కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి రాజకీయ పాఠాలు ఎక్కడా బోధపడినట్టు కనిపించడం లేదు. తాను పట్టిన పట్టుకోసమే ఆయన పట్టుదలతో ఉండడంతో ప్రజలు రాహుల్ వైపు మొగ్గు చూపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. తాజాగా రెండు కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు సహా ఇతర 13 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవమైన ఓట్లనే దక్కించుకుంది. ఎక్కడా కూడా తలెత్తుకునే పరిస్థితి కనిపించడం లేదు.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీగా ఏర్పడిన కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీలు అధికారంలోకి వచ్చేస్తామని ఆశలు పెట్టుకున్నాయి. అధికారంలోకి రాకపోగా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోని నియోజకవర్గాలు ఎదురయ్యాయంటే ఆశ్చర్యం వేస్తుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే.. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 130 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేశారు. రాజ్యాంగాన్ని మోడీ నలిపేస్తున్నారని, చిదిమేస్తున్నారని చెప్పారు.
తాము వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నారు. అంతేకాదు.. మరాఠాలకు ప్రత్యేకగుర్తింపు ఇస్తామని, రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేస్తామని కూడా రాహుల్ చెప్పుకొచ్చారు. అయినా.. ప్రజలు ఆయనను పట్టించుకోలేదు. మొత్తంగా కూటమికి 54 సీట్లు వస్తే.. వీటిలో కాంగ్రెస్కు దక్కింది 21 సీట్లు. అంటే.. 288 సీట్లలో కనీసం 10 శాతం సీట్లు కూడా దక్కించుకోలేక పోయింది. దీనికి బాధ్యులు ఎవరు ? అంటే.. ఆది నుంచి అంతిమం వరకు ప్రచారాన్ని భుజానికెత్తుకున్న రాహుల్ వైపే అందరి వేళ్లూ కనిపిస్తున్నాయి.
మోడీ, అమిత్షా వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేయడంలో రాహుల్ విఫలమవుతున్నాయి. కొన్నాళ్ల కిందట(ఈ ఏడాదే) జరిగిన జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ రాహుల్ ఫెయిలయ్యారు. కేవలం విమర్శలకు మాత్రమే ఆయన పరిమితం కావడం.. క్షేత్రస్థాయి జనం నాడిని ఆయన పట్టుకోలేక పోవడం వంటివి ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి.
పైగా బీజేపీ వ్యూహాలను అడ్డుకోవడంలోనూ ఆయన వెనుబడిపోయారు. మహారాష్ట్ర ఒక్కటే కాదు.. జార్ఖండ్ లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. అధికారంలోకి వచ్చామన్న ఆనందం ఒక్కటే తప్ప.. మెజారిటీ స్థానాల్లో జేఎంఎంమాత్రమే విజయం దక్కించుకుంది. సో.. ఎలా చూసుకున్నా.. రాహుల్ రాజకీయాలు ఇంకా నేర్చుకోవాలేమో! అనే చర్చ అయితే సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 24, 2024 7:58 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…