జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధికార పక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా+కాంగ్రెస్ విజయం దక్కించుకున్నాయి. వాస్తవానికి జార్ఖండ్ ప్రజల నాడిని గమనిస్తే.. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ ఏ పార్టీకి కూడా.. వరుసగా ప్రజలు విజయాన్ని కట్టబెట్టడం లేదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీని మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెడుతున్నారు.
అయితే.. ఇప్పుడు మాత్రం గత చరిత్రకు బ్రేకులు వేస్తూ.. ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. జేఎంఎం+ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. బీజేపీ ఈ రాష్ట్రాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు.. “అవినీతి పరులు, లంచగొండులు, జైలుకు వెళ్లివచ్చినవారు, కుటుంబ ద్రోహులు” అంటూ.. సీఎం హేమంత్ సొరేన్ కుటుంబాన్ని, ఆయనను కూడా లక్ష్యంగా చేసుకుని కమల నాథులు విమర్శలు గుప్పించారు.
అయితే.. తాజాగా వెలువడిన ఫలితాల్లో జేఎంఎం+కాంగ్రెస్ కూటమి 56 స్థానాల్లో దూకుడుగా ఉంది. ఇక, అనేక వ్యూహాలు పన్ని.. చివరకు జేఎంఎంలోనూ చిచ్చు పెట్టి.. మాజీ సీఎం, హేమంత్ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న చంపయి సొరేన్ను కూడా తమవైపు మళ్లించుకుని, హేమంత్ సోదరు డి భార్యను తమవైపు తిప్పుకొన్నా.. ప్రజలు కమల నాథులను హర్షించలేదు. వారివైపు మొగ్గు చూపలేదు. ఈ నేపథ్యంలోనే హేమంత్ సొరేన్కు ప్రజలు పట్టం కట్టారు.
దాదాపు రెండు మాసాల పాటు హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. గనుల కుంభకోణాలు కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపించింది. అది కూడా ఎన్నికలకు ముందే జరిగింది. దీని తాలూకు సింపతీ తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించడం గమనార్హం. ఇదే గత పాతికేళ్ల చరిత్రను తిరగరాసి.. వరుసగా హేమంత్ సర్కారుకు మరోసారి విజయం దక్కించిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 23, 2024 2:18 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…