Political News

అదానీపై కేసుకు ఆంధ్రాతో లింకులు

అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో ని న్యూయార్క్ లో కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రెండు బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్ట్ కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీతోపాటు ఏడుగురిపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది.

అదానీ గ్రూపు 20 ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగలిగేలాగా సౌరశక్తి సరఫరాకు సంబంధించిన ఒప్పందాల కోసం 265 మిలియన్ డాలర్లు లంచాలు ఇచ్చేందుకు అదానీ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అమెరికాతోపాటు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సేకరించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ పెట్టుబడిదారుల నుంచి మూడు బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లు సేకరించిందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారానికి ఏపీతో లింకులు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒప్పందంలో 2019 నుంచి 24 వరకు ఏపీ ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తి ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 2021లో ఏపీకి చెందిన కొందరు అధికారులకు అదానీ లంచాలు ఇచ్చారని, ఈ ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయిని ఆరోపణలు వస్తున్నాయి. ఆ విదేశీ అధికారులతో, రాయబారులతో ఆంధ్రప్రదేశ్ లో అదానీ 2021 సెప్టెంబర్ 12, నవంబర్ 20వ తేదీలలో భేటీ అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో ఒప్పందాల కోసం కూడా 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చేందుకు అదానీ సిద్ధమయ్యారని ఆరోపణలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్లో డిస్కంలో భారీ నష్టాలు వచ్చినప్పుడు విద్యుత్ ఒప్పందాలను వేగంగా అమలు చేసేందుకు ముడుపులు ఇచ్చారని ఆరోపణలున్నాయి. అమెరికాలో నమోదైన కేసు ప్రకారం ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థలకు చెందిన గౌతం అదానీతోపాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఐదుగురిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో కేసు నమోదు అయింది.

This post was last modified on November 21, 2024 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

1 hour ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago