మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోఘన విజయం దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి పోస్టు కోసం జరుగుతున్న లాబీయింగ్ ఒకపట్టాన తేలడంలేదు. దీనిని తామే తీసుకుంటామని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం బీజేపీ+శివసేన+ఎన్సీపీలు కలిసి కట్టుగాఅధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. శివసేన నేత ఏక్నాథ్ షిండే ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.
అయితే.. ఈయనను తప్పించి బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీనికి షిండే ససేమిరా అంటున్నారు. ఒకవేళ సీఎం పోస్టు ఇవ్వకపోయినా.. తమకు హోం శాఖను పూర్తిగా(శాంతి భద్రతలతో సహా) అప్పగించాలని పట్టుబడుతున్నారు. దీనికి బీజేపీ నుంచి సరైన సమాధానం లభించడం లేదు. అంటే.. ఏకమొత్తంగా ముఖ్యమంత్రి సీటు సహా హోం శాఖ పగ్గాలు కూడా.. బీజేపీనే కొరుకుంటోంది.
ఇదే ఇప్పుడు మహాయుతి కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తోందన్న చర్చకు కారణమైంది. శివసేన నాయకులు బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని మహా మీడియా వెల్లడిస్తోంది. అయితే.. దీనివల్ల ఎవరికీ అధికారం దక్కదు. ఈ క్రమంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా తిరిగి ఆరుమాసాల్లో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. భారీ విజయం దక్కించుకున్న దరిమిలా .. దాన్ని వదులుకునేందుకు బీజేపీ ఇష్టపడదు.
దీంతో బుజ్జగింపు పర్వాలకు తెరదీసింది. అయినప్పటికీ.. శివసేన మాత్రం లొంగడం లేదు. తాజాగా బీజేపీ పెద్దలతో సమావేశాలకు తాను హాజరు కావడం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే తేల్చి చెప్పా రు. ఈనేపథ్యంలో బీజేపీ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న మురళీధర్ పేరు ను ముఖ్యమంత్రి సీటు కోసం పరిశీలిస్తున్నట్టు లీకులు ఇచ్చింది.
తద్వారా.. శివసేనలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఫడణవీస్ను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదిప్లాన్. అయినప్పటికీ.. హోం శాఖను సంపూర్ణంగా ఇవ్వాల్సిందేనని శివసేన పట్టుబడుతోంది. ఇది సాధ్యం కాదని బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాలతో మహాయుతి విచ్ఛిన్నం కావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.
This post was last modified on November 30, 2024 2:00 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…