ఏపీ శాసన మండలి ఐదో రోజు సమావేశాలు హాట్ హాట్గా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవుతూనే .. రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ మోషేన్ రాజు శాంతి భద్రలపై చర్చకు ఓకే చెప్పారు. తొలుత మాట్లాడిన వైసీపీ మండలి పక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. కూటమి ప్రభుత్వం వచ్చాక వీధికో రౌడీ తయారయ్యారని, మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు మాసాల్లోనే పదుల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని బొత్స తెలిపారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. హోం మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. సొంత చెల్లి, తల్లికి కూడా రక్షణ లేకుండా చేశారంటూ.. మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. కూటమి ప్రభుత్వం జగన్ తల్లికి, చెల్లికి కూడా అండగా నిలుస్తుందన్నారు.
అంతేకాదు.. చట్టబద్ధత లేని దిశ చట్టాన్ని తీసుకువచ్చి కాలం గడిపేశారని, జగన్ ఇంటి పక్కనే ఓమహిళ పై అత్యాచారం చేసి, హత్య చేస్తే.. కనీసం పట్టించుకున్న నాథుడు కూడా కనిపించలేదని దుయ్యబట్టా రు. దేశంలో మహిళల రక్షణ కోసం నిర్భయ చట్టం ఉండగా.. కొత్త దిశ అనేపేరుతో ఎలాంటి చట్ట బద్ధతా లేని చట్టాన్ని తీసుకువచ్చారని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. గతంలో ఎవరు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.
బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తనపైనే కేసులు పెట్టారని ఇలాంటి జగన్ తాలూకు సభ్యులు కూటమి సర్కారును ప్రశ్నించడం ఏంటని విరుచుకుపడ్డారు. జగన్ హయాంలో జరిగిన మహిళలపై దారుణాలను పుస్తకాల రూపంలో రాసినా సరిపోవన్నారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులువిభేదించారు. అనిత వ్యాఖ్యలను బొత్స సత్యానారాయణ తప్పుబడుతూ.. సభ నుంచి వాకౌట్ చేస్తుసన్నట్టు ప్రకటించి.. సభ్యులు అందరూ వెళ్లిపోయారు.
This post was last modified on November 18, 2024 12:26 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…