Political News

గౌతమ్ అదానీ ఇష్యూపై వైట్ హౌస్ రియాక్షన్ ఇదే

బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అమెరికా.. భారత్ మీద సంబంధాల మీదా అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందన్న వాదన వినిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్ష భవనం ఈ అంశంపై రియాక్టు అయంయింది. సోలార్ పవర్ ప్రొక్షన్.. సప్లై డీల్స్ కు సంబంధించి భారత్ లో రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చారని.. ఆ భారీ మొత్తాలను తప్పుడు పద్దతుల్లో సమాచారాన్ని ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించినట్లుగా ఆరోపణలు రావటం తెలిసిందే.

ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీతో పాటు 8 మంది మీద (గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్. జైన్.. అజూర్ పవర్ సీఈవో రంజిత్ గుప్తా తదితరులు) కేసులు నమోదయ్యాయి. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం స్పందిస్తూ.. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రోజు వారీ మీడియా బ్రీఫ్ లో భాగంగా వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ స్పందిస్తూ.. అదానీపై కేసు నమోదైన అంశం తమ ద్రష్టికి వచ్చిందని.. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్.. న్యాయశాఖనే సరైన సమాచారాన్ని ఇవ్వగలదన్నారు.

ఎప్పటిలానే భారత్ – అమెరికా సంబంధాలు బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అనేక అంశాల మీద పరస్పరం సహకారం అందించుకున్నట్లుగా పేర్కొంటూ.. మిగిలిన సమస్యల మాదిరే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని.. ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలిచినట్లుగా పేర్కొన్నారు. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సోలార్ పవర్ ను కొనుగోలు చేసేలా ఏపీ.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే వైట్ హౌస్ కూడా రియాక్టు అయ్యింది.

This post was last modified on November 22, 2024 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

15 seconds ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

9 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago