Political News

మోస్ట్ వాంటెడ్ పీకే

పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. దేశ రాజకీయాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్నవారికి ఈ పేరు తెలిసే ఉంటుంది. రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో పార్టీలను గెలిపించి….మరెందరినో గెలుపు గుర్రాలెక్కించారు. తన టీం 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూటమి, 2015లో బిహార్‌లో మహా ఘట్ బంధన్‌, 2017లో పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, 2019 ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్…ఇవన్నీ పీకే విజయగాథలు.

2017లో యూపీ ఎన్నిక‌లు మిన‌హా మిగ‌తా అన్ని ఎన్నిక‌ల్లో పీకే స్ట్రాట‌జీస్ వ‌ర్క‌వుట్ అయ్యాయి. అందుకే, పీకే సేవల కోసం పార్టీలన్నీ క్యూ కడుతున్నాయి. త్వరలో కొన్ని రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పీకే మోస్ట్ వాంటెడ్ అయ్యారు.

ప్రస్తుతం 2021 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే త‌ర‌ఫున రాజ‌కీయ వ్యూహ‌క‌ర్తగా పీకే ప‌నిచేయనున్నారు. ఆల్రెబీ బిహార్ లో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ ఆ తర్వాత పంజాబ్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ బిజీగా మారనున్నారు. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తరుపున పీకే ఎన్నికల వ్యూహకర్తగావ్యవహరిస్తున్నారు.

పంజాబ్ లో కాంగ్రెస్ తరుపున పీకే వ్యూహాలు రచించనున్నారు. మరో మూడేళ్లున్నప్పటికీ కర్ణాటకలో జనతాదళ్ ఎస్ అధినేత కుమారస్వామి కూడా పీకేని లైన్ లో పెట్టాలని చూస్తున్నారు. ఇలా తన ఐప్యాక్ టీంతో పార్టీలను, నేతలను సిక్స్ ప్యాక్ గా మార్చిన పీకే ఇపుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ అయ్యారు. మరి,గతంలో మాదిరి భవిష్యత్తులో పీకే ఎంతమందిని గెలుపుగుర్రాలు ఎక్కిస్తారన్నది వేచి చూడాలి.

This post was last modified on October 11, 2020 4:15 pm

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

3 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

5 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

6 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

6 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

6 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

7 hours ago