Political News

బొత్స వ‌ర్సెస్ అనిత‌ మాట‌ల యుద్ధం!

ఏపీ శాస‌న మండ‌లి ఐదో రోజు స‌మావేశాలు హాట్ హాట్‌గా ప్రారంభ‌మ‌య్యాయి. స‌భ ప్రారంభం అవుతూనే .. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై చ‌ర్చ‌కు వైసీపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. దీంతో చైర్మ‌న్ మోషేన్ రాజు శాంతి భ‌ద్ర‌ల‌పై చ‌ర్చ‌కు ఓకే చెప్పారు. తొలుత మాట్లాడిన వైసీపీ మండ‌లి ప‌క్ష నాయ‌కుడు, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక వీధికో రౌడీ త‌యార‌య్యార‌ని, మ‌హిళ‌ల‌కు రాష్ట్రంలో ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఐదు మాసాల్లోనే ప‌దుల సంఖ్య‌లో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రిగాయ‌ని బొత్స తెలిపారు. ఈ వ్యాఖ్య‌లు వివాదానికి దారి తీశాయి. హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత స్పందిస్తూ.. వైసీపీ పాల‌న‌పై నిప్పులు చెరిగారు. సొంత చెల్లి, త‌ల్లికి కూడా ర‌క్ష‌ణ లేకుండా చేశారంటూ.. మాజీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు.. కూట‌మి ప్ర‌భుత్వం జ‌గ‌న్ త‌ల్లికి, చెల్లికి కూడా అండ‌గా నిలుస్తుంద‌న్నారు.

అంతేకాదు.. చట్ట‌బ‌ద్ధ‌త లేని దిశ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చి కాలం గడిపేశార‌ని, జ‌గ‌న్ ఇంటి ప‌క్క‌నే ఓమ‌హిళ పై అత్యాచారం చేసి, హ‌త్య చేస్తే.. క‌నీసం ప‌ట్టించుకున్న నాథుడు కూడా క‌నిపించ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టా రు. దేశంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం నిర్భ‌య చ‌ట్టం ఉండ‌గా.. కొత్త దిశ అనేపేరుతో ఎలాంటి చ‌ట్ట బ‌ద్ధ‌తా లేని చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చార‌ని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. గ‌తంలో ఎవ‌రు ఎప్పుడు ఎవ‌రిపై దాడి చేస్తారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు.

బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన త‌న‌పైనే కేసులు పెట్టార‌ని ఇలాంటి జ‌గ‌న్ తాలూకు సభ్యులు కూట‌మి స‌ర్కారును ప్ర‌శ్నించ‌డం ఏంట‌ని విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన మ‌హిళ‌ల‌పై దారుణాల‌ను పుస్త‌కాల రూపంలో రాసినా స‌రిపోవ‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ స‌భ్యులువిభేదించారు. అనిత వ్యాఖ్య‌ల‌ను బొత్స స‌త్యానారాయ‌ణ త‌ప్పుబ‌డుతూ.. స‌భ నుంచి వాకౌట్ చేస్తుస‌న్న‌ట్టు ప్ర‌క‌టించి.. స‌భ్యులు అంద‌రూ వెళ్లిపోయారు.

This post was last modified on November 18, 2024 12:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

20 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

2 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago