ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా అయిపోవడంతో ‘పుష్ప’ వైల్డ్ ఫైర్ పై విపరీతమైన హైప్ ఉంది. పట్నా, చెన్నైలో రాజుకున్న ‘పుష్ప:ది రూల్’ వైల్డ్ ఫైర్ గురించి దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో చర్చ జరుగుతోంది. అయితే, ఆశ్చర్యకరంగా ఏపీ రాజకీయాలకూ ‘పుష్ప’ కార్చిచ్చు అంటుకుంది. ‘పుష్ప-2’ చిత్రాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
పుష్ప చిత్రాన్ని అడ్డుకోవాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కావని, బాక్సాఫీస్ దగ్గర పుష్ప రికార్డులు బద్దలు కొడుతుందని అంబటి రాంబాబు చెప్పారు. పుష్ప చిత్రంపై వ్యాఖ్యలతో ఆగని అంబటి…దేవర చిత్రంపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. దేవర చిత్రంపై కూడా కొందరు దుష్ప్రచారం చేసినా సినిమా హిట్ అయిందని అన్నారు. అదే తరహాలో పుష్ప-2 చిత్రంపై కూడా విష ప్రచారం చేయాలని చూస్తున్నారని, ఎవరేం చేసినా పుష్ప-2 పెద్ద హిట్ అవుతుందని అన్నారు.
ఎవరేం చేసినా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను బాయ్ కాట్ చేయలేరని చెప్పారు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అని, ఆయన సినిమా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఎదురు చూస్తున్నారని, అందులో తాను కూడా ఒకడినని అంబటి చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, అల్లు అర్జున్ ల మధ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్యాప్ ఏర్పడిన నేపథ్యంలో ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం పుష్ప-2 ను టార్గెట్ చేస్తుందన్న కోణంలో అంబటి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, గత ప్రభుత్వంలో పుష్ప-1 రిలీజ్ అయిందని, అప్పుడు సినిమా టికెట్ల ధరలను జగన్ సర్కార్ తగ్గించడంతో ఏపీలో కలెక్షన్లు తగ్గాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొందరు అంబటికి సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. అసలు పుష్ప-2 సినిమా టికెట్ రేట్ల విషయంలో, స్పెషల్ షోల విషయంలో ఇంకా ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని, ఇంతలోపే గుమ్మడి కాయల దొంగలాగా అంబటి భుజాలు తడుముకోవడం దేనికని సెటైర్లు వేస్తున్నారు.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…