పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. దేశ రాజకీయాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్నవారికి ఈ పేరు తెలిసే ఉంటుంది. రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో పార్టీలను గెలిపించి….మరెందరినో గెలుపు గుర్రాలెక్కించారు. తన టీం 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, 2015లో బిహార్లో మహా ఘట్ బంధన్, 2017లో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్, 2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్…ఇవన్నీ పీకే విజయగాథలు.
2017లో యూపీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో పీకే స్ట్రాటజీస్ వర్కవుట్ అయ్యాయి. అందుకే, పీకే సేవల కోసం పార్టీలన్నీ క్యూ కడుతున్నాయి. త్వరలో కొన్ని రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పీకే మోస్ట్ వాంటెడ్ అయ్యారు.
ప్రస్తుతం 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరఫున రాజకీయ వ్యూహకర్తగా పీకే పనిచేయనున్నారు. ఆల్రెబీ బిహార్ లో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ ఆ తర్వాత పంజాబ్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ బిజీగా మారనున్నారు. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తరుపున పీకే ఎన్నికల వ్యూహకర్తగావ్యవహరిస్తున్నారు.
పంజాబ్ లో కాంగ్రెస్ తరుపున పీకే వ్యూహాలు రచించనున్నారు. మరో మూడేళ్లున్నప్పటికీ కర్ణాటకలో జనతాదళ్ ఎస్ అధినేత కుమారస్వామి కూడా పీకేని లైన్ లో పెట్టాలని చూస్తున్నారు. ఇలా తన ఐప్యాక్ టీంతో పార్టీలను, నేతలను సిక్స్ ప్యాక్ గా మార్చిన పీకే ఇపుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ అయ్యారు. మరి,గతంలో మాదిరి భవిష్యత్తులో పీకే ఎంతమందిని గెలుపుగుర్రాలు ఎక్కిస్తారన్నది వేచి చూడాలి.
This post was last modified on October 11, 2020 4:15 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…