బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అమెరికా.. భారత్ మీద సంబంధాల మీదా అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందన్న వాదన వినిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్ష భవనం ఈ అంశంపై రియాక్టు అయంయింది. సోలార్ పవర్ ప్రొక్షన్.. సప్లై డీల్స్ కు సంబంధించి భారత్ లో రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చారని.. ఆ భారీ మొత్తాలను తప్పుడు పద్దతుల్లో సమాచారాన్ని ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించినట్లుగా ఆరోపణలు రావటం తెలిసిందే.
ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీతో పాటు 8 మంది మీద (గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్. జైన్.. అజూర్ పవర్ సీఈవో రంజిత్ గుప్తా తదితరులు) కేసులు నమోదయ్యాయి. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం స్పందిస్తూ.. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రోజు వారీ మీడియా బ్రీఫ్ లో భాగంగా వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ స్పందిస్తూ.. అదానీపై కేసు నమోదైన అంశం తమ ద్రష్టికి వచ్చిందని.. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్.. న్యాయశాఖనే సరైన సమాచారాన్ని ఇవ్వగలదన్నారు.
ఎప్పటిలానే భారత్ – అమెరికా సంబంధాలు బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అనేక అంశాల మీద పరస్పరం సహకారం అందించుకున్నట్లుగా పేర్కొంటూ.. మిగిలిన సమస్యల మాదిరే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని.. ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలిచినట్లుగా పేర్కొన్నారు. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సోలార్ పవర్ ను కొనుగోలు చేసేలా ఏపీ.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే వైట్ హౌస్ కూడా రియాక్టు అయ్యింది.
This post was last modified on November 22, 2024 11:39 am
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. పార్టీ నాయకులకు బాగా కలిసి వస్తోందన్నవాదన వినిపిస్తోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు.. తమ్ముళ్లకు…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…