ఏపీ శాసన మండలి సమావేశాల్లో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పేరును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రస్తావించడం.. చిచ్చు రేపింది. భూముల పై జరిగిన చర్చలో మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ.. భూముల అక్రమాలపై ఉక్కుపాదంమోపుతామని చెప్పారు. ప్రజల భూములను అడ్డంగా దోచుకున్నవారిని ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని తెలిపారు.
ఈ సమయంలో రెండు మూడు నెలల కిందట తిరుపతి జిల్లా మదనపల్లెలోని ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో వేలాది ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపైనా విచారణ సాగుతున్నట్టు మంత్రి అనగాని తెలిపారు. ఈ సమయంలో ఆయన పెద్దిరెడ్డి పేరును ఉటంకించారు. “అందరి సంగతీ త్వరలోనే బయటపడుతుంది. మదన పల్లె ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందని మా వాళ్లు చెబుతున్నారు. ప్రజల భూములు దోచుకుని ఆయన భార్య పేరిట పెట్టుకున్నారు” అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ప్రభుత్వం మారిన వెంటనే ఫైళ్లను దగ్ధం చేయాలని పెద్దిరెడ్డి అనుకున్నారని మంత్రి అనగాని తెలిపారు. ఈ సమయంలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని మంత్రి మాటలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సభలో లేని.. పెద్దిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో బొత్స కూడా నియంత్రణ తప్పారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి! అని వ్యాఖ్యానించారు.
“అధ్యక్షా.. సభలో లేని వారి గురించి మాట్లాడడం సంస్కారమా? చెప్పండి. లేని పోని అపవాదులు మాపై వేస్తున్నారు. మీరు విచారణ చేస్తున్నారు కాబట్టి.. చేసుకోండి. కానీ, సభలోలేనివారి గురించి ఎందుకు చెబుతున్నారు. మీకు చేతనైంది చేసుకోండి. కానీ, పెద్దిరెడ్డి పేరు ఎత్తొద్దు. రికార్డుల నుంచి కూడా దీనిని తొలగించాలి” అని బొత్స డిమాండ్ చేశారు. ఈ సమయంలోఅధికార పక్ష సభ్యులు బొత్సకు అడ్డుపడ్డారు. తప్పు చేశారు కాబట్టే మంత్రి మాట్లాడారని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. దీంతో మండలిలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on November 19, 2024 2:02 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…