ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ, అమరావతి రాజధాని గురించి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి సీఎం చంద్రబాబు రాజధాని గురించి చెప్పిన మాటలను లోకేష్ సభలో ప్రస్తావించారు. రాజధాని ఒకటే ఉంటుందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చంద్రబాబు అన్నారని లోకేష్ చెప్పారు.
అదే సమయంలో ఉమ్మడి జిల్లాలపై చంద్రబాబు ఫోకస్ చేశారని, ఒక్కో జిల్లాకు ఒక్కో సెక్టర్ కేటాయించి ఫోకస్ చేశారని లోకేష్ అన్నారు. జిల్లాలు యూనిట్ గా అన్ని ఉమ్మడి జిల్లాలకు పరిశ్రమలు, సంస్థలు తీసుకువచ్చారని లోకేష్ గుర్తు చేశారు.
రాయలసీమలో అనంతపురానికి కియా పరిశ్రమ, ఉత్తరాంధ్రకు ఐటీని, నెల్లూరుకు టెలిఫోన్ పరిశ్రమ, కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమ…తెచ్చి డెవలప్ చేసేలా ప్రణాళికలు రచించారని, దాంతోపాటు ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.
విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎన్ఐటీలు, విద్యా సంస్థలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇది అని, అంతేగానీ, 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడం కాదు అంటూ సభలో ప్రస్తావించారు. రుషికొండపై జనం సొమ్ము దుబారా చేసి జగన్ కట్టిన ప్యాలెస్ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
This post was last modified on November 13, 2024 9:56 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…