ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ అరెస్టు దేశ రాజకీయాలలో సైతం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ చేసిన వ్యాఖ్యల కారణంగానే చంద్రబాబును అరెస్టు చేశారని అప్పట్లో వైసీపీ నేతలు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై టీడీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహా కుట్ర జరిగిందని కోటంరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో పొరపాటు జరిగిందని తాను చెప్పలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. సీఐడీ, సీఎంవో, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసులలో ఏకకాలంలో ఫైళ్ళు మాయం కావడం, చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ హస్తముందని ఆ అధికారి అభిప్రాయపడ్డ విషయాన్ని సభలో ప్రస్తావించారు.
అంతేకాకుండా, ఆ ఫైళ్లు మాయం కావడంతోపాటు, తన వాంగ్మూలంపైన విచారణ జరిపించాలని డీజీపీకి పీవీ రమేష్ లేఖ రాశారని గుర్తు చేశారు. అ లేఖపై విచారణపై గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఆ లేఖపై, విచారణపై కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరారు. 53 రోజులపాటు అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారని, జీరో అవర్ పక్కన పెట్టి ఆ వ్యవహారం గురించి మాట్లాడాలని కోరారు. ఆ అంశంపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది చాలా సీరియస్ అంశమని, జీరో అవర్ లో దీనిపై సమాధానం కుదరలేదు కాబట్టి ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చిద్దామని స్పీకర్ రఘురామ సూచించారు.
This post was last modified on November 19, 2024 3:26 pm
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…