Political News

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్ పవర్ కొనుగోలు వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపణలు రావడం, అదానీపై అమెరికాలో పెట్టిన కేసుకు ఏపీతో లింకులున్నాయని ప్రచారం జరగడం షాకింగ్ గా మారింది.

ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినే పరిస్థితిని జగన్ తెచ్చాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఏపీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తించారని, వింటేనే బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో అదానీపై వేసిన కేసు పబ్లిక్ డొమైన్ లో ఉందని, దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. వాస్తవాలు వచ్చిన తర్వాత ఏం చేయాలో చేస్తూనే సభ్యులకు, ప్రజలకు సమాచారం ఇస్తుంటామని అన్నారు.

ఎవరు తప్పు చేసినా వారిపై చర్యలు తప్పవని, అప్పుడే ఇంకొకరు ఇలా చేయకుండా భయపడే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు.

ఐదేళ్ల జగన్ పాలనలో వ్యవస్థలను ధ్వంసం చేశారని, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని మండిపడ్డారు. అసత్యాలను పదే పదే చెప్పి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని గత ప్రభుత్వం పని చేసిందని, వాస్తవాలు పక్కనపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.

బరితగించి తప్పులు చేసి వాటిని ఒప్పులుగా చిత్రీకరించారని వైసీపీ నేతలపై షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకే విజన్ డాక్యుమెంట్ -2047పేరుతో షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని అన్నారు. రౌడీ రాజకీయాలు చేస్తామంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని చంద్రబాబు చెప్పారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

7 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago