Political News

టీడీపీ గెలిచింది..కిలో చికెన్ 100

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం సంచలన విజయం నమోదు చేసింది. టీడీపీ గెలిస్తే ఫలానా మొక్కు చెల్లిస్తామని మొక్కుకున్న టీడీపీ అభిమానులు తమ మొక్కులు చెల్లించేసుకున్నారు. అయితే, కర్నూలులోని మద్దూర్ నగర్ లో టీడీపీ కార్యకర్త అయిన ఓ చికెన్ షాప్ యజమాని తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఏపీలో తమ పార్టీ ఘన విజయం సాధించిందని, అందుకే తన షాప్ లో కేజీ చికెన్ 100 కే అమ్ముతున్నానని ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

టీడీపీ విజయంతోపాటు తమ ప్రియతమ నేత, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌కు మంత్రి పదవి వచ్చినందుకు కిలో చికెన్ 100 రూపాయలే అమ్ముతున్నాని షమీర్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు చెప్పారు. అయితే, షమీర్ షాపునకు పోటీగా ఉన్న మరో సుభాన్ చికెన్ సెంటర్ యజమాని కూడా పోటీగా 100 రూపాయలకే కిలో చికెన్ అమ్మడం మొదలుబెట్టారు. ఇలా, ఈ ఇద్దరు వ్యాపారులు పోటీలుపడి చికెన్ రేటు తగ్గించడంతో చికెన్‌ ప్రియులు ఈ షాపుల దగ్గర బారులు తీరారు. దీంతో మద్దూర్ నగర్‌లో ఉన్న షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ చికెన్ సెంటర్ల దగ్గర జనం కోకొల్లలుగా చేరారు. ఈ క్రమంలోనే పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ జామ్ ను క్లియర్ చేయాల్సి వచ్చింది.

వాస్తవానికి మార్కెట్ లో కిలో చికెన్‌ ధర రూ.200 నుంచి రూ.250 వరకు ఉంది. కార్తీక మాసం నేపథ్యంలో చాలా జిల్లాల్లో 125-150 రూపాయలకే కిలో చికెన్ అమ్ముతున్నాయి. షమీర్ తన పార్టీపై అభిమానంతో చికెన్ రేటు తగ్గిస్తే, కార్తీకమాసం కావడంతో చికెన్ రేటు తగ్గించామని సుభాన్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ కేజీ చికెన్ బంపర్ ఆఫర్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on November 25, 2024 2:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago