తెలంగాణలోని వికారాబాద్లో విధ్వంసం చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ను ఓ మహిళ చిత్తు చిత్తుగా కొట్టేసింది. దీంతో తీవ్ర అలజడి నెలకొంది. జిల్లాలోని లగిచర్లలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే.. ఫార్మాసిటీతో ఇక్కడి వ్యవసాయ భూములు, పొలాలు దెబ్బతింటాయన్నది స్థానికులు ఆవేదన. అయినప్పటికీ.. రైతులను గ్రామస్థులను ఒప్పించి అయినా.. ఫార్మాసిటీని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలోనే తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇక్కడ పర్యటించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి వచ్చిన ప్రతీక్ జైన్.. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఫార్మా సిటీ ఏర్పాటు ప్రాధాన్యాలను వివరించారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోవని కూడా చెప్పారు. అయితే.. ఈ క్రమంలో స్థానికులు కలెక్టర్కు నిరసన తెలిపారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడికి గ్రామస్థులు యత్నించారు. ఈ క్రమంలో ఓ మహిళ కలెక్టర్ రెండు చెంపలపై పదే పదే కొట్టారు. ఆయనను తోసి వేశారు. దీంతో పక్కనే ఉన్న మడుగులో కలెక్టర్ కుప్పకూలిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రైతులు, యువకులు.. పెద్ద ఎత్తున గుమిగూడి అధికారుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా రైతు కలెక్టర్ పై చేయి చేసుకోవడంతో అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారిపై కూడా రైతులుస్థానికులు దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాలతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అయినా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడం గమనార్హం. తమ ప్రాంతంలో ఫార్మా సిటీ వద్దని తేల్చి చెబుతున్నారు.
This post was last modified on November 12, 2024 9:49 am
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…