Political News

అస‌లు వ‌ద్దు… కొస‌రు ముద్దంటోన్న జ‌గ‌న్‌…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి విచిత్రంగా ఉంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. కీల‌క‌మైన స‌మ‌యం లో ఆయ‌న మౌనంగా ఉంటూ.. అవ‌స‌రంలేని స‌మ‌యంలో స్పందిస్తున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మండ‌లి ఎన్నిక‌లు వ‌చ్చాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయినా.. జ‌గ‌న్ వైపు నుంచి స్పంద‌న రాలేదు. ఎవ‌రినీ ఆయ‌న నిల‌బెట్ట‌లేదు. ప్రోత్స‌హించ‌లేదు. మ‌ద్ద‌తు కూడా ప్ర‌క‌టించ‌లేదు.

నిజానికి మండ‌లి కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చినా, ఎవ‌రినైనా నిల‌బెట్టినా అది వేరేగా ఉండేది. ఎందుకంటే.. ఈ ఆరు మాసాల కాలంలో ఏదైనా సింప‌తిపెరిగి ఉంటే అది ఓట్ల రూపంలో వైసీపీకి మేలు చేసేది. కానీ, జ‌గ‌న్ మాత్రం ఈ గోల్డెన్ ఛాన్స్ వ‌దులుకున్నారు. వాస్త‌వానికి ఒక‌రిద్ద‌రు నాయ‌కులు పోటీకి రెడీ అయ్యారు. అయినా..జ‌గ‌న్ మాత్రం కాద‌న్నారు. దీంతో మండ‌లి ఎన్నిక‌ల‌కు వైసీపీ దూర‌మైంది.

ఇక‌, ఇప్పుడు బ‌లం లేకున్నా.. అసెంబ్లీలో పోరాటానికి దిగారు. ప్ర‌జాప‌ద్దుల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ స‌హా పీయూసీ (ప‌బ్లిక్ అండ‌ర్ టేకింగ్ క‌మిటీ) చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు పోటీ చేస్తున్నారు. ఆయా ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు క‌నీసంలో క‌నీసం 18 మంది(మొత్తం స‌భ్యుల్లో 10 శాతం) స‌భ్యుల మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉంది. కానీ, ఈ మేర‌కు వైసీపీకి స‌భ్యులు లేరు. ప్ర‌స్తుతం ఉన్నది 11 మంది స‌భ్యులు మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికీ.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి రంగంలోకి దిగారు.

అలాగే మ‌రికొంద‌రు కూడా పీయూసీ చైర్మ‌న్ ప‌ద‌వికి నామినేష‌న్ వేశారు. నిజానికి వీరంతా ఓడిపోతార‌ని తెలిసినా.. జ‌గ‌న్ అత్యుత్సాహం చూప‌డం గ‌మ‌నార్హం. అయితే.. వైసీపీ నేత‌ల పోటీ కార‌ణంగా అనివార్యం గా ఈ ప‌ద‌వుల‌కు ఎన్నిక నిర్వ‌హించే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనివ‌ల్ల స‌భా స‌మ‌యం వృథా త‌ప్ప‌.. మ‌రేమీ ఉండ‌బోద‌ని.. నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా పోటీ చేయాల్సిన చోట చేయ‌కుండా.. చేయ‌కూడ‌ని చోట చేయ‌డం జ‌గ‌న్ చిత్ర‌మైన మ‌న‌స్తత్వానికి నిద‌ర్శ‌నంగా ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on November 22, 2024 11:24 am

Share

Recent Posts

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

17 minutes ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

1 hour ago

వెంకీ త్రివిక్రమ్… ఇంకా ఆ ఒక్క కిక్ రాలేదే!

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…

1 hour ago

20 గంటలు పని… 4 గంటలు రెస్ట్?

తమిళ సినిమాలో అగ్ర నటుడిగా వెలుగొందిన నటుడు విజయ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. స్వర్గ సుఖాల జీవితం నుంచి…

1 hour ago

మూడేళ్ల ముందు 100 కోట్లు… ఇప్పుడు 3 కోట్లు

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్…

7 hours ago

ఏపీలో ఉద్యోగాల పండగ

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపిక‌బురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేల‌కుపైగా స‌ర్కారీ…

11 hours ago