మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోఘన విజయం దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి పోస్టు కోసం జరుగుతున్న లాబీయింగ్ ఒకపట్టాన తేలడంలేదు. దీనిని తామే తీసుకుంటామని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం బీజేపీ+శివసేన+ఎన్సీపీలు కలిసి కట్టుగాఅధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. శివసేన నేత ఏక్నాథ్ షిండే ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.
అయితే.. ఈయనను తప్పించి బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీనికి షిండే ససేమిరా అంటున్నారు. ఒకవేళ సీఎం పోస్టు ఇవ్వకపోయినా.. తమకు హోం శాఖను పూర్తిగా(శాంతి భద్రతలతో సహా) అప్పగించాలని పట్టుబడుతున్నారు. దీనికి బీజేపీ నుంచి సరైన సమాధానం లభించడం లేదు. అంటే.. ఏకమొత్తంగా ముఖ్యమంత్రి సీటు సహా హోం శాఖ పగ్గాలు కూడా.. బీజేపీనే కొరుకుంటోంది.
ఇదే ఇప్పుడు మహాయుతి కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తోందన్న చర్చకు కారణమైంది. శివసేన నాయకులు బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని మహా మీడియా వెల్లడిస్తోంది. అయితే.. దీనివల్ల ఎవరికీ అధికారం దక్కదు. ఈ క్రమంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా తిరిగి ఆరుమాసాల్లో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. భారీ విజయం దక్కించుకున్న దరిమిలా .. దాన్ని వదులుకునేందుకు బీజేపీ ఇష్టపడదు.
దీంతో బుజ్జగింపు పర్వాలకు తెరదీసింది. అయినప్పటికీ.. శివసేన మాత్రం లొంగడం లేదు. తాజాగా బీజేపీ పెద్దలతో సమావేశాలకు తాను హాజరు కావడం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే తేల్చి చెప్పా రు. ఈనేపథ్యంలో బీజేపీ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న మురళీధర్ పేరు ను ముఖ్యమంత్రి సీటు కోసం పరిశీలిస్తున్నట్టు లీకులు ఇచ్చింది.
తద్వారా.. శివసేనలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఫడణవీస్ను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదిప్లాన్. అయినప్పటికీ.. హోం శాఖను సంపూర్ణంగా ఇవ్వాల్సిందేనని శివసేన పట్టుబడుతోంది. ఇది సాధ్యం కాదని బీజేపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాలతో మహాయుతి విచ్ఛిన్నం కావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.
This post was last modified on November 30, 2024 2:00 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…