Political News

మంత్రులే స‌హ‌నం కోల్పోతే.. వైసీపీలో చ‌ర్చ‌

రాజ‌కీయాల‌ంటే.. వ్యూహం.. ప్ర‌తివ్యూహమేకాదు.. స‌హ‌నం చాలా అవ‌స‌రం. ప్ర‌త్య‌ర్థి ప‌క్షాల నుంచి ఎదుర‌య్యే ప్ర‌తి విష‌యంలోనూ నాయ‌కులు చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అయితే, ఈ విష‌యంలో ప్ర‌స్తుతం అదికార పార్టీ వైసీపీ మంత్రులు అనుస‌రిస్తున్న తీరు.. కోల్పోతున్న స‌హ‌నం.. రాజ‌కీయంగా అటు వారికి , పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి అనేక రూపాల్లో వ్య‌తిరేక‌త వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌తిప‌క్షం కాబ‌ట్టి చేసే ప‌ని ఇంత‌క‌న్నా ఏముంటుంది? ప‌్ర‌భుత్వ నిర్ణ‌యాల విషయంలోను, స‌ర్కారు తీసుకునే చ‌ర్య‌ల విష‌యంలోనూ లోపాల‌ను ఎత్తి చూప‌డ‌మే కదా? అయితే, ఇవి కొన్ని సార్లు అతికావొ చ్చు. లేదా స‌ర్కారుకు నిజంగానే తీవ్ర ఇబ్బందిక‌ర వాతావర‌ణం సృష్టించేవీ కావొచ్చు. కానీ, సంయ‌మ‌నం అనేది ముఖ్యం. అధికారంలో ఉన్న నేత‌ల‌కు సంయ‌మ‌నం.. స‌హ‌నం.. ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం అనేవి చాలా కీల‌కం. కానీ, ప్రస్తుతం సీఎం జ‌గ‌న్‌.. ఇంత స‌హ‌నంతోనే ఉన్న‌ప్ప‌టికీ.. కొంద‌రు మంత్రులు మాత్రం ఈ స‌హ‌నం అనే ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటేస్తున్నారు. ఫ‌లితంగా వారు ఇబ్బందులు తెచ్చుకుంటు న్నారు. ఇటు పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఏ విష‌యంలోనైనా స్పందించే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, తాజాగా డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాష్‌.. చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌కరం. ఈ విష‌యం స్వ‌యానా ఆయ‌నకు కూడా తెలుసు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఒప్పుకొన్నారు కూడా. కానీ, ఎక్క‌డో పేరుకున్న అస‌హ‌నం క‌ట్ట‌లు తెగిన నేప‌థ్యంలోనే మంత్రి ఇలా వ్యాఖ్య‌లు జారార‌ని అనుకున్నా.. ప్ర‌జాస్వామ్యం, రాజ్యాంగం అంటూ ఉన్నాయి కాబ‌ట్టి.. ఇవి అంతిమంగా చేటు చేస్తాయి. పైకి సానుభూతి ప‌రులు చంక‌లు గుద్దుకున్నా.. ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అయ్యేందుకు అవ‌కాశం ఎక్కువ‌.

ఇప్ప‌టికే మంత్రి కొడాలి నానిపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌వారు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కృష్ణ‌దాస్ చేరడం .. సీనియ‌ర్ నాయ‌కుడు, మంచి ఫాలోయింగ్ ఉన్న నాయ‌కుడిగా ఇది మంచి ప‌రిణామం కాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిర్మాణాత్మ‌క‌మైన రాజ‌కీయాలు చేయాల‌నుకునే నేటి త‌రానికి దాసు వంటి నాయ‌కులు స్ఫూర్తిగా ఉండాలే త‌ప్ప‌.. స‌హ‌నం అనే ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటితే.. ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 4, 2020 10:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

1 minute ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

4 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

6 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

11 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

11 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

12 hours ago