ఏపీ శాసన మండలి సమావేశాల్లో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పేరును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రస్తావించడం.. చిచ్చు రేపింది. భూముల పై జరిగిన చర్చలో మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ.. భూముల అక్రమాలపై ఉక్కుపాదంమోపుతామని చెప్పారు. ప్రజల భూములను అడ్డంగా దోచుకున్నవారిని ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని తెలిపారు.
ఈ సమయంలో రెండు మూడు నెలల కిందట తిరుపతి జిల్లా మదనపల్లెలోని ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో వేలాది ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపైనా విచారణ సాగుతున్నట్టు మంత్రి అనగాని తెలిపారు. ఈ సమయంలో ఆయన పెద్దిరెడ్డి పేరును ఉటంకించారు. “అందరి సంగతీ త్వరలోనే బయటపడుతుంది. మదన పల్లె ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందని మా వాళ్లు చెబుతున్నారు. ప్రజల భూములు దోచుకుని ఆయన భార్య పేరిట పెట్టుకున్నారు” అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ప్రభుత్వం మారిన వెంటనే ఫైళ్లను దగ్ధం చేయాలని పెద్దిరెడ్డి అనుకున్నారని మంత్రి అనగాని తెలిపారు. ఈ సమయంలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని మంత్రి మాటలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సభలో లేని.. పెద్దిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో బొత్స కూడా నియంత్రణ తప్పారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి! అని వ్యాఖ్యానించారు.
“అధ్యక్షా.. సభలో లేని వారి గురించి మాట్లాడడం సంస్కారమా? చెప్పండి. లేని పోని అపవాదులు మాపై వేస్తున్నారు. మీరు విచారణ చేస్తున్నారు కాబట్టి.. చేసుకోండి. కానీ, సభలోలేనివారి గురించి ఎందుకు చెబుతున్నారు. మీకు చేతనైంది చేసుకోండి. కానీ, పెద్దిరెడ్డి పేరు ఎత్తొద్దు. రికార్డుల నుంచి కూడా దీనిని తొలగించాలి” అని బొత్స డిమాండ్ చేశారు. ఈ సమయంలోఅధికార పక్ష సభ్యులు బొత్సకు అడ్డుపడ్డారు. తప్పు చేశారు కాబట్టే మంత్రి మాట్లాడారని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. దీంతో మండలిలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on November 19, 2024 2:02 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…