Political News

ఏపీ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా

తిరుపతి వైసిపి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి రుయా ఆసుపత్రిలో చేరారు. కరోనా వైరస్ నిర్ధారణ అవ్వటంతో భూమన బుధవారం అర్జంటుగా ఆసుపత్రిలో చేరారు. గతంలో కూడా కరోనా వైరస్ సోకటంతో భూమన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మొదటిసారి ఆసుపత్రిలో చేరినపుడు పదిరోజులు ఐసొలేషన్ లో ఉన్నారు. తర్వాత రక్త పరీక్షలు చేయించుకుని నెగిటివ్ అని తేలటంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జయ్యారు. మళ్ళీ ఇపుడు రెండోసారి ఆసుపత్రిలో చేరారు. కరోనా వైరస్ సమస్యను పక్కన పెట్టేసి ఎంఎల్ఏ కాబట్టి ప్రతిరోజు భూమన జనాల్లోనే తిరుగుతున్నారు. ఈ కారణంగా భూమనకు సులభంగా కరోనా సోకుతోంది.

అయితే రెండోసారి కరోనా వైరస్ సోకటంలో మాత్రం తిరుమల పర్యటనే కారణమని ఎంఎల్ఏ మద్దతుదారులు చెబుతున్నారు. తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సోవాలలో గరుడోత్సవం రోజున జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. జగన్ తిరుమలకు వచ్చి శ్రీవారి సేవలో పాల్గొనే సమయానికి కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు తిరుమలకు వచ్చారు. ఉత్సవాల్లో జగన్ తో పాటు వాళ్ళంతా రెండు రోజుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చల్లబోయిన వేణుగోపాల కృష్ణతో పాటు మరికొందరు ఎంఎల్ఏలకు కూడా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది.

అంటే వీళ్ళకందరికీ జగన్ పర్యటనకు ముందే కరోనా వైరస్ సోకిందన్న విషయంలో అనుమానం లేదు. తమకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసో తెలీకో వీళ్ళంతా జగన్ పర్యటనలో పాల్గొన్నారు. తమకు కరోనా సోకిందని తెలిసిన తర్వాత వీళ్ళంతా ఐసొలేషన్ లోకి వెళ్ళిపోయారు. అయితే అప్పట్లో భూమనకు ఎటువంటి లక్షణాలు లేకపోవటంతో పట్టించుకోలేదు. కానీ రెండు రోజులుగా జ్వరం, ఆయాసంతో ఇబ్బందులు మొదలవ్వటంతో భూమన అవసరమైన పరీక్షలు చేయించుకున్నారు. దాంతో తనకు రెండోసారి మళ్ళీ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణవ్వటంతో వెంటనే రుయా ఆసుపత్రిలో చేరిపోయారు.

ఇదే సమస్యతో భూమన కొడుకు కూడా నాలుగు రోజుల క్రితం రుయా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రతిరోజు జనాల్లోనే తిరుగుతుండటం, ప్రతిరోజు అనేకమంది వీళ్ళని కలుస్తుండటంతో ఎవరికి వైరస్ ఉంది ఎవరికి లేదన్న విషయంలో క్లారిటి లేకపోవటమే అసలు సమస్యగా మారింది. ఇందుకనే ప్రజాప్రతినిధులు ఎక్కువగా కరోనా వైరస్ భారిన పడుతున్నారు.

Satya

Recent Posts

గ్లామర్ డోస్ పెంచుతున్న త్రిష

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. మాగ్జిమం ఐదు…

1 hour ago

790 కోట్ల మోసం… 3 కోట్లు రాబ‌ట్టిన ఈడీ!

దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభ‌కోణం కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌.. చేసిన ప‌ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన…

1 hour ago

ఏజెంట్ నిర్మాతతో ఏకీభ‌వించిన అఖిల్

అక్కినేని అఖిల్‌ను పెద్ద‌ స్టార్‌ను చేసేస్తుంద‌ని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంక‌ర సైతం రిలీజ్‌కు ముందు…

3 hours ago

తమన్ సంగీతానికి తమనే పోటీ

తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…

5 hours ago

బాబాయ్ సెంటిమెంట్ అబ్బాయికి కలిసి వస్తుందా

ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…

6 hours ago

టాలెంట్ వేట ఇలా కూడా చేయొచ్చు

టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…

7 hours ago