Political News

రంగంలోకి సునీత కూడా.. వైసీపీకి మ‌రింత టెన్ష‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రో సోద‌రి, దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌.. మ‌రోసారి రం గంలోకి దిగారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున వైసీపీకి వ్య‌తిరేకంగా ఆమె ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. త‌న తండ్రిని దారుణంగా హ‌త్య చేసిన వారికి వైసీపీ అండ‌గా ఉంద‌ని ఆమె ఆరోపించారు. క‌డ‌ప జిల్లా వ్యాప్తంగా ఆమె పాద‌యాత్ర కూడా చేసి ప్ర‌చారం నిర్వ‌హించారు. దీంతో క‌డ‌ప‌లో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ త‌గిలింది.

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి సునీత అరంగేట్రం చేశారు. ప్ర‌స్తుతం వైసీపీ సానుభూతిప‌రులుగా ఉంటూ.. ఆ పార్టీ నేత‌ల‌కు అనుకూలంగా కూట‌మి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో దారుణ‌మైన పోస్టులు పెడుతున్న వారిపై కూట‌మి స‌ర్కారు ఉక్కుపాదం మోపుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో వైసీపీ సానుభూతిపరుల‌ను పోలీసులు అరెస్టు చేసి జైళ్ల‌కు కూడా త‌ర‌లించారు. వీరిలో కీల‌క‌మైన వైఎస్ భార‌తి పీఏ వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి కూడా ఉన్నాడు.

ఇప్పుడు ఈయ‌న‌పై సునీత కూడా ఫిర్యాదు చేసేందుకు క‌డ‌ప‌కు వ‌చ్చారు. పులివెందుల పోలీసు స్టేష‌న్‌లో సునీత వ‌ర్రాపై కేసు పెట్టారు. త‌న‌ను అత్యంత దారుణ ప‌దాల‌తో దూషించార‌ని.. చెప్ప‌డానికి కూడా అలివికాని భాష‌లో రెచ్చిపోయార‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. వ‌ర్రా స‌హా పులివెందుల‌కు చెందిన మరో వైసీపీ సానుభూతిప‌రుడు ఉద‌య్‌పైనా సునీత ఫిర్యాదు చేశారు. వీరిని క‌ఠినంగా శిక్షించి త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆమె అభ్య‌ర్థించారు.

కాగా, ఇప్ప‌టికే వ‌ర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా 34 కేసులు న‌మోదైన‌ట్టు ఏపీ పోలీసులు తెలిపారు. వ‌ర్రా పూర్తిగా స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేశార‌ని, ఆయ‌న చెప్పిన‌ట్టే వ్యాఖ్య‌లు చేశార‌ని కూడా రెండు రోజుల కింద‌ట క‌డ‌ప పోలీసులు చెప్పిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సునీత ఫిర్యాదును కూడా దానికి జ‌త చేసి, మ‌రో కేసున‌మోదు చేయ‌నున్నారు. దీంతో వ‌ర్రాకు మ‌రింత ఉచ్చు బిగుసుకున్న‌ట్ట‌యింది. దీంతో వైసీపీ నాయ‌కులు ముఖ్యంగా పులివెందుల నేత‌లు ఆచూకీ లేకుండా పోయారు.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

1 hour ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago