కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం ఓటర్లు వరదలా విరుచుకుపడ్డారు. ఎవరూ ఊహించని విధంగా ప్రియాంకకు ఓట్లు పోటెత్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే.. గతంలో ఇందిరమ్మ కుటుంబంలో ఎవరికీ రాని ఓట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. “ఇందిరా గాంధీ మనవరాలిగా చెబుతున్నా.. ” అంటూ ఆమె చేసిన ప్రసంగాలు ప్రజలను కదిలించేశాయి.
తాజాగా కేరళలోని వయనాడ్ పార్లమెంటుస్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్పై ప్రియాంకగాంధీ పోటీ చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. అంతేకాదు.. బీజేపీ కూడా బలమైన మహిళా అభ్యర్థికే టికెట్ ఇచ్చింది. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్నా కూడా.. సీపీఐ కూడా అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టింది. మరో 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. ఇంత పోటీలోనూ.. ప్రియాంక గాంధీకి ఓట్ల వర్షం కురిసింది.
కడపటి వార్తలు అందే సరికి.. ప్రియాంక గాంధీ.. 4 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకుని ముందుకు సాగుతున్నారు. ఇంకా పలు రౌండ్ల ఓట్లను లెక్కించాల్సి ఉంది. సో.. మొత్తానికి ఇందిరమ్మ మనవరాలికి ప్రజలు తొలి విజయంలోనే భారీ మెజారిటీని కట్టబెట్టడం గమనార్హం. ఈ ఏడాది ఇక్కడ నుంచి రాహుల్గాంధీ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. రాయ్బరేలీలోనూ ఆయన గెలుపు గుర్రం ఎక్కడంతో రెండు స్థానాల్లో ఒకటి వదులుకున్నారు. ఈ క్రమంలోనే వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేశారు.
This post was last modified on November 23, 2024 2:11 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…