ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా అధినేత స్థాయిలో మార్పు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో నాయకులకు కూడా ఆయన భరోసా ఇవ్వలేక పోతున్నారు. దీంతో ఇంచార్జ్ లుగా బాధ్యతలు చేపట్టిన వారు కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఎవరికి వారు తమసొంత పనులు చేసుకుంటున్నారు.
ఏంటి కారణం..?
ఒక నియోజకవర్గానికి ఇంచార్జ్గా ఉన్న నాయకుడు ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి. ఈ ఉద్దేశంతోనే కొన్నాళ్ల కిందట జగన్ ఇంచార్జ్లను మార్చారు. ఆముదాల వలస నుంచి అనేక నియోజకవ ర్గాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలోనూ వైసీపీ తరఫున వీరు గళం వినిపించలేదు. పార్టీ తరఫున ప్రజల మధ్యకు వచ్చింది కూడా లేదు. దీంతో ఇంచార్జ్లు పార్టీకి భారం అవుతున్నారా? పార్టీనే వారికి భారం అవుతోందా? అన్నది చర్చ.
ఇక, అసలు ఇంచార్జ్లుగా ఉన్నవారి మనసులో ఏమున్నదనే విషయానికి వస్తే.. ఇప్పటి నుంచి వచ్చే ఐదేళ్లు కష్టపడేందుకు చాలా మంది రెడీగా అయితే లేరు. పైగా మనసుల్లోనూ బెరుకు వారిని వెంటాడు తోంది. వచ్చే ఐదేళ్లపాటు పోరాటాలు చేసినా.. చివరకు టికెట్ తమకే వస్తుందన్న గ్యారెంటీ ఉందా? అనేది ప్రధాన డౌట్. దీనికి కారణం..గత ఎన్నికల సమయంలో ఇంచార్జ్లను ఇష్టానుసారంగా మార్చేశా రు. వద్దన్నా వినకుండా షిఫ్టు చేశారు.
ఇలానే.. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకే టికెట్ ఇస్తారా? అనేది వారి సందేహం. ఇన్నాళ్లు కష్టపడి కేసులు పెట్టుకుని.. వీధి పోరాటు చేశాక..చివరి నిముషంలో కాదు పొమ్మంటే ఏంటనేది వారి సమస్య. అంతేకాదు..ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టేందుకు వెనుకాడుతున్నవారు కూడా ఉన్నారు. సో.. ఇలాంటి పరిస్థితి నుంచి పార్టీని బయట పడేయాల్సిన బాధ్యత జగన్పైనేఉంది. ఆయనే వారికి సర్దిచెప్పాలి. లేకపోతే.. ఇంచార్జ్లు ఇంకా డోలాయమానంలో చిక్కుకుంటారనేది వాస్తవం.
This post was last modified on November 22, 2024 6:08 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…