ఉత్తరాది రాష్ట్రాల్లో కీలకమైన జార్ఖండ్లో 81 స్థానాలు ఉన్న అసెంబ్లీకి రెండువిడతల్లో జరిగిన ఎన్నికలు ముగిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలతో రెండో విడత పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. గనులకు ఖిల్లాగా గుర్తింపు పొందిన ఈ రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ శత విధాల ప్రయత్నాలు చేసింది. అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మరోసారి పరాభవం తప్పేలా లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఎవరు గెలిచినా.. అత్యంత స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నాయి.
మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 42 స్థానాలు కైవసం చేసుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ పరంగా చూసుకుంటే ప్రస్తుత అధికార కూటమి కాంగ్రెస్+జేఎంఎంలు మరోసారి అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఎస్ ఏఎస్ సర్వే.. లెక్కల ప్రకారం.. జార్ఖండ్లో బీజేపీకి 44% నుంచి 45% సీట్లు దక్కే అవకాశం ఉందని తేలింది. మొత్తం సీట్లలో 36-38 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది. నిజానికి ఇక్కడ విజయం కోసం .. బీజేపీ చాలానే ప్రయోగాలు చేసింది. జేఎంఎంలో కీలక నేతగా ఉన్న మాజీ సీఎం చంపయి సొరేన్ను తన గూటిలో చేర్చుకుంది.
ఇక, సీఎంగా ఉన్న జేఎంఎం అధినేత హేమంత్ సొరేన్ను జైలుకు పంపించింది ప్రస్తుతం ఆయన బెయిల్పై వచ్చాయి. అయితే.. ఇంత జరిగినా.. విజయం మాత్రం బీజేపీ పరం కావడం లేదన్నది ఎస్ ఏఎస్ సర్వే చెబుతున్న మాట. ఇక, కాంగ్రెస్ నేతృత్వంలోని జేఎంఎం ఇండియా కూటమి స్వల్ప మెజారిటీతో విజయం దక్కించుకునే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది. దీని ప్రకారం.. ఇండియా కూటమికి 43-45 సీట్లు దక్కే అవకాశం ఉంది. అంటే.. మెజారిటీ మార్కు 45కు చేరువ అయ్యే ఛాన్స్ ఉందని తేలింది. ఇక, స్వతంత్రులు, ఇతర చిన్నా చితకా పార్టీలకు 2-5 సీట్లు దక్కనున్నాయి.
అయితే, పీపుల్స్ పల్స్ సంస్థ అంచనాల ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పడం విశేషం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 42 నుండి 48 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 38-42 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక, ఇతరులు 6 నుండి 10 స్థానాలు పొందే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
This post was last modified on November 21, 2024 12:14 am
అదేంటి దర్శకుల్లో ఈ న్యూ ఏజ్ బ్యాచ్ ఎవరనుకుంటున్నారా. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సహజమైన కథా కథనాలతో నిజ…
మాజీ ఎంపీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 50వ వివాహ వార్షికోత్సవం…
నియోజకవర్గాలకు నాయకులను ఎంపిక చేస్తున్న జగన్పై అదే నాయకుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఒత్తిడితోనే జగన్ ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ తీయాలనుకున్నాడో కానీ.. అది ఆయనకు కెరీర్లో ఎన్నడూ…
సౌత్ సినిమాను దశాబ్దాలుగా తక్కువగా చూస్తుండేది బాలీవుడ్. అక్కడి నటులు, ఫిలిం మేకర్లు తమను తాము గొప్పగా ఫీలయ్యేవాళ్లన్నది స్పష్టం.…
హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో…