Political News

డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.. బాబు సక్సెస్

కొద్ది రోజుల క్రితం అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రోన్ల టెక్నాలజీ ఓ గేమ్‌ ఛేంజర్‌ అని, డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు, అసాంఘిక శక్తులకు చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.

డ్రోన్ల ద్వారా విజిబుల్ పోలీసింగ్ తగ్గిస్తామని, ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారా అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్ల ఆట కట్టిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విజన్ ను ఏపీ పోలీసులు రియాలిటీలో చేసి చూపించారు. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గంజాయి పంటను ఏపీ పోలీసులు ధ్వంసం చేసిన వైనం చంద్రబాబు విజన్ కు తాజా నిలువెత్తు తార్కాణంగా నిలిచింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు. డ్రోన్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీని ఉపయోగించిన అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు…5 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న గంజాయి పంటను గుర్తించారు. జీ మాడుగుల మండలంలోని డేగలరాయి గ్రామంలో గుర్తించిన ఆ గంజాయి పంటను పోలీసులు తగులబెట్టారు. ఆ గంజాయి పంటను పండిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తాజా ఘటన నేపథ్యంలో చంద్రబాబుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. టెక్నాలజీని వాడడంలో, ఆ టెక్నాలజీని సమాజహితం కోసం ఉపయోగించడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విజన్ 2020 అంటూ ఆనాడు ఐటీ రంగంలో జరగబోయే డెవలప్ మెంట్ ను చంద్రబాబు 20 ఏళ్ల ముందే గుర్తించారని, అదే తరహాలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం గురించి విజన్ 2047 అంటూ చంద్రబాబు 20 ఏళ్ల ముందే చెప్పారని అంటున్నారు. అమరావతిని డ్రోన్ క్యాపిటల్ చేస్తే ప్రపంచం మొత్తం ఏపీవైపు చూస్తుందని చెబుతున్నారు.

This post was last modified on November 11, 2024 4:57 pm

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

1 hour ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

4 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

4 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

4 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

5 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

8 hours ago