Political News

ట్రాక్టర్‌పై సోఫా.. రాహుల్‌ను విలేకరి ప్రశ్నిస్తే?

రాహుల్ గాంధీకి సోషల్ మీడియాలో ట్రోల్స్ కొత్తేమీ కాదు. అతను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, తనను కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్‌గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం మొదలైనప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.

భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్‌లో పని చేసే వాళ్లు, ఆ పార్టీ మద్దతుదారులు ఎప్పుడూ ఇదే పనిలో ఉంటారు. తాజాగా రాహుల్ మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు. అతను యూపీలో ఒక పర్యటన సందర్భంగా ట్రాక్టర్ ఎక్కగా.. అతనిలా ట్రాక్టర్ ఎక్కుతాడని ముందే సమాచారం అందుకున్న పార్టీ వర్గాలు ఆ ట్రాక్టర్‌లో సోఫా తరహా సీటు ఏర్పాటు చేశాయి.

అందులో కూర్చుని రైతులను కలుసుకునేందుకు వెళ్లాడు రాహుల్. అతను ఏ తప్పు చేస్తాడా అని కాచుకుని ఉండే వ్యతిరేకులు ఈ ఫొటో చూడగానే రెచ్చిపోయారు. విపరీతంగా ట్రోల్ చేశారు.

అంతటితో ఆగకుండా రాహుల్ తాజాగా పాల్గొన్న విలేకరుల సమావేశంలో ఒక రిపోర్టర్.. దాని గురించి ప్రశ్నించాడు. రైతులను పరామర్శించేందుకు వెళ్తూ ట్రాక్టర్‌లో సోఫా సీటు ఏర్పాటు చేసుకోవడం ఏంటి అని అడిగాడు. ఐతే దీనికి ముందుగా ప్రిపేరయ్యాడో ఏమో కానీ.. రాహుల్ ఆ విలేకరికి దీటుగా బదులిచ్చాడు.

ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనల కోసం ఏకంగా రూ.8 వేల కోట్ల దాకా ప్రజాధానాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన విమానాలు కొనుక్కున్నాడన్న సంగతి తెలుసా? దాని గురించి మీరెవరైనా ఆయన్ని అడుగుతున్నారా అని ప్రశ్నించాడు రాహుల్. తాను వెళ్లిన ట్రాక్టర్లో రెండు సీట్లు కుషన్‌తో ఉండటం గురించి అడుగుతున్నారని.. కానీ మోడీ విమానాల్లో మొత్తం అన్నీ విలాసవంతమైన ఏర్పాట్లే ఉంటాయని.. అవన్నీ ప్రజాధనంతో కొనుగులో చేసుకున్నవే కదా.. మరి వాటి మాటేంటి అని అడిగాడు రాహుల్.

దీనికి ఆ విలేకరి నుంచి సమాధానం లేకపోయింది. రాహుల్ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిల ప్రయాణాల కోసం అమెరికా నుంచి రూ.8400 కోట్లతో విమానాలు తయారు చేయించి తెప్పిస్తోంది ప్రభుత్వం.

This post was last modified on October 6, 2020 5:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago