Political News

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు : పవన్

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమని ఎన్నికలకు ముందు కూటమిలోని పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కుమార స్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన సందర్భంగా చెప్పారు. అయినా సరే, విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ క్లారిటీనిచ్చారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అది తమ అందరి కమిట్మెంట్ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే, ప్లాంట్ నడిపే విషయంలో కొన్ని లోపాలున్నాయని, మంత్రి భరత్ గారు చెప్పినట్లు పెట్టుబడి, మైన్స్, స్కిల్స్ డెవలప్మెంట్ వంటి అంశాలలో సవాళ్లున్నాయని పవన్ చెప్పారు. నెలరోజుల క్రితం కూడా కార్మికులతో మాట్లాడానని, కార్మికుల సమస్యలకు సంబంధించిన పూర్తి కార్యాచరణ రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతాను అని వారితో తాను చెప్పానని పవన్ అన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి కుమార స్వామి రెండు నెలల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిశీలించిన సందర్భంగా స్వయంగా ప్రకటించారని మంత్రి టీజీ భరత్ చెప్పారు. అంతకన్నా ఇంక ఏం ప్రకటన ఇవ్వాలో తనకు అర్థం కావడం లేదనిఅన్నారు. టీడీపీ, జనసేనల పోరాటంతో పాటు పలు రిట్ పిటిషన్లు దాఖలు చేసిన తర్వాతే గత ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వెనక్కు తగ్గిందని గుర్తు చేశారు.

ఇక, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపుతామని స్పష్టంగా హామీ ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తొలి ఢిల్లీ పర్యటనలోనే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కుమార స్వామిలను కలిశారని గుర్తు చేశారు. ఆ తర్వాతే స్టీల్ ప్లాంట్ సందర్శనకు కుమార స్వామి వచ్చారని చెప్పారు. ఆ సందర్భంగా కార్మికులతో కూడా కుమార స్వామి భేటీ అయ్యారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదని కార్మికులకు కుమార స్వామి చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

This post was last modified on November 21, 2024 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

32 minutes ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

2 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

3 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

4 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

5 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

5 hours ago