Political News

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్ పవర్ కొనుగోలు వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపణలు రావడం, అదానీపై అమెరికాలో పెట్టిన కేసుకు ఏపీతో లింకులున్నాయని ప్రచారం జరగడం షాకింగ్ గా మారింది.

ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినే పరిస్థితిని జగన్ తెచ్చాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఏపీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తించారని, వింటేనే బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో అదానీపై వేసిన కేసు పబ్లిక్ డొమైన్ లో ఉందని, దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. వాస్తవాలు వచ్చిన తర్వాత ఏం చేయాలో చేస్తూనే సభ్యులకు, ప్రజలకు సమాచారం ఇస్తుంటామని అన్నారు.

ఎవరు తప్పు చేసినా వారిపై చర్యలు తప్పవని, అప్పుడే ఇంకొకరు ఇలా చేయకుండా భయపడే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు.

ఐదేళ్ల జగన్ పాలనలో వ్యవస్థలను ధ్వంసం చేశారని, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని మండిపడ్డారు. అసత్యాలను పదే పదే చెప్పి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని గత ప్రభుత్వం పని చేసిందని, వాస్తవాలు పక్కనపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.

బరితగించి తప్పులు చేసి వాటిని ఒప్పులుగా చిత్రీకరించారని వైసీపీ నేతలపై షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకే విజన్ డాక్యుమెంట్ -2047పేరుతో షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని అన్నారు. రౌడీ రాజకీయాలు చేస్తామంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని చంద్రబాబు చెప్పారు.

This post was last modified on November 23, 2024 8:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

1 hour ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

9 hours ago