ఈ రోజు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు వెళ్లబోవడం లేదని, సభ జరిగినన్ని రోజులు మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ నిర్ణయంలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ మినహా మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. అయితే, కేవలం తమ ప్రశ్నలు ఉన్నపుడు మాత్రమే వారు సభకు హాజరు కావాలని, మిగతా సమయాల్లో గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
ఇక, తొలిరోజు సమావేశాలకు వైసీపీ సభ్యులు మొత్తం దూరంగా ఉండబోతున్నారు. అంటే, బడ్జెట్ ప్రసంగానికి పూర్తిగా వారు దూరంగా ఉంటారు. రెండో రోజు సమావేశాల నుంచి జగన్ తప్ప మిగతా సభ్యులు తమ ప్రశ్నలు ఉన్నపుడు సభకు హాజరవుతారు. మరోవైపు, శాసన మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులందరూ యథావిధిగా హాజరు కాబోతున్నారు. మండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఈ రోజు 10.30కు వైసీపీ సభ్యులతో జగన్ భేటీ కాబోతున్నారు. జగన్ మాక్ అసెంబ్లీ నిర్వహించి మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో సభకు వెళ్లకపోవడం, సభ జరుగుతున్న సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న విషయంపై వైసీపీ సభ్యులతో జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న 10 రోజులు కార్యకచరణ ఏమిటి అన్నదానిపై కూడా చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on November 11, 2024 10:28 am
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…