Political News

వైసీపీకి భారీ షాక్‌.. ఎమ్మెల్సీ రాజీనామా

ఏపీ విప‌క్షం వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఇటీవ‌ల కాలంలో కొంత ప్ర‌శాంతంగా ఉన్న వైసీపీ రాజ‌కీయాలు .. ఇప్పుడు హ‌ఠాత్తుగా వేడెక్కాయి. నెల రోజుల కింద‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి ప‌లువురు నాయ‌కులు బ‌యట‌కు వ‌చ్చారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా రాజీనామా చేసి ఫ్యాన్ కింద ఉండ‌లేమంటూ.. సైకిల్ ఎక్కారు. దీంతో అప్ప‌ట్లో వైసీపీలో కొంత మేర‌కు అల‌జ‌డి నెల‌కొంది. అయితే. .కొన్నాళ్లుగా ఈ వ్య‌వ‌హారానికి బ్రేకులు ప‌డ్డాయి. వెళ్లిపోతున్న‌వారిని ఒకింత బుజ్జ‌గించిన ప‌రిస్థితి నెల‌కొంది.

ఇక‌, ఇప్పుడు అంతా బాగానే ఉంద‌ని భావిస్తున్న స‌మ‌యంలో బాంబు పేలింది. కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ.. వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ఆరేడు మాసాల‌ ముందు ఆయ‌న వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే. టీడీపీలో సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాలు చేసిన జ‌య‌మంగ‌ళ‌.. వ‌డ్డెర సామాజిక వ‌ర్గానికి(బీసీ) చెందిన నాయ‌కుడు. టీడీపీ టికెట్ ద‌క్క‌ద‌ని భావించిన ఆయ‌న వైసీపీలోకి వ‌చ్చారు.

కృష్ణాజిల్లాలోని కైక‌లూరు టికెట్‌ను ఆయ‌న ఆశించారు. అయితే.. జ‌గ‌న్ ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఈ స్థానంలో ఆయ‌న‌ను సంతృప్తి ప‌రిచేందుకు ఎమ్మెల్సీని చేశారు. ప్ర‌స్తుతం జ‌య‌మంగ‌ళ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. హ‌ఠాత్తుగా ఆయ‌న రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. అటు పార్టీకి, ఇటు ఎమ్మెల్సీ స్థానానికి కూడా రాజీనామా చేశారు. టీడీపీలో ఉన్న స‌మ‌యంలో కైక‌లూరు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న‌.. త‌ర్వాత చంద్ర‌బాబుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు.

ఎన్నిక‌ల‌కు ముందు టికెట్ రాద‌ని గ్ర‌హించి జ‌గ‌న్ చెంత‌కు చేరారు. శుక్ర‌వారంతో ముగిసిన మండ‌లి స‌మావేశాల‌కు జ‌య‌మంగ‌ళ హాజ‌రు కాలేదు. ఒక‌టి రెండు రోజులు మాత్ర‌మే వ‌చ్చినా.. ఆయ‌న టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏదో భ‌రోసా ల‌భించి ఉంటుంద‌ని. అందుకే స‌డెన్‌గా వైసీపీకి రాజీనామా ప్ర‌క‌టించార‌ని తెలుస్తోంది. బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు వైసీపీకి దూరం కావ‌డం ఆ పార్టీకి ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు

This post was last modified on November 23, 2024 2:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

3 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

8 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

9 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

9 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

9 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

10 hours ago