Political News

రంగంలోకి సునీత కూడా.. వైసీపీకి మ‌రింత టెన్ష‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రో సోద‌రి, దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌.. మ‌రోసారి రం గంలోకి దిగారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున వైసీపీకి వ్య‌తిరేకంగా ఆమె ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. త‌న తండ్రిని దారుణంగా హ‌త్య చేసిన వారికి వైసీపీ అండ‌గా ఉంద‌ని ఆమె ఆరోపించారు. క‌డ‌ప జిల్లా వ్యాప్తంగా ఆమె పాద‌యాత్ర కూడా చేసి ప్ర‌చారం నిర్వ‌హించారు. దీంతో క‌డ‌ప‌లో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ త‌గిలింది.

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి సునీత అరంగేట్రం చేశారు. ప్ర‌స్తుతం వైసీపీ సానుభూతిప‌రులుగా ఉంటూ.. ఆ పార్టీ నేత‌ల‌కు అనుకూలంగా కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో దారుణ‌మైన పోస్టులు పెడుతున్న వారిపై కూట‌మి స‌ర్కారు ఉక్కుపాదం మోపుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో వైసీపీ సానుభూతిపరుల‌ను పోలీసులు అరెస్టు చేసి జైళ్ల‌కు కూడా త‌ర‌లించారు. వీరిలో కీల‌క‌మైన వైఎస్ భార‌తి పీఏ వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి కూడా ఉన్నాడు.

ఇప్పుడు ఈయ‌న‌పై సునీత కూడా ఫిర్యాదు చేసేందుకు క‌డ‌ప‌కు వ‌చ్చారు. పులివెందుల పోలీసు స్టేష‌న్‌లో సునీత వ‌ర్రాపై కేసు పెట్టారు. త‌న‌ను అత్యంత దారుణ ప‌దాల‌తో దూషించార‌ని.. చెప్ప‌డానికి కూడా అలివికాని భాష‌లో రెచ్చిపోయార‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. వ‌ర్రా స‌హా పులివెందుల‌కు చెందిన మరో వైసీపీ సానుభూతిప‌రుడు ఉద‌య్‌పైనా సునీత ఫిర్యాదు చేశారు. వీరిని క‌ఠినంగా శిక్షించి త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆమె అభ్య‌ర్థించారు.

కాగా, ఇప్ప‌టికే వ‌ర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా 34 కేసులు న‌మోదైన‌ట్టు ఏపీ పోలీసులు తెలిపారు. వ‌ర్రా పూర్తిగా స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేశార‌ని, ఆయ‌న చెప్పిన‌ట్టే వ్యాఖ్య‌లు చేశార‌ని కూడా రెండు రోజుల కింద‌ట క‌డ‌ప పోలీసులు చెప్పిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సునీత ఫిర్యాదును కూడా దానికి జ‌త చేసి, మ‌రో కేసున‌మోదు చేయ‌నున్నారు. దీంతో వ‌ర్రాకు మ‌రింత ఉచ్చు బిగుసుకున్న‌ట్ట‌యింది. దీంతో వైసీపీ నాయ‌కులు ముఖ్యంగా పులివెందుల నేత‌లు ఆచూకీ లేకుండా పోయారు.

This post was last modified on November 13, 2024 10:31 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

6 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

10 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago