బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అమెరికా.. భారత్ మీద సంబంధాల మీదా అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందన్న వాదన వినిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్ష భవనం ఈ అంశంపై రియాక్టు అయంయింది. సోలార్ పవర్ ప్రొక్షన్.. సప్లై డీల్స్ కు సంబంధించి భారత్ లో రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చారని.. ఆ భారీ మొత్తాలను తప్పుడు పద్దతుల్లో సమాచారాన్ని ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించినట్లుగా ఆరోపణలు రావటం తెలిసిందే.
ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీతో పాటు 8 మంది మీద (గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్. జైన్.. అజూర్ పవర్ సీఈవో రంజిత్ గుప్తా తదితరులు) కేసులు నమోదయ్యాయి. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం స్పందిస్తూ.. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రోజు వారీ మీడియా బ్రీఫ్ లో భాగంగా వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ స్పందిస్తూ.. అదానీపై కేసు నమోదైన అంశం తమ ద్రష్టికి వచ్చిందని.. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్.. న్యాయశాఖనే సరైన సమాచారాన్ని ఇవ్వగలదన్నారు.
ఎప్పటిలానే భారత్ – అమెరికా సంబంధాలు బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అనేక అంశాల మీద పరస్పరం సహకారం అందించుకున్నట్లుగా పేర్కొంటూ.. మిగిలిన సమస్యల మాదిరే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని.. ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలిచినట్లుగా పేర్కొన్నారు. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సోలార్ పవర్ ను కొనుగోలు చేసేలా ఏపీ.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే వైట్ హౌస్ కూడా రియాక్టు అయ్యింది.
This post was last modified on November 22, 2024 11:39 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…