ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో మిస్సింగ్ మహిళల పెండింగ్ కేసులు 846 అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడంతో పవన్ చెప్పినవి అబద్ధాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తాను, పవన్ పర్యటిద్దామని, ఎవరిని చూసేందుకు జనం ఎక్కువ వస్తారో చూద్దామని ఛాలెంజ్ చేశారు.
ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రోజా గతంలో చేసిన వ్యాఖ్యలపై యాంకర్ ప్రశ్నించారు. ఏదో ఒక ఊర్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, పవన్ కల్యాణ్, తాను పర్యటిద్దామని, ఎవరిని చూసేందుకు జనం ఎక్కువమంది వస్తారో చూద్దామని రోజా చేసిన కామెంట్లను యాంకర్ ప్రస్తావించారు. అయితే, తాను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నానని రోజా అన్నారు. అయితే, పిఠాపురంలో పవన్ కు భారీ మెజారిటీ వచ్చిందని, ఇప్పుడు పిఠాపురంలో పర్యటించేందుకు రోజా సిద్ధమా అని యాంకర్ ప్రశ్నించగా…సిద్ధమని రోజా అన్నారు. దీంతో, పిఠాపురంలో రేప్ నకు గురైన అమ్మాయి ఇంటికి వెళదామని, వరదలు వచ్చిన ముంపు ప్రాంతాలకు వెళదామని రోజా అన్నారు.
రోజాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అని యాంకర్ అనగా…గ్రౌండ్ రియాలిటీ తాను చెబుతున్నానని రోజా అన్నారు. 11 సీట్లు వచ్చిన జగన్ గారిని కామెంట్ చేసే ముందు..రెండు సార్లు ఓడిపోయిన పవన్ రాజకీయ సన్యాసం తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీల బలంతో పవన్ గెలిచారని,ఆయన సొంత బలంతో కాదని రోజా చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడే పవన్ బలమేంటో తెలిసిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. తాను నగరి నుంచి రెండుసార్లు ఓడిపోయినా…సొంతంగా పోటీ చేశానని, ఈ రోజు ఓడినా…రేపు గెలవగలనన్న ధీమా ఉందని చెప్పారు. ఇండిపెంటెండ్ గా నిలబడి పవన్ గెలవాలని ఛాలెంజ్ చేశారు. పవన్ ను ఛాలెంజ్ చేస్తూ రోజా చేసిన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on November 23, 2024 12:40 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…