వైసీపీ అధినేత జగన్కు భారీ షాక్ తగలనుందా? ఆయనతోపాటు.. వైసీపీ తరఫున ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే చెప్పాలి. కూటమి సర్కారు తాజాగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్కు లేఖ రాసింది. దీనిలో వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరింది.
అసెంబ్లీ సమావేశాలకు రాబోమంటూ.. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు(ప్రధాన కాదు) వైఎస్. జగన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ఈ లేఖకు జత చేసింది. ఈ నేపథ్యంలో సభకు రాని వారి సభ్యత్వాలను రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉందని.. ఈ నేపథ్యంలో కఠినంగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని కూటమి రాసిన లేఖలో స్పష్టం చేసింది. అంతేకాదు.. గవర్నర్ తీసుకునే నిర్ణయం.. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఉండాలని కూడా కోరింది.
అంటే.. కూటమి సర్కారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. వైసీపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టడమే కాకుండా.. సభ్యత్వాలను సైతం రద్దుచేయించే దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి బడ్జెట్ సమావేశాలను బాయికాట్ చేయడం ద్వారా ఏదో సాధించాలని జగన్ భావించారు. కానీ, అది ఆయన అస్తిత్వానికే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చేలా మారిపోయింది. దీంతో భవిష్యత్తు మరింత గందరగోళంగా మారనుంది.
జగన్ లాంటి వారు ఉంటారని ఊహించి ఉండరు!
వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ.. కూటమి సర్కారు లేఖ రాయడం వరకు బాగానే ఉంది. అసలు గవర్నర్కు ఈ సభ్యత్వాలను రద్దుచేసే అధికారం ఉందా? అనేది ప్రశ్న. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 నుంచి 165 వరకు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన గవర్నర్ విధులను స్పష్టం చేస్తుంది. సభ్యులతో ప్రమాణం చేయించడం, వారి కార్యకలాపాలను పర్యవేక్షించడం, అదేవిధంగా సభను జాగగ్రత్తగా నడిపించడం వంటివి గవర్నర్ అధీనంలో ఉంటాయి.
అయితే.. సభ్యుల సభ్యత్వాలను రద్దు చేసే అధికారం విషయం రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. అంటే.. జగన్ వంటి నాయకులు ఉంటారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు. అందుకే.. సభ్యత్వాల రద్దు అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారన్నది చూడాలి.
2000కు అటు, ఇటు వైభవం చూసిన ఎంతోమంది సీనియర్ హీరోలు.. తర్వాతి కాలంలో యువ కథానాయకుల పోటీని తట్టుకోలేక, మారుతున్న…
గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 దారుణ ఫలితాలు పక్కనపెడితే దర్శకుడు శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో అదనంగా లిక్కర్ రవాణాలోనూ…
దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన ప్రకారమే తన కొత్త సినిమా షూటింగ్ ఇవాళ మొదలుపెట్టేశారు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కలయికలో…
ఏపీలోని బీచ్ లలో విదేశాల్లో మాదిరి బార్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే…
మొబైల్ ఫోన్లు అందరి దగ్గరా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక మొబైల్…