ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ, అమరావతి రాజధాని గురించి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి సీఎం చంద్రబాబు రాజధాని గురించి చెప్పిన మాటలను లోకేష్ సభలో ప్రస్తావించారు. రాజధాని ఒకటే ఉంటుందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చంద్రబాబు అన్నారని లోకేష్ చెప్పారు.
అదే సమయంలో ఉమ్మడి జిల్లాలపై చంద్రబాబు ఫోకస్ చేశారని, ఒక్కో జిల్లాకు ఒక్కో సెక్టర్ కేటాయించి ఫోకస్ చేశారని లోకేష్ అన్నారు. జిల్లాలు యూనిట్ గా అన్ని ఉమ్మడి జిల్లాలకు పరిశ్రమలు, సంస్థలు తీసుకువచ్చారని లోకేష్ గుర్తు చేశారు.
రాయలసీమలో అనంతపురానికి కియా పరిశ్రమ, ఉత్తరాంధ్రకు ఐటీని, నెల్లూరుకు టెలిఫోన్ పరిశ్రమ, కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమ…తెచ్చి డెవలప్ చేసేలా ప్రణాళికలు రచించారని, దాంతోపాటు ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.
విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎన్ఐటీలు, విద్యా సంస్థలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇది అని, అంతేగానీ, 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడం కాదు అంటూ సభలో ప్రస్తావించారు. రుషికొండపై జనం సొమ్ము దుబారా చేసి జగన్ కట్టిన ప్యాలెస్ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
This post was last modified on November 13, 2024 9:56 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…