వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున వైసీపీకి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారికి వైసీపీ అండగా ఉందని ఆమె ఆరోపించారు. కడప జిల్లా వ్యాప్తంగా ఆమె పాదయాత్ర కూడా చేసి ప్రచారం నిర్వహించారు. దీంతో కడపలో కీలకమైన నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.
ఇక, ఇప్పుడు మరోసారి సునీత అరంగేట్రం చేశారు. ప్రస్తుతం వైసీపీ సానుభూతిపరులుగా ఉంటూ.. ఆ పార్టీ నేతలకు అనుకూలంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్న వారిపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో వైసీపీ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు కూడా తరలించారు. వీరిలో కీలకమైన వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డి కూడా ఉన్నాడు.
ఇప్పుడు ఈయనపై సునీత కూడా ఫిర్యాదు చేసేందుకు కడపకు వచ్చారు. పులివెందుల పోలీసు స్టేషన్లో సునీత వర్రాపై కేసు పెట్టారు. తనను అత్యంత దారుణ పదాలతో దూషించారని.. చెప్పడానికి కూడా అలివికాని భాషలో రెచ్చిపోయారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్రా సహా పులివెందులకు చెందిన మరో వైసీపీ సానుభూతిపరుడు ఉదయ్పైనా సునీత ఫిర్యాదు చేశారు. వీరిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె అభ్యర్థించారు.
కాగా, ఇప్పటికే వర్రాపై రాష్ట్ర వ్యాప్తంగా 34 కేసులు నమోదైనట్టు ఏపీ పోలీసులు తెలిపారు. వర్రా పూర్తిగా సజ్జల భార్గవ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేశారని, ఆయన చెప్పినట్టే వ్యాఖ్యలు చేశారని కూడా రెండు రోజుల కిందట కడప పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు సునీత ఫిర్యాదును కూడా దానికి జత చేసి, మరో కేసునమోదు చేయనున్నారు. దీంతో వర్రాకు మరింత ఉచ్చు బిగుసుకున్నట్టయింది. దీంతో వైసీపీ నాయకులు ముఖ్యంగా పులివెందుల నేతలు ఆచూకీ లేకుండా పోయారు.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…