Political News

ఇంచార్జ్‌ల‌ను మార్చినా వైసీపీకి ఊపులేదు

ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో చావు దెబ్బ‌తిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా అధినేత స్థాయిలో మార్పు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు కూడా ఆయ‌న భ‌రోసా ఇవ్వ‌లేక పోతున్నారు. దీంతో ఇంచార్జ్ లుగా బాధ్య‌తలు చేప‌ట్టిన వారు కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఎవ‌రికి వారు త‌మ‌సొంత ప‌నులు చేసుకుంటున్నారు.

ఏంటి కార‌ణం..?
ఒక నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా ఉన్న నాయ‌కుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేయాలి. ఈ ఉద్దేశంతోనే కొన్నాళ్ల కిందట జ‌గ‌న్ ఇంచార్జ్‌ల‌ను మార్చారు. ఆముదాల వ‌ల‌స నుంచి అనేక నియోజ‌క‌వ ర్గాల్లో యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీ త‌ర‌ఫున వీరు గ‌ళం వినిపించ‌లేదు. పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చింది కూడా లేదు. దీంతో ఇంచార్జ్‌లు పార్టీకి భారం అవుతున్నారా? పార్టీనే వారికి భారం అవుతోందా? అన్న‌ది చ‌ర్చ‌.

ఇక‌, అస‌లు ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారి మ‌న‌సులో ఏమున్న‌ద‌నే విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టి నుంచి వ‌చ్చే ఐదేళ్లు క‌ష్ట‌ప‌డేందుకు చాలా మంది రెడీగా అయితే లేరు. పైగా మ‌న‌సుల్లోనూ బెరుకు వారిని వెంటాడు తోంది. వ‌చ్చే ఐదేళ్ల‌పాటు పోరాటాలు చేసినా.. చివ‌ర‌కు టికెట్ త‌మ‌కే వ‌స్తుంద‌న్న గ్యారెంటీ ఉందా? అనేది ప్ర‌ధాన డౌట్‌. దీనికి కార‌ణం..గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇంచార్జ్‌ల‌ను ఇష్టానుసారంగా మార్చేశా రు. వ‌ద్ద‌న్నా విన‌కుండా షిఫ్టు చేశారు.

ఇలానే.. వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా త‌మ‌కే టికెట్ ఇస్తారా? అనేది వారి సందేహం. ఇన్నాళ్లు క‌ష్ట‌ప‌డి కేసులు పెట్టుకుని.. వీధి పోరాటు చేశాక‌..చివ‌రి నిముషంలో కాదు పొమ్మంటే ఏంట‌నేది వారి స‌మ‌స్య‌. అంతేకాదు..ఆర్థికంగా కూడా ఖ‌ర్చు పెట్టేందుకు వెనుకాడుతున్న‌వారు కూడా ఉన్నారు. సో.. ఇలాంటి ప‌రిస్థితి నుంచి పార్టీని బ‌య‌ట ప‌డేయాల్సిన బాధ్య‌త జ‌గ‌న్‌పైనేఉంది. ఆయ‌నే వారికి స‌ర్దిచెప్పాలి. లేక‌పోతే.. ఇంచార్జ్‌లు ఇంకా డోలాయ‌మానంలో చిక్కుకుంటార‌నేది వాస్త‌వం.

This post was last modified on November 22, 2024 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

17 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago