Political News

డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.. బాబు సక్సెస్

కొద్ది రోజుల క్రితం అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రోన్ల టెక్నాలజీ ఓ గేమ్‌ ఛేంజర్‌ అని, డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు, అసాంఘిక శక్తులకు చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.

డ్రోన్ల ద్వారా విజిబుల్ పోలీసింగ్ తగ్గిస్తామని, ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారా అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్ల ఆట కట్టిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విజన్ ను ఏపీ పోలీసులు రియాలిటీలో చేసి చూపించారు. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గంజాయి పంటను ఏపీ పోలీసులు ధ్వంసం చేసిన వైనం చంద్రబాబు విజన్ కు తాజా నిలువెత్తు తార్కాణంగా నిలిచింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు. డ్రోన్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీని ఉపయోగించిన అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు…5 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న గంజాయి పంటను గుర్తించారు. జీ మాడుగుల మండలంలోని డేగలరాయి గ్రామంలో గుర్తించిన ఆ గంజాయి పంటను పోలీసులు తగులబెట్టారు. ఆ గంజాయి పంటను పండిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తాజా ఘటన నేపథ్యంలో చంద్రబాబుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. టెక్నాలజీని వాడడంలో, ఆ టెక్నాలజీని సమాజహితం కోసం ఉపయోగించడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విజన్ 2020 అంటూ ఆనాడు ఐటీ రంగంలో జరగబోయే డెవలప్ మెంట్ ను చంద్రబాబు 20 ఏళ్ల ముందే గుర్తించారని, అదే తరహాలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం గురించి విజన్ 2047 అంటూ చంద్రబాబు 20 ఏళ్ల ముందే చెప్పారని అంటున్నారు. అమరావతిని డ్రోన్ క్యాపిటల్ చేస్తే ప్రపంచం మొత్తం ఏపీవైపు చూస్తుందని చెబుతున్నారు.

This post was last modified on November 11, 2024 4:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

29 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago