కొన్ని కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో జరిగింది. తాజాగా అమెరికాలో కేసులు నమోదయ్యాయని, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భారీ ఎత్తున ముడుపులు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ వ్యవహారం.. దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడి ఇప్పుడు ఏపీని కూడా తాకింది. జగన్ సైతం ముడుపులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
వాస్తవ నివేదిక ఎలా ఉందన్న విషయానికి వస్తే.. అదాని వంటి సంస్థలు ఏర్పాటు చేసే ప్రాజెక్టుల విషయంలో పక్కాగానే ఉంటాయి. అయితే.. ఇటీవల కాలంలో పెరిగిపోయిన పోటీ వాతావరణం .. రాజకీయ ఒత్తిడులు.. వంటివి కార్పొరేట్ సంస్థలను కూడా పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. సరే.. ఎవరు తప్పు చేసినా సమర్థించరాదన్నది వాస్తవం కాబట్టి.. గౌతం అదానీ నుంచి జగన్ సొమ్ములు తీసుకుని ఉంటే విచారణ చేస్తారు.
ఇదిలావుంటే.. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నేరుగా స్పందించేందుకు ఇబ్బంది పడుతున్నారు. సభలో పలువురు సభ్యులు చాలా దూకుడుగానే స్పందించారు. జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని సభ్యులు బాగానే నోరు చేసుకున్నారు. కానీ, చంద్రబాబు విషయానికి వస్తే.. మాత్రం ఆయన ఆచితూచి స్పందించారు. ఒకవైపు సున్నితంగా విమర్శిస్తూనే.. మరోవైపు చాలా వ్యూహం తోనే ముందుకు సాగారు.
దీనికి కారణం.. అదానీ వ్యవహారంలో ప్రధాని మోడీ కీలకంగా మారారు. అదానీ గుజరాత్కు చెందిన వ్యాపారి కావడం, ఆయన కు బీజేపీకి మధ్య అవినాభావ సంబంధం.. ఉండడం, ముఖ్యంగా మోడీ-అమిత్షా ద్వయానికి ఆయన మిత్రుడు కావడంతో చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించిన తీరు కూటమి ప్రభుత్వ వ్యూహానికి అద్దం పట్టింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి
This post was last modified on November 23, 2024 7:12 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…