జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధికార పక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా+కాంగ్రెస్ విజయం దక్కించుకున్నాయి. వాస్తవానికి జార్ఖండ్ ప్రజల నాడిని గమనిస్తే.. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ ఏ పార్టీకి కూడా.. వరుసగా ప్రజలు విజయాన్ని కట్టబెట్టడం లేదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీని మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెడుతున్నారు.
అయితే.. ఇప్పుడు మాత్రం గత చరిత్రకు బ్రేకులు వేస్తూ.. ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. జేఎంఎం+ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. బీజేపీ ఈ రాష్ట్రాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు.. “అవినీతి పరులు, లంచగొండులు, జైలుకు వెళ్లివచ్చినవారు, కుటుంబ ద్రోహులు” అంటూ.. సీఎం హేమంత్ సొరేన్ కుటుంబాన్ని, ఆయనను కూడా లక్ష్యంగా చేసుకుని కమల నాథులు విమర్శలు గుప్పించారు.
అయితే.. తాజాగా వెలువడిన ఫలితాల్లో జేఎంఎం+కాంగ్రెస్ కూటమి 56 స్థానాల్లో దూకుడుగా ఉంది. ఇక, అనేక వ్యూహాలు పన్ని.. చివరకు జేఎంఎంలోనూ చిచ్చు పెట్టి.. మాజీ సీఎం, హేమంత్ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న చంపయి సొరేన్ను కూడా తమవైపు మళ్లించుకుని, హేమంత్ సోదరు డి భార్యను తమవైపు తిప్పుకొన్నా.. ప్రజలు కమల నాథులను హర్షించలేదు. వారివైపు మొగ్గు చూపలేదు. ఈ నేపథ్యంలోనే హేమంత్ సొరేన్కు ప్రజలు పట్టం కట్టారు.
దాదాపు రెండు మాసాల పాటు హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. గనుల కుంభకోణాలు కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపించింది. అది కూడా ఎన్నికలకు ముందే జరిగింది. దీని తాలూకు సింపతీ తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించడం గమనార్హం. ఇదే గత పాతికేళ్ల చరిత్రను తిరగరాసి.. వరుసగా హేమంత్ సర్కారుకు మరోసారి విజయం దక్కించిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 23, 2024 2:18 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…