ఎలాంటి త‌ప్పులు చేయ‌లేద‌న్నారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు మీడియా సంస్థ‌ల‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని చెప్పారు.

త‌న పేరుతో ముద్రించిన వార్త‌ల స్థానంలో క్ష‌మాప‌ణ‌లు చెబుతూ.. రాయాల‌ని కూడా జ‌గ‌న్ కోరారు. కానీ, ఆయా మీడియా సంస్థ‌లు ఎక్క‌డా స్పందించ‌లేదు. దీంతో తాజాగా శ‌నివారం జ‌గ‌న్ ఆ రెండు సంస్థ‌ల‌కు లీగల్ నోటీసులు పంపించారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరారు. లేకపోతే.. కోర్టులో పోరాటానికి దిగుతాన‌ని చెప్పారు. అయితే.. ఈక్ర‌మంలో త‌న ప‌రువును కేవ‌లం క్ష‌మాప‌ణ‌ల‌కే ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ప‌రువు న‌ష్టం కేసులు అంటే.. వారి వారి స్థాయిని బ‌ట్టి వేల నుంచి వంద‌ల కోట్లలో ఈ కేసులు ఉంటాయి. కానీ, జ‌గ‌న్ ఎందుకో.. ఈ విస‌యంలో సొమ్ములు కాకుండా.. క్ష‌మాప‌ణ‌ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి త‌దుప‌రి.. ఆరెండు ప‌త్రిక‌లు.. ఏం చేస్తాయ‌నేది చూడాలి.

This post was last modified on December 1, 2024 11:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

28 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

41 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago