Political News

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు : పవన్

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమని ఎన్నికలకు ముందు కూటమిలోని పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కుమార స్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన సందర్భంగా చెప్పారు. అయినా సరే, విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ క్లారిటీనిచ్చారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అది తమ అందరి కమిట్మెంట్ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే, ప్లాంట్ నడిపే విషయంలో కొన్ని లోపాలున్నాయని, మంత్రి భరత్ గారు చెప్పినట్లు పెట్టుబడి, మైన్స్, స్కిల్స్ డెవలప్మెంట్ వంటి అంశాలలో సవాళ్లున్నాయని పవన్ చెప్పారు. నెలరోజుల క్రితం కూడా కార్మికులతో మాట్లాడానని, కార్మికుల సమస్యలకు సంబంధించిన పూర్తి కార్యాచరణ రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతాను అని వారితో తాను చెప్పానని పవన్ అన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి కుమార స్వామి రెండు నెలల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిశీలించిన సందర్భంగా స్వయంగా ప్రకటించారని మంత్రి టీజీ భరత్ చెప్పారు. అంతకన్నా ఇంక ఏం ప్రకటన ఇవ్వాలో తనకు అర్థం కావడం లేదనిఅన్నారు. టీడీపీ, జనసేనల పోరాటంతో పాటు పలు రిట్ పిటిషన్లు దాఖలు చేసిన తర్వాతే గత ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వెనక్కు తగ్గిందని గుర్తు చేశారు.

ఇక, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపుతామని స్పష్టంగా హామీ ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తొలి ఢిల్లీ పర్యటనలోనే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కుమార స్వామిలను కలిశారని గుర్తు చేశారు. ఆ తర్వాతే స్టీల్ ప్లాంట్ సందర్శనకు కుమార స్వామి వచ్చారని చెప్పారు. ఆ సందర్భంగా కార్మికులతో కూడా కుమార స్వామి భేటీ అయ్యారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదని కార్మికులకు కుమార స్వామి చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

This post was last modified on November 21, 2024 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వీసా ఇంటర్వ్యూ.. ఇక నుంచి మరో టెన్షన్

అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…

51 minutes ago

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. మీ ఈఎంఐ తగ్గుతుందా?

దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…

55 minutes ago

‘పవన్ అన్న’ మాటే… ‘తమ్ముడు లోకేష్’ మాట!

కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…

3 hours ago

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

6 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

7 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

7 hours ago