ఈ రోజు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు వెళ్లబోవడం లేదని, సభ జరిగినన్ని రోజులు మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ నిర్ణయంలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ మినహా మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. అయితే, కేవలం తమ ప్రశ్నలు ఉన్నపుడు మాత్రమే వారు సభకు హాజరు కావాలని, మిగతా సమయాల్లో గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
ఇక, తొలిరోజు సమావేశాలకు వైసీపీ సభ్యులు మొత్తం దూరంగా ఉండబోతున్నారు. అంటే, బడ్జెట్ ప్రసంగానికి పూర్తిగా వారు దూరంగా ఉంటారు. రెండో రోజు సమావేశాల నుంచి జగన్ తప్ప మిగతా సభ్యులు తమ ప్రశ్నలు ఉన్నపుడు సభకు హాజరవుతారు. మరోవైపు, శాసన మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులందరూ యథావిధిగా హాజరు కాబోతున్నారు. మండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఈ రోజు 10.30కు వైసీపీ సభ్యులతో జగన్ భేటీ కాబోతున్నారు. జగన్ మాక్ అసెంబ్లీ నిర్వహించి మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో సభకు వెళ్లకపోవడం, సభ జరుగుతున్న సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న విషయంపై వైసీపీ సభ్యులతో జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న 10 రోజులు కార్యకచరణ ఏమిటి అన్నదానిపై కూడా చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on November 11, 2024 10:28 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…