Political News

టీడీపీ గెలిచింది..కిలో చికెన్ 100

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం సంచలన విజయం నమోదు చేసింది. టీడీపీ గెలిస్తే ఫలానా మొక్కు చెల్లిస్తామని మొక్కుకున్న టీడీపీ అభిమానులు తమ మొక్కులు చెల్లించేసుకున్నారు. అయితే, కర్నూలులోని మద్దూర్ నగర్ లో టీడీపీ కార్యకర్త అయిన ఓ చికెన్ షాప్ యజమాని తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఏపీలో తమ పార్టీ ఘన విజయం సాధించిందని, అందుకే తన షాప్ లో కేజీ చికెన్ 100 కే అమ్ముతున్నానని ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

టీడీపీ విజయంతోపాటు తమ ప్రియతమ నేత, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌కు మంత్రి పదవి వచ్చినందుకు కిలో చికెన్ 100 రూపాయలే అమ్ముతున్నాని షమీర్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు చెప్పారు. అయితే, షమీర్ షాపునకు పోటీగా ఉన్న మరో సుభాన్ చికెన్ సెంటర్ యజమాని కూడా పోటీగా 100 రూపాయలకే కిలో చికెన్ అమ్మడం మొదలుబెట్టారు. ఇలా, ఈ ఇద్దరు వ్యాపారులు పోటీలుపడి చికెన్ రేటు తగ్గించడంతో చికెన్‌ ప్రియులు ఈ షాపుల దగ్గర బారులు తీరారు. దీంతో మద్దూర్ నగర్‌లో ఉన్న షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ చికెన్ సెంటర్ల దగ్గర జనం కోకొల్లలుగా చేరారు. ఈ క్రమంలోనే పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ జామ్ ను క్లియర్ చేయాల్సి వచ్చింది.

వాస్తవానికి మార్కెట్ లో కిలో చికెన్‌ ధర రూ.200 నుంచి రూ.250 వరకు ఉంది. కార్తీక మాసం నేపథ్యంలో చాలా జిల్లాల్లో 125-150 రూపాయలకే కిలో చికెన్ అమ్ముతున్నాయి. షమీర్ తన పార్టీపై అభిమానంతో చికెన్ రేటు తగ్గిస్తే, కార్తీకమాసం కావడంతో చికెన్ రేటు తగ్గించామని సుభాన్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ కేజీ చికెన్ బంపర్ ఆఫర్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on November 25, 2024 2:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

38 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

2 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

3 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

3 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

3 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

7 hours ago