తెలంగాణలోని వికారాబాద్లో విధ్వంసం చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ను ఓ మహిళ చిత్తు చిత్తుగా కొట్టేసింది. దీంతో తీవ్ర అలజడి నెలకొంది. జిల్లాలోని లగిచర్లలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే.. ఫార్మాసిటీతో ఇక్కడి వ్యవసాయ భూములు, పొలాలు దెబ్బతింటాయన్నది స్థానికులు ఆవేదన. అయినప్పటికీ.. రైతులను గ్రామస్థులను ఒప్పించి అయినా.. ఫార్మాసిటీని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలోనే తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇక్కడ పర్యటించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి వచ్చిన ప్రతీక్ జైన్.. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఫార్మా సిటీ ఏర్పాటు ప్రాధాన్యాలను వివరించారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోవని కూడా చెప్పారు. అయితే.. ఈ క్రమంలో స్థానికులు కలెక్టర్కు నిరసన తెలిపారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడికి గ్రామస్థులు యత్నించారు. ఈ క్రమంలో ఓ మహిళ కలెక్టర్ రెండు చెంపలపై పదే పదే కొట్టారు. ఆయనను తోసి వేశారు. దీంతో పక్కనే ఉన్న మడుగులో కలెక్టర్ కుప్పకూలిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రైతులు, యువకులు.. పెద్ద ఎత్తున గుమిగూడి అధికారుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా రైతు కలెక్టర్ పై చేయి చేసుకోవడంతో అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారిపై కూడా రైతులుస్థానికులు దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాలతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అయినా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడం గమనార్హం. తమ ప్రాంతంలో ఫార్మా సిటీ వద్దని తేల్చి చెబుతున్నారు.
This post was last modified on November 12, 2024 9:49 am
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…