తెలంగాణలోని వికారాబాద్లో విధ్వంసం చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ను ఓ మహిళ చిత్తు చిత్తుగా కొట్టేసింది. దీంతో తీవ్ర అలజడి నెలకొంది. జిల్లాలోని లగిచర్లలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే.. ఫార్మాసిటీతో ఇక్కడి వ్యవసాయ భూములు, పొలాలు దెబ్బతింటాయన్నది స్థానికులు ఆవేదన. అయినప్పటికీ.. రైతులను గ్రామస్థులను ఒప్పించి అయినా.. ఫార్మాసిటీని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలోనే తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇక్కడ పర్యటించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి వచ్చిన ప్రతీక్ జైన్.. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఫార్మా సిటీ ఏర్పాటు ప్రాధాన్యాలను వివరించారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోవని కూడా చెప్పారు. అయితే.. ఈ క్రమంలో స్థానికులు కలెక్టర్కు నిరసన తెలిపారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడికి గ్రామస్థులు యత్నించారు. ఈ క్రమంలో ఓ మహిళ కలెక్టర్ రెండు చెంపలపై పదే పదే కొట్టారు. ఆయనను తోసి వేశారు. దీంతో పక్కనే ఉన్న మడుగులో కలెక్టర్ కుప్పకూలిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రైతులు, యువకులు.. పెద్ద ఎత్తున గుమిగూడి అధికారుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా రైతు కలెక్టర్ పై చేయి చేసుకోవడంతో అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారిపై కూడా రైతులుస్థానికులు దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాలతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అయినా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడం గమనార్హం. తమ ప్రాంతంలో ఫార్మా సిటీ వద్దని తేల్చి చెబుతున్నారు.
This post was last modified on November 12, 2024 9:49 am
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…