Political News

అస‌లు వ‌ద్దు… కొస‌రు ముద్దంటోన్న జ‌గ‌న్‌…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి విచిత్రంగా ఉంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. కీల‌క‌మైన స‌మ‌యం లో ఆయ‌న మౌనంగా ఉంటూ.. అవ‌స‌రంలేని స‌మ‌యంలో స్పందిస్తున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మండ‌లి ఎన్నిక‌లు వ‌చ్చాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయినా.. జ‌గ‌న్ వైపు నుంచి స్పంద‌న రాలేదు. ఎవ‌రినీ ఆయ‌న నిల‌బెట్ట‌లేదు. ప్రోత్స‌హించ‌లేదు. మ‌ద్ద‌తు కూడా ప్ర‌క‌టించ‌లేదు.

నిజానికి మండ‌లి కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చినా, ఎవ‌రినైనా నిల‌బెట్టినా అది వేరేగా ఉండేది. ఎందుకంటే.. ఈ ఆరు మాసాల కాలంలో ఏదైనా సింప‌తిపెరిగి ఉంటే అది ఓట్ల రూపంలో వైసీపీకి మేలు చేసేది. కానీ, జ‌గ‌న్ మాత్రం ఈ గోల్డెన్ ఛాన్స్ వ‌దులుకున్నారు. వాస్త‌వానికి ఒక‌రిద్ద‌రు నాయ‌కులు పోటీకి రెడీ అయ్యారు. అయినా..జ‌గ‌న్ మాత్రం కాద‌న్నారు. దీంతో మండ‌లి ఎన్నిక‌ల‌కు వైసీపీ దూర‌మైంది.

ఇక‌, ఇప్పుడు బ‌లం లేకున్నా.. అసెంబ్లీలో పోరాటానికి దిగారు. ప్ర‌జాప‌ద్దుల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ స‌హా పీయూసీ (ప‌బ్లిక్ అండ‌ర్ టేకింగ్ క‌మిటీ) చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు పోటీ చేస్తున్నారు. ఆయా ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు క‌నీసంలో క‌నీసం 18 మంది(మొత్తం స‌భ్యుల్లో 10 శాతం) స‌భ్యుల మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉంది. కానీ, ఈ మేర‌కు వైసీపీకి స‌భ్యులు లేరు. ప్ర‌స్తుతం ఉన్నది 11 మంది స‌భ్యులు మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికీ.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి రంగంలోకి దిగారు.

అలాగే మ‌రికొంద‌రు కూడా పీయూసీ చైర్మ‌న్ ప‌ద‌వికి నామినేష‌న్ వేశారు. నిజానికి వీరంతా ఓడిపోతార‌ని తెలిసినా.. జ‌గ‌న్ అత్యుత్సాహం చూప‌డం గ‌మ‌నార్హం. అయితే.. వైసీపీ నేత‌ల పోటీ కార‌ణంగా అనివార్యం గా ఈ ప‌ద‌వుల‌కు ఎన్నిక నిర్వ‌హించే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనివ‌ల్ల స‌భా స‌మ‌యం వృథా త‌ప్ప‌.. మ‌రేమీ ఉండ‌బోద‌ని.. నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా పోటీ చేయాల్సిన చోట చేయ‌కుండా.. చేయ‌కూడ‌ని చోట చేయ‌డం జ‌గ‌న్ చిత్ర‌మైన మ‌న‌స్తత్వానికి నిద‌ర్శ‌నంగా ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on November 22, 2024 11:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

57 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago