మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోఘన విజయం దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి పోస్టు కోసం జరుగుతున్న లాబీయింగ్ ఒకపట్టాన తేలడంలేదు. దీనిని తామే తీసుకుంటామని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం బీజేపీ+శివసేన+ఎన్సీపీలు కలిసి కట్టుగాఅధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. శివసేన నేత ఏక్నాథ్ షిండే ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.
అయితే.. ఈయనను తప్పించి బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీనికి షిండే ససేమిరా అంటున్నారు. ఒకవేళ సీఎం పోస్టు ఇవ్వకపోయినా.. తమకు హోం శాఖను పూర్తిగా(శాంతి భద్రతలతో సహా) అప్పగించాలని పట్టుబడుతున్నారు. దీనికి బీజేపీ నుంచి సరైన సమాధానం లభించడం లేదు. అంటే.. ఏకమొత్తంగా ముఖ్యమంత్రి సీటు సహా హోం శాఖ పగ్గాలు కూడా.. బీజేపీనే కొరుకుంటోంది.
ఇదే ఇప్పుడు మహాయుతి కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తోందన్న చర్చకు కారణమైంది. శివసేన నాయకులు బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని మహా మీడియా వెల్లడిస్తోంది. అయితే.. దీనివల్ల ఎవరికీ అధికారం దక్కదు. ఈ క్రమంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా తిరిగి ఆరుమాసాల్లో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. భారీ విజయం దక్కించుకున్న దరిమిలా .. దాన్ని వదులుకునేందుకు బీజేపీ ఇష్టపడదు.
దీంతో బుజ్జగింపు పర్వాలకు తెరదీసింది. అయినప్పటికీ.. శివసేన మాత్రం లొంగడం లేదు. తాజాగా బీజేపీ పెద్దలతో సమావేశాలకు తాను హాజరు కావడం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే తేల్చి చెప్పా రు. ఈనేపథ్యంలో బీజేపీ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న మురళీధర్ పేరు ను ముఖ్యమంత్రి సీటు కోసం పరిశీలిస్తున్నట్టు లీకులు ఇచ్చింది.
తద్వారా.. శివసేనలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఫడణవీస్ను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదిప్లాన్. అయినప్పటికీ.. హోం శాఖను సంపూర్ణంగా ఇవ్వాల్సిందేనని శివసేన పట్టుబడుతోంది. ఇది సాధ్యం కాదని బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాలతో మహాయుతి విచ్ఛిన్నం కావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.
This post was last modified on November 30, 2024 2:00 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…