తెలంగాణలోని వికారాబాద్లో విధ్వంసం చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ను ఓ మహిళ చిత్తు చిత్తుగా కొట్టేసింది. దీంతో తీవ్ర అలజడి నెలకొంది. జిల్లాలోని లగిచర్లలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే.. ఫార్మాసిటీతో ఇక్కడి వ్యవసాయ భూములు, పొలాలు దెబ్బతింటాయన్నది స్థానికులు ఆవేదన. అయినప్పటికీ.. రైతులను గ్రామస్థులను ఒప్పించి అయినా.. ఫార్మాసిటీని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలోనే తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇక్కడ పర్యటించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి వచ్చిన ప్రతీక్ జైన్.. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఫార్మా సిటీ ఏర్పాటు ప్రాధాన్యాలను వివరించారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోవని కూడా చెప్పారు. అయితే.. ఈ క్రమంలో స్థానికులు కలెక్టర్కు నిరసన తెలిపారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడికి గ్రామస్థులు యత్నించారు. ఈ క్రమంలో ఓ మహిళ కలెక్టర్ రెండు చెంపలపై పదే పదే కొట్టారు. ఆయనను తోసి వేశారు. దీంతో పక్కనే ఉన్న మడుగులో కలెక్టర్ కుప్పకూలిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రైతులు, యువకులు.. పెద్ద ఎత్తున గుమిగూడి అధికారుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా రైతు కలెక్టర్ పై చేయి చేసుకోవడంతో అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారిపై కూడా రైతులుస్థానికులు దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాలతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అయినా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడం గమనార్హం. తమ ప్రాంతంలో ఫార్మా సిటీ వద్దని తేల్చి చెబుతున్నారు.
This post was last modified on November 12, 2024 9:49 am
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…