Political News

తెలుగు విద్యార్థులకు జగన్ ‘గులాబీ’ గిఫ్ట్

ఓ వైపు క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న్ప‌టికీ….ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారు త‌న నిర్ణ‌యాల ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. కీల‌క‌మైన నియామ‌కాలు, నిర్ణ‌యాల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వార్త‌ల్లో నిలుస్తున్నారు. తాజాగా అలాంటి ఓ నిర్ణ‌యం మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది.

అయితే, సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఖుష్ చేస్తుందంటున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల కోసం జ‌గ‌న్ స‌ర్కారు వెలువ‌రించిన ఆదేశాల గురించే ఈ చ‌ర్చ‌.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ధరించే యూనిఫాం రంగును మార్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6 -10వ తరగతి చదివే విద్యార్థులకు గులాబీ రంగు యూనిఫాంను అమలు చేయనున్నారు.

ఇప్పటి వరకు తెలుపు, నీలం, ముదురు నీలం రంగు బట్టలు ధరిస్తున్న విద్యార్థులు.. వచ్చే విద్యాసంవత్సరంలో గులాబీ రంగులో మెరిసిపోనున్నారు. బాలురకు ప్యాంట్‌, షర్ట్‌, బాలికలకు పంజాబీ డ్రెస్‌ ఇస్తామని, విద్యార్థులకు పంపిణీ చేసే బట్టల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఏపీ విద్యా శాఖ స్పష్టం చేసింది.

కాగా, ఏపీ సీఎం, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మ‌ధ్య గ‌త కొద్దికాలంగా స‌ఖ్య‌త కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రంగు గులాబీ అనే సంగ‌తి తెలిసిందే. కాక‌తాళీయ‌మో లేక మ‌రే కార‌ణ‌మైన అయి ఉండ‌వ‌చ్చు కానీ..జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఖ‌చ్చితంగా ఈ ఇద్ద‌రి దోస్తీని ప్ర‌స్తావించేలా ఉన్నాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

This post was last modified on April 28, 2020 5:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టొవినో డ్రాపయ్యాడు… డ్రాగన్ నో అన్నాడు

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…

26 minutes ago

అనుష్కని కాసేపే చూపిస్తే ఎలా

https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…

1 hour ago

త్రివిక్రమ్… ఆ ఒక్క సీన్‌లో అసలైన స్టఫ్?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…

2 hours ago

జ‌న‌సేన ఎమ్మెల్యేకు బాబు కితాబు

సాధార‌ణంగా త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి ప‌నితీరు మెచ్చుకుంటాయి. మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని…

2 hours ago

బెంగళూరులో టెకీ జంట సూసైడ్… ఇద్దరు తెలుగువారే

షాకింగ్ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు తెలంగాణ…

2 hours ago

కల్కి 2… సుప్రీమ్ బలాన్ని పెంచుతున్న నాగ్ అశ్విన్?

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభావాన్ని ఎవరూ మర్చిపోలేరు. మొదటి…

2 hours ago