Political News

గౌతమ్ అదానీ ఇష్యూపై వైట్ హౌస్ రియాక్షన్ ఇదే

బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అమెరికా.. భారత్ మీద సంబంధాల మీదా అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందన్న వాదన వినిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్ష భవనం ఈ అంశంపై రియాక్టు అయంయింది. సోలార్ పవర్ ప్రొక్షన్.. సప్లై డీల్స్ కు సంబంధించి భారత్ లో రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చారని.. ఆ భారీ మొత్తాలను తప్పుడు పద్దతుల్లో సమాచారాన్ని ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించినట్లుగా ఆరోపణలు రావటం తెలిసిందే.

ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీతో పాటు 8 మంది మీద (గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్. జైన్.. అజూర్ పవర్ సీఈవో రంజిత్ గుప్తా తదితరులు) కేసులు నమోదయ్యాయి. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం స్పందిస్తూ.. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రోజు వారీ మీడియా బ్రీఫ్ లో భాగంగా వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ స్పందిస్తూ.. అదానీపై కేసు నమోదైన అంశం తమ ద్రష్టికి వచ్చిందని.. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్.. న్యాయశాఖనే సరైన సమాచారాన్ని ఇవ్వగలదన్నారు.

ఎప్పటిలానే భారత్ – అమెరికా సంబంధాలు బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అనేక అంశాల మీద పరస్పరం సహకారం అందించుకున్నట్లుగా పేర్కొంటూ.. మిగిలిన సమస్యల మాదిరే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని.. ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలిచినట్లుగా పేర్కొన్నారు. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సోలార్ పవర్ ను కొనుగోలు చేసేలా ఏపీ.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే వైట్ హౌస్ కూడా రియాక్టు అయ్యింది.

This post was last modified on November 22, 2024 11:39 am

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

6 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

6 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

9 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

9 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

10 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

10 hours ago