Political News

500 కోట్లతో ప్యాలెస్ పై జగన్ కు ఇచ్చి పడేసిన లోకేష్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ, అమరావతి రాజధాని గురించి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి సీఎం చంద్రబాబు రాజధాని గురించి చెప్పిన మాటలను లోకేష్ సభలో ప్రస్తావించారు. రాజధాని ఒకటే ఉంటుందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చంద్రబాబు అన్నారని లోకేష్ చెప్పారు.

అదే సమయంలో ఉమ్మడి జిల్లాలపై చంద్రబాబు ఫోకస్ చేశారని, ఒక్కో జిల్లాకు ఒక్కో సెక్టర్ కేటాయించి ఫోకస్ చేశారని లోకేష్ అన్నారు. జిల్లాలు యూనిట్ గా అన్ని ఉమ్మడి జిల్లాలకు పరిశ్రమలు, సంస్థలు తీసుకువచ్చారని లోకేష్ గుర్తు చేశారు.

రాయలసీమలో అనంతపురానికి కియా పరిశ్రమ, ఉత్తరాంధ్రకు ఐటీని, నెల్లూరుకు టెలిఫోన్ పరిశ్రమ, కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమ…తెచ్చి డెవలప్ చేసేలా ప్రణాళికలు రచించారని, దాంతోపాటు ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.

విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎన్ఐటీలు, విద్యా సంస్థలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇది అని, అంతేగానీ, 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడం కాదు అంటూ సభలో ప్రస్తావించారు. రుషికొండపై జనం సొమ్ము దుబారా చేసి జగన్ కట్టిన ప్యాలెస్ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

This post was last modified on November 13, 2024 9:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

1 hour ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

5 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

5 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

5 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

6 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

6 hours ago