Political News

500 కోట్లతో ప్యాలెస్ పై జగన్ కు ఇచ్చి పడేసిన లోకేష్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ, అమరావతి రాజధాని గురించి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి సీఎం చంద్రబాబు రాజధాని గురించి చెప్పిన మాటలను లోకేష్ సభలో ప్రస్తావించారు. రాజధాని ఒకటే ఉంటుందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చంద్రబాబు అన్నారని లోకేష్ చెప్పారు.

అదే సమయంలో ఉమ్మడి జిల్లాలపై చంద్రబాబు ఫోకస్ చేశారని, ఒక్కో జిల్లాకు ఒక్కో సెక్టర్ కేటాయించి ఫోకస్ చేశారని లోకేష్ అన్నారు. జిల్లాలు యూనిట్ గా అన్ని ఉమ్మడి జిల్లాలకు పరిశ్రమలు, సంస్థలు తీసుకువచ్చారని లోకేష్ గుర్తు చేశారు.

రాయలసీమలో అనంతపురానికి కియా పరిశ్రమ, ఉత్తరాంధ్రకు ఐటీని, నెల్లూరుకు టెలిఫోన్ పరిశ్రమ, కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమ…తెచ్చి డెవలప్ చేసేలా ప్రణాళికలు రచించారని, దాంతోపాటు ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.

విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎన్ఐటీలు, విద్యా సంస్థలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇది అని, అంతేగానీ, 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడం కాదు అంటూ సభలో ప్రస్తావించారు. రుషికొండపై జనం సొమ్ము దుబారా చేసి జగన్ కట్టిన ప్యాలెస్ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Satya

Recent Posts

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

3 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

6 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

6 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

6 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

6 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

6 hours ago