Political News

అనుకున్న దానికన్నా జగన్ ఎక్కువే విధ్వంసం చేశాడు – బాబు

వైసీపీ హ‌యాంలో అనుకున్న దానిక‌న్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువ‌గానే జ‌రిగింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. రాష్ట్రాన్ని అన్ని ర‌కాలుగా ధ్వంసం చేసింద‌న్నారు. అయితే.. తాము పేప‌ర్ల‌లో వ‌చ్చిన వార్త‌ల‌ను బ‌ట్టి విధ్వంసం సాధార‌ణంగానే జ‌రిగింద‌ని అనుకున్నామ‌ని..కానీ, ఇప్పుడు ఒక్కొక్క శాఖ‌ను ప‌రిశీలించి చూడ‌గా.. విధ్వంసం దారుణంగా ఉంద‌న్నారు. విధ్వంసం-అరాచ‌కం-రాక్ష‌స పాల‌న‌లో రాష్ట్రం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని చెప్పారు.

పున‌ర్నిర్మాణానికి ప్రాధాన్యం..

రాష్ట్రం అప్పుల్లో ఉంద‌ని.. దాదాపు 15 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేశార‌ని.. అలాంటి రాష్ట్రాన్ని మీరు సీఎం అయి ఏం చేస్తార‌ని త‌న‌ను చాలా మంది ప్ర‌శ్నించిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. అయితే, రాష్ట్రాన్ని పున‌ర్నిర్మించేందుకు.. తాను కృషి చేస్తాన‌ని చెప్పాన‌ని, పున‌ర్నిర్మాణం చేసే క్ర‌మంలో తాను పారిపోన‌ని చెప్పారు. గ‌త వైసీపీ విధ్వంసం.. ఇలా ఉంటుంద‌ని తాను క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌న్నారు. ఎక్క‌డ చూసినా ఎవ‌రికి దొరికింది వారు దోచుకున్నార‌ని తెలిపారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను సైతం నాశ‌నం చేశార‌ని వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జాధ‌నాన్ని దుబారా చేశార‌ని అన్నారు. వ్య‌వ‌స్థ‌లు మొత్తం నిర్వీర్యం అయిపోయానన్నారు. ఐదేళ్లలో చేసిన అప్పులు-త‌ప్పులు.. రాష్ట్రాన్ని నాశ‌నం చేశాయ‌న్నారు. అభివృద్ధినిరోధ‌క నిర్ణ‌యాలు.. అస‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ వంటివి రాష్ట్రానికి ఎప్పుడూ జ‌ర‌గ‌ని న‌ష్టం జ‌రిగేలా చేశాయ‌న్నారు. దోచుకునేందుకే ప‌థ‌కాలు తీసుకువ‌చ్చార‌ని తెలిపారు. ప్ర‌తివిష‌యంలోనూ గోప్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని తెలిపారు.

క‌నీసం కాగ్‌(సీఏజీ) అడిగినా కూడా లెక్క‌లు చెప్ప‌లేద‌ని వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అనేక సంద‌ర్భాల్లో ప‌లు శాఖ‌ల‌పై అనుమానాలు వ్య‌క్తం చేసి.. వైట్ పేప‌ర్ ఇవ్వాల‌ని అడిగితే కేసులు పెట్టించా రే త‌ప్ప‌.. త‌మ‌కు కానీ.. ప్ర‌జ‌ల‌కు కానీ స‌మాధానం చెప్ప‌లేద‌న్నారు. ఇలాంటి పాల‌న కూడా ఒక‌టి ఉంటుందా? అని 40 ఏళ్ల అనుభ‌వం త‌న‌కే ఆశ్చ‌ర్యం వేసింద‌న్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారాన్ని ప్ర‌జ‌ల కోస‌మే వినియోగిస్తామ‌ని వివ‌రించారు. ఈ మేర‌కు స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు.

This post was last modified on November 15, 2024 1:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

12 minutes ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

33 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

1 hour ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago